సాక్షి,పాడేరు: పాడేరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ సమర్పించారు. నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, నేతలతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిఅందజేశారు. భారీగా శేణ్రులు తరలిరావడంతో పార్టీ జెండాలు రెపరెపలాడాయి. జయహో జగనన్న.. జయహో వైఎస్సార్సీపీ నినాదాలు హోరెత్తాయి. ముందుగా విశ్వేశ్వరరాజు, శివారత్నం దంపతులు పట్టణంలో మోదకొండమ్మ ఆలయంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి, పాడేరు, చింతపల్లి జెడ్పీటీఈసలు కిముడు గాయత్రి, పోతురాజు బాలయ్య, పాడేరు పరిశీలకులు కె.శ్రీకాంత్రాజు, పీలా వెంకటలక్ష్మి తదితరులతో కలిసి పూజలు చేశారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి కుంకుమార్చన జరిపించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నరసింగరావు విశ్వేశ్వరరాజుకు అభినందనలు తెలిపారు. పార్టీ శేణ్రులు ఆయనను శాలువాలతో సత్కరించారు. అనంతరం వారితో కలిసి విశ్వేశ్వరరాజు ప్రచార రథంపై పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తీన్మార్ డప్పులు, థింసా నృత్యాలు, కార్యకర్తలు డ్యాన్సులతో హోరెత్తించారు. పాడేరు పాత బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ సాగింది. జగన్మోహన్రెడ్డి ఫొటోలతో ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరకు ఎంపీ మాధవి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో విశ్వేశ్వరరాజు తన నామినేషన్ పత్రాలు, అపిడవిట్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ భావన వశిష్టకు అందజేశారు.
భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ర్యాలీగా వెళ్లి సమర్పణ
పాడేరులో హోరెత్తిన జై జగన్ నినాదాలు