Sakshi News home page

నాడు ఆందోళన.. నేడు ఆనందం

Published Sat, Jan 6 2024 1:50 AM

- - Sakshi

కృష్ణగిరి: టీడీపీ హయాంలో పింఛన్‌ అందుకోవడానికి అవ్వాతాతలు ఎన్నో కష్టాలు ఎదుర్కొనేవారు. ఒక పంచాయతీలో ఉండే వందల మంది లబ్ధిదారులకు ఒక్కరే ఇవ్వాల్సి ఉండేది. నెల వచ్చిన రోజు నుంచి లబ్ధిదారులు గ్రామంలోని పంచాయతీ కార్యాలయాలు, గ్రామ చావిడీలు వద్ద పడిగాపులు కాసేవారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూిసిన సందర్భాలు ఉన్నాయి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా మొదటి రెండు మూడు రోజుల్లో లబ్ధిదారుల తలుపు తట్టి ఇస్తున్నారు. దీంతో పింఛన్‌దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దనే ఠంచన్‌గా పింఛన్ల పంపిణీ

Advertisement
Advertisement