ఖోఖో సబ్‌ జూనియర్‌ జిల్లా జట్ల ఎంపిక | Sakshi
Sakshi News home page

ఖోఖో సబ్‌ జూనియర్‌ జిల్లా జట్ల ఎంపిక

Published Mon, Nov 20 2023 12:40 AM

ఎంపికై న సబ్‌ జూనియర్‌ బాల, బాలికల జట్లు  - Sakshi

ఉరవకొండ: త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఖోఖో పోటీలకు ప్రాతినిథ్యం వహించే జిల్లా సబ్‌జూనియర్‌, జూనియర్‌ బాల, బాలికల జట్ల ఎంపిక ప్రక్రియ ఆదివారం ఉరవకొండ వేదికగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి 280 మంది క్రీడాకారులు హాజరు కాగా, వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న సబ్‌ జూనియర్‌ బాలుర జట్టులో మారుతీకుమార్‌, అజయ్‌కుమార్‌, నాగరాజు, గణేష్‌, భానుప్రకాష్‌, జ్యోతిరామ్‌, పెన్నయ్య, రాజేష్‌, ప్రతాప్‌, లోహితరాజు, హర్షవర్దన్‌, భారత్‌కుమార్‌, నందకుమార్‌, గంగాధర్‌, అఖిల్‌, తోయజ్‌, ఫృథ్వీరాజ్‌, సాయిచరణ్‌తేజ్‌, దీపక్‌కుమార్‌, భరత్‌ ఉన్నారు. అలాగే బాలికల జట్టులో మౌనిక, సునీత, హబీబా, మైనా, అనిత, చందన, స్వప్న, భార్గవి, సిద్దికా, ప్రణవి, రాజేశ్వరి, శాంతి, కావేరి, నిఖిత, చైతన్య, శ్రావణి, లక్ష్మమ్మ, పూజిత, నందిని, సాహితి, మంజుల, మౌనిక చోటు దక్కించుకున్నారు. జూనియర్‌ విభాగం బాలికల జట్టుకు అఖిల, రాజ్యలక్ష్మి, ఐశ్వర్య, సునీత, సంధ్య, షాహిదా, త్రివేణి, ముబీనా, ఆశా, యమున, జాహ్నవి, మౌనిక, చంద్రమ్మ, లావణ్య, సోనిక, జ్యోతి, త్రిష, రిత్విక ఎంపిక కాగా, బాలుర జట్టులో రవి, పురుషోత్తం, పెన్నోబులేసు, సురేష్‌, సంతోష్‌, హమీద్‌, శోచన్‌, ఉపేంద్ర, శేకప్ప, భరత్‌కుమార్‌, దేవేంద్ర, రాజన్న, మారేష్‌, జయరాములు, దిలీప్‌కుమార్‌, షబ్బీర్‌బాషా, లోకేష్‌, చరణ్‌, తరుణ్‌కుమార్‌, అనిల్‌కుమార్‌ చోటు దక్కించుకున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకూ గుంటూరు జిల్లా నరసారావు పేటలో సబ్‌ జూనియర్‌ పోటీలు, డిసెంబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకూ మార్కాపురంలో జూనియర్‌ పోటీలు జరగనున్నాయి. ఎంపికలను పీడీలు మారుతీప్రసాధ్‌, ప్రభాకర్‌, కేశవమూర్తి, రాజేష్‌, సురేష్‌, రాజేష్‌, హలీమా, ప్రసాద్‌ పర్యవేక్షించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement