-
భగ్గుమన్న అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు, మెట్రో : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి భగ్గుమంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా 14 శాసనసభ స్థానాలు కట్టబెట్టిన జిల్లాలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే అసమ్మతి మొదలైంది. మంత్రి వర్గ విస్తరణతో అది మరింత ముదిరింది. విస్తరణలో ఒకరికి అదనంగా పదవి దక్కిందన్న ఆనందం ఏ మాత్రం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అండగా నిలబడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఉదయం చింతమనేని వర్గం ఏలూరులోని జిల్లాపరిషత్ కార్యాలయంలో సమావేశమైంది. దెందులూరుకు చెందిన పార్టీ నేతలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, సొసైటీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చింతమనేనికి అన్యాయం జరిగిందంటూ పెద్దపెట్టున నినదించారు. చింతమనేని వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన వారికి కనీస గుర్తింపు లేకుండా పోయిందని, గత ఎన్నికల వరకూ వేరే పార్టీలో ఉండి తెలుగుదేశంలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటని నిరసన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం జరగనప్పుడు పార్టీలో ఉండటం అనవసరమని, పదవులకు రాజీనామాలు చేద్దామని చింతమనేని అనుచరులు నినాదాలు చేశారు. అందరూ మూకుమ్మడి రాజీనామాలకు సన్నద్ధమయ్యారు. దీంతో చింతమనేని వద్దకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి), ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును అధిష్టానం చర్చలకు పంపింది. చింతమనేని వెంటే మేము : బడేటి పార్టీకి చింతమనేని రాజీనామా చేస్తే తామూ ఆయన వెంటే ఉంటామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. ఆయనను ఒంటరి కానివ్వబోమని పేర్కొన్నారు. అనంతరం చింతమనేని అమరావతికి వెళ్లి ఎమ్మెల్యే, విప్ పదవులకు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందచేశారు. అనంతరం ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ‘పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువంటేæ ఎలా?, పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయను, అన్నీ తెలిసిన నీవే ఇలా చేస్తే ఎలా అంటూ చింతమనేనికి సీఎం క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. నిరాశలో మొడియం చివరి వరకూ మంత్రి పదవి వస్తుందని ఆశించిన పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కూడా అసంతృప్తి చెందారు. ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లాలో సీనియర్ నేతలైన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, నిమ్మల రామానాయుడు తదితరులూ తమను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. మైనారిటీ కోటాలో స్థానం దక్కుతుందన్న ప్రచారం చివరి వరకూ జరిగినా తమను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఎమ్మెల్సీ షరీఫ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు మంత్రి పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తప్పించడంపై మాల సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది. అసెంబ్లీలో 21 మంది మాల సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఉన్నా.. సరైన న్యాయం జరగలేదని, మహిళా మంత్రికి అన్యాయం చేశారంటూ మాలమహానాడు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో అంతర్గత లుకలుకలను బయటపెట్టింది. అవసరమైతే పార్టీ పెడతా ! ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, వీరాంజనేయులుతో చర్చించిన సమయంలో తను ప్రజాప్రతినిధిగా కొనసాగడం ఇష్టం లేదనీ, తనను నియోజకవర్గ నాయకులు ఆస్తులమ్మి, సొమ్ములు కూడబెట్టి గెలిపించారని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి దక్కలేదని రాజీనామాకు సిద్ధపడటం లేదనీ, పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉంటే అన్యాయం జరిగిందనే కారణంతోనే రాజీనామా చేయనున్నట్టు ఆవేదన వెళ్లగక్కారు. కిందిస్థాయి నాయకుల మాటే తనకు శిరోధార్యమని, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా వేరే పార్టీలోకి వెళ్లననీ, కావాలంటే వేరే పార్టీ పెట్టి పోటీ చేస్తానని చింతమనేని ప్రకటించారు. అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని తేల్చిచెప్పారు. రెండు మూడు రోజుల్లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాక భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని స్పష్టం చేశారు. -
అనంత టీడీపీలో ‘డెంగీ’ వార్ !!
-
టీడీపీలో ‘డెంగీ’ వార్ !!
ఎమ్మెల్యే, మేయర్, కమిషషనర్కు కులపిచ్చి పట్టుకుందని ఎంపీ జేసీ ఆరోపణ కార్పొరేషన్లో అవినీతిపై ఈ నెల 21న సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం జేసీవ్యాఖ్యలపై పార్టీ వివరణ కోరుతుందన్న ఎమ్మెల్యే బంధాలు, సంబంధాలపై జేసీ చేసిన వ్యాఖ్యలపై కూడా చౌదరి సెటైర్లు జేసీకున్న బంధాలు, సంబంధాలు, సహచర్యాలు తనకు లేవని వ్యాఖ్యలు అధికారపార్టీనేతల వైఖరిని తప్పుబడుతున్న జనం తెలుగుదేశం పార్టీలో ‘డెంగీ’వార్ మొదలైంది. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య కొంతకాలంగా నడుస్తున్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ‘అనంత’లోని పాతూరులో డెంగీతో చిన్నారులు చనిపోయిన అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఇద్దరూ పరస్పర ఆరోపణలకు దిగారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్పై జేసీ దివాకర్రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగారు. జేసీ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే ఎమ్మెల్యే చౌదరి కూడా ఘాటుగానే స్పందించారు. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న పరిస్థితిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు రాజకీయలబ్ధి కోసం వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని జనం మండిపడుతున్నారు. వినాయక్నగర్లో ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు డెంగీతో ఈనెల 15న ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది. మతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఎంపీ జేసీదివాకర్రెడ్డి శనివారం వినాయక్నగర్ వెళ్లారు. వారిని పరామర్శించిన అనంతరం స్థానికులు పలు సమస్యలను ఎంపీ దష్టికి తీసుకొచ్చారు. మంచినీరు, అపరిశుభ్రత, మురికి కాలువలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దీనికి జేసీ స్పందిస్తూ ‘నాకు చెబితే ఏం చేస్తాను! వాళ్లు చేయాలి. చేయలేదు. వాళ్ల వద్దకు వెళ్లి ధర్నాలు చేయండి’ అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఓట్లేసి గెలిపించిన ఎంపీనే నిస్సహాయత వ్యక్తం చేసినట్లుగా మాట్లాడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో తిరిగి ఆదివారం జేసీ విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్పై తీవ్రంగా స్పందించారు. కులపిచ్చి, బంధుప్రీతితో కార్పొరేషన్ను అవినీతి కూపంగా మార్చారని ధ్వజమెత్తారు. డెంగీతో పిల్లలు చనిపోతుంటే కొందరు అవినీతి మత్తులో తూగుతున్నారని పరోక్షంగాపై ముగ్గురిపై ఆరోపణలు చేశారు. కార్పొరేషన్ అవినీతిపై ఆధారాలతో ఈనెల 21న ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. కులగజ్జి, బంధుప్రీతి, అవినీతి వ్యాఖ్యలు నగరంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పలురకాల చర్చలకు దారితీశాయి. ఓవైపు కార్పొరేషన్లోని అవినీతిని వాస్తవమే అని చర్చిస్తూనే, ఎంపీగా దివాకర్రెడ్డి రెండున్నరేళ్లలో ఎందుకు అవినీతిపై ఫిర్యాదు చేయలేదు. సమీక్షలు పెట్టుకోలేదని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. జేసీ పేరు ఉచ్ఛరించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. కులం గురించి మాట్లాడేవారు ‘యద్భావం తద్భవతే’ అనేమాటను గుర్తుంచుకోవాలన్నారు. కార్పొరేషన్లో అవినీతి వాస్తవమేనని, విడతవారీగా దాన్ని రూపుమాపుతామన్నారు. అవినీతి రూపుమాపేందుకు స్వయంగా రంగంలోదిగానని చెబుతూ స్వరూపను పూర్తిగా డమ్మీని చేసేలా మాట్లాడారు. రాజకీయ నాయకుల్లో అవినీతి ఎక్కువగా ఉందని, కార్పొరేషన్ అవినీతిపై మాట్లాడుతున్నారని, ఒకవేలు ఎదుటు వ్యక్తిని చూపిస్తే మూడు వేళ్లు మనల్ని చూపిస్తాయని పరోక్షంగా జేసీ కూడా అవినీతిపరుడే అనే అంశాన్ని చౌదరి చెప్పకనే చెప్పారు. బంధాలు, సంబంధాల గురించి కూడా జేసీ మాట్లాడుతున్నారని...70 ఏళ్లు వయస్సున్న ఆయన తన జీవితంలో బంధాలు, సంబంధాలు..ఇంకేమైనా ఉన్నవాటి గురించి ఆయనకు బాగా తెలుసునని, లాంటి సహచర్యాలు ఆయనకు ఉన్నట్లుగా తనకు ఇప్పటి వరకూ లేవని సెటైర్లు వేశారు. జేసీ వ్యాఖ్యలు క్రమశిక్షణ ఉల్లంఘనకు కిందకు వస్తాయని, దీనిపై పార్టీ వివరణ కోరుతుందని పరోక్షంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అనేలా చౌదరి మాట్లాడారు. అందరూ సర్వమంగళ మేళాలే! చిన్నారుల చావుల అంశాన్ని రాజకీయం చేసే ఎంపీ, ఎమ్మెల్యే నగరంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్లో ప్రతీది అవినీతి మయమనేది అందరికీ తెలుసని, దీనిపై మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని, దీన్నిబట్టి చూస్తే అవినీతిలో అందరూ భాగస్వాములే అనుకోవల్సి వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్యం మంచినీళ్లు కూడా అందించలేని మేయర్, ఎమ్మెల్యే,...ఇలాంటి సమస్యలు చెబితే ‘నేనేం చేస్తా! వారినే అడగండి’ అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పే ఎంపీలు ఉండటం తమ దౌర్భాగ్యమని ప్రతిపక్షనేతలూ విమర్శిస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement