● 10 తులాల పట్ట గొలుసులు మాయం
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం నర్సింగపూర్కు చెందిన బైరగోని మల్లేశం ఇంట్లో దొంగతనం జరిగిందని గురువారం బాధితుడు చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బైరగోని సునిత మల్లేశం దంపతలు వేములవాడలో నివా సం ఉంటున్నారు. గురువారం తమ స్వగ్రామం నర్సింగపూర్కు వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి దొంగలు చొరబడి.. 10 తులాల వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లారు. చందుర్తి పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. వేలిముద్రల ఆధారంగా దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఎస్సారెస్పీ కెనాల్లో గుర్తు తెలియని మృతదేహం
మేడిపల్లి(జగిత్యాల): కొండపూర్ శివారు ఎస్సారెస్పీ కెనాల్లో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చినట్లు ఏఎస్సై హస న్ మహమ్మద్ తెలిపారు. మృతుడి వయసు 40 –45 ఏళ్లు ఉంటుందని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచామన్నారు. వివరాలు తెలిసినవారు మేడిపల్లి పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. కొండపూర్ పంచా యతీ కార్యదర్శి సయ్యద్ ఇషాక్ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కొత్తపల్లిలో..
తిమ్మాపూర్(మానకొండూర్): కొత్తపల్లిలో గురువా రం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై చేరాలు తెలిపారు. పెట్రోల్ బంకు సమీపంలోని ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్టు కింద గుర్తించామన్నారు. మృతుడి వయసు 40–50 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని, 15 రోజులుగా గ్రామంలో తిరుగుతున్నాడని స్థానికులు తెలిపారు. ఎండ తీవ్రతకు చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి అరుణ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే ఎల్ఎండీ పోలీస్స్టేషన్లో లేదా 87126 70770 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.