బడుగు, బలహీన వర్గాల ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వారి ఉన్నతిని కాంక్షిస్తూ వేల కోట్ల రూపాయలు వెచ్చించారు. మీకు మంచి జరిగిందని భావిస్తేనే మా ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి ఆశీర్వదించండని ధైర్యంగా ప్రజలను అడుగుతున్న ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.