● నాటువైద్యం వికటించి బాలుడు మృతి ● గుట్టుచప్పుడు కాకుండా ఆశ్రమం వెనుకాలే పాతిపెట్టిన వైనం ● తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి..
రెబ్బెన(ఆసిఫాబాద్): అనా రోగ్య కారణాలతో ఆశ్రమంలో చేర్పించిన బాలుడికి నా టు వైద్యం వికటించి మృతి చెందడంతో ఆశ్రమం నిర్వాహకుడు, బాలుని తండ్రితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆశ్ర మం వెనుక పాతిపెట్టగా తల్లి ఫిర్యాదుతో గురువా రం విషయం వెలుగులోకి వచ్చింది. ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య తెలిపిన వివరాల ప్రకారం నంబాల గ్రామానికి చెందిన సుల్వ శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతులకు రిషీ (11), అఖిల్ ఇద్దరు కుమారులు. రిషీ కాళ్లకు తిమ్మిర్ల సమస్యతో బాదపడుతుండగా తండ్రి శ్రీనివాస్ మూడేళ్ల క్రితం పాశిగాం శివారులో ఉన్న ఆశ్రమంలో చేర్పించాడు. ఈ ఆశ్రమాన్ని అదే గ్రామానికి చెందిన బామిని భీంరావు నిర్వహిస్తున్నాడు. అనారోగ్య సమస్యలతో ఆశ్రమానికి వచ్చే వారికి నాటువైద్యం చేసేవాడు. ఈ క్రమంలో రిషీకి సైతం నాటువైద్య చేయగా వికటించడంతో మృతి చెందాడు. విషయం బయటకు పొక్కితే ఆశ్రమానికి చెడ్డపేరు వస్తుందని మృతదేహాన్ని ఆశ్రమం వెనుక భాగంలో పాతిపెట్టాడు. అప్పటికే భీంరావు మాయలో ఉన్న శ్రీనివాస్ సైతం అతనికి సహకరించాడు. విషయం తెలియని తల్లి మల్లీశ్వరి తన కుమారుడి కోసం పలుమార్లు భర్తను ప్రశ్నించగా మరో హాస్టల్లో ఉన్నాడని మభ్యపెడుతూ వచ్చాడు. భర్తపై అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆశ్రమం నిర్వాహకుడితో పాటు శ్రీనివాస్ను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
లభ్యమైన ఆస్థికలు
తహసీల్దార్ జ్యోత్స్న సమక్షంలో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, సీఐ చిట్టిబాబు, ఎస్సై చంద్రశేఖర్ బాలున్ని పాతిపెట్టిన స్థలంలో తవ్వకాలు జరిపించారు. 4 ఫీట్ల లోతులో అస్థికలు బయటపడడంతో మంచిర్యాలకు చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు సురేందర్రెడ్డి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించారు. డీఎన్ఏ, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు.
నేను లొంగకపోవడంతో నా బిడ్డను చంపాడు..
నామీద కన్నేసిన భీంరావు అతనికి లొంగకపోవడంతో నాకొడుకును చిత్రహింసలకు గురిచేసి పొట్టన పెట్టుకున్నాడు. నాకొడుకు నేనే మరుగుమందు పెట్టానంటూ పుకార్లు పుట్టించి ఆనెపంతో నాభర్తను రెచ్చగొట్టాడు. దీంతో నాభర్త నన్ను పలుమార్లు శారీరకంగా, మానసికంగా వేధించడంతో మానసికస్థితి సరిగా లేకుండా పోయింది.