హసన్పర్తి : ఎక్స్పో ప్రాజెక్టు (ఎక్స్ పో–యంత్రం 2.0) అద్భుతమని ఏషియా యూనివర్సిటీ రిక్యూటింగ్ డాక్టర్ మహ్మద్ ఫహద్ అన్నారు. హసన్పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ తన రెండో వెర్షన్ ప్రాజెక్టు ఎక్స్ పో–యంత్రం 2.0ను శుక్రవారం ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి ఫహద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అనేక విషయాలను తెలుసుకునేందుకు ఇంటర్న్షిప్లు సరైన వేదిక అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ దీపక్గార్గ్ మాట్లాడుతూ.. ఔట్పుట్ సాంకేతికతను బదిలీ చేయడం తదితరాలకు ఎక్స్పో యంత్ర 2.0 ప్రారంభించామన్నారు. స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈసందర్భంగా అతిథులను మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, యంత్ర సమన్వయ కర్తలు, ఆర్గనైజింగ్ బృంద సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.