నేటి నుంచి డిగ్రీ పరీక్షలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

Published Tue, Apr 23 2024 8:35 AM

-

అనంతపురం: ఎస్కేయూ పరిధిలో మంగళవారం డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 29 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు. 42,836 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేశారు. రెండో సెమిస్టర్‌లో రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలకు 15,703 మంది, నాలుగో సెమిస్టర్‌కు 14,436, ఆరో సెమిస్టర్‌కు 12,697 మంది దరఖాస్తు చేశారు.రెండో సెమిస్టర్‌(న్యూ రెగ్యులేషన్స్‌)పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 15 వరకు, పాత రెగ్యులేషన్స్‌ ఈ నెల 23 నుంచి మే 29 వరకు జరుగుతాయి. నాలుగో సెమిస్టర్‌ (న్యూ, ఓల్డ్‌ రెగ్యులేషన్స్‌) పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తారు. ఆరో సెమిస్టర్‌ (న్యూ రెగ్యులేషన్స్‌) పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 20 వరకు, పాత రెగ్యులేషన్స్‌ పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 15 వరకు జరుగుతాయి.

Advertisement
Advertisement