చదరంగం పోటీలలో బాలల ప్రతిభ | Sakshi
Sakshi News home page

చదరంగం పోటీలలో బాలల ప్రతిభ

Published Thu, Apr 18 2024 10:25 AM

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపికై న క్రీడాకారులు  - Sakshi

అమలాపురం టౌన్‌: జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అమలాపురం విద్యానిధి స్కూలులో బుధవారం జిల్లా స్థాయి అండర్‌ –17 చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా బాలబాలికలు చదరంగంలో తమ ప్రతిభను చాటారు. నలుగురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీలను జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి తాడి వెంకట సురేష్‌ పర్యవేక్షించారు. బాలుర విభాగంలో ద్రాక్షారపు సాత్విక్‌, బండారు నాని ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో పినిశెట్టి ధరణి, నూకపెయ్యి హన్విక మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. విజయవాడలోని పోరంకి గ్రీన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఈనెల 20వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు నలుగురూ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తారు. కాగా.. జిల్లా స్థాయి పోటీలకు 40 మంది బాల బాలికలు హాజరయ్యారు. విజేతలకు విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్‌ ఏబీ నాయుడు బహుమతులు అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement