
బైక్లు ఢీకొని యువకుడి మృతి
నిడదవోలు రూరల్: కోరుమామిడి గ్రామంలో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు, కోరుమామిడి గ్రామానికి చెందిన ఆరుగొల్లు చంద్రరావు కుమారుడు పండు(21) గేదెల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి బైక్పై ఇంటికి వెళుతుండగా, ఎదురుగా మరో బైక్పై వస్తున్న అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పిట్టా సందీప్ కోరుమామిడి కంచాలమ్మ అమ్మవారి గుడి సమీపంలో పండును వేగంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పండును నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు అతడి తండ్రి చంద్రరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.