-
వేముల రోహిత్ కేసు మూసేస్తున్నాం.. హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రోహిత్ కేసు క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవన్న పోలీసులు.. వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేల్చారు. పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని రిపోర్టులో తేల్చారు. కాగా, 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్యపై గతంలో 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు సైతం 8 సంవత్సరాల క్రితం పోలీసులు జోడించారు. పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ కారణమని ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. -
‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంచ్ స్టే ఇచ్చింది.10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని గతంలో కమిషన్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ తెలిపింది. ఈ నివేదికపై అప్పటి షాద్నగర్ సీఐ శ్రీధర్తో పాటు తహసీల్దార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఎన్కౌంటర్ తర్వాత జరగాల్సిన ప్రొసిజర్స్లో లోపాలు ఉన్నాయన్న కమిషన్..‘దిశ’ నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని రిపోర్టు ఇచ్చింది. ఎన్కౌంటర్ వాడిన పిస్తోళ్ల వివరాలు కూడా సరిగ్గా లేవని నివేదికలో పేర్కొన్న కమిషన్.. అప్పటి ఎన్కౌంటర్ను పూర్తిగా తప్పుబట్టింది. కమిషన్ రిపోర్ట్పై ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది -
బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. కేంద్రం కీలక మార్పులు?
జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్కు భిన్నంగా ప్రతిపాదిత బర్త్ రిపోర్ట్లో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ నివేదించింది. ఈ కథనం ప్రకారం.. కొత్త ఫారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోడల్ రూల్స్కు అనుగుణంగా ఉంది. దీన్ని అమలులోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలి. ఆయా ప్రభుత్వాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కాగా దత్తత తీసుకునే తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి. జననాలు, మరణాల రికార్డుల భద్రత కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డ్లు, ఎలక్టోరల్ రోల్స్, పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) సహా అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను పార్లమెంటు ఉభయ సభలు గతేడాది ఆగస్టులో ఆమోదించాయి. దీని ప్రకారం.. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తిస్తారు. -
లగ్జరీ ఇళ్లకు భలే డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస గృహాల(లగ్జరీ ఇళ్లు)కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. రూ.50 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న లగ్జరీ ఇళ్లు విక్రయాలు గతేడాదిలో 51% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. అమ్ముడైన మొత్తం 45 లగ్జరీ ఇళ్ల విలువ రూ.4,319 కోట్లుగా ఉంది. వీటిలో 58% అపార్ట్మెంట్లు, 42% బంగ్లాలు. అంతకు ముందు ఏడాది(2022)లో అమ్ముడైన 29 విలాస గృహాల విలువ రూ.2,859 కోట్లుగా ఉంది. మొత్తం 45 యూనిట్లలో ముంబైలో విక్రయమైన 29 లగ్జరీ ఇళ్ల విలువ రూ.3,031 కోట్లు, ఢిల్లీలోని ఎన్సీఆర్లో అమ్ముడైన 12 లగ్జరీ ఇళ్ల విలువ రూ.1,043 కోట్లు, బెంగుళూరు విక్రయమైన 4 లగ్జరీ ఇళ్ల విలువ రూ.245 కోట్లుగా ఉంది. ‘‘అత్యంత సంపన్నల నుంచి అధిక గిరాకీ ఉండటంతో లగ్జరీ ఇళ్ల విక్రయాలు పెరిగాయి. అమ్ముడైన 45 లగ్జరీ ఇళ్లలో రూ.100 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న ఇళ్ల సంఖ్య 14గా ఉంది. వీటిలో అత్యధిక అమ్మకాలు ముంబై జరిగాయి. విలాసవంతమైన ఆస్తులపై సంపన్నులకు విశ్వాసం క్రమంగా పెరుగుతుండంతో భవిష్యత్తులోనూ లగ్జరీ అమ్మ కాలు పెరగొచ్చు’’ అని జేఎల్ఎల్ ఇండియా రీసెర్చ్ హెడ్ సమంతక్ దాస్ తెలిపారు. -
నిరుద్యోగ ‘యువ భారత్’
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగయువత అనేక సవాళ్లు ఎదు ర్కొంటోంది. భారత్లోని నిరుద్యోగుల్లో 83 శాతం యువతే ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమికోన్నత విద్య (సెకండరీ) లేదా ఆపై ఉన్నతవిద్య (హయ్యర్) అభ్యసించిన యువత నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. వీరి శాతం 2000లో 35.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 65.7 శాతానికి (నిరుద్యోగుల శాతం) పెరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ (ఐహెచ్డీ) సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. 2000– 2019 సంవత్సరాల మధ్య యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (అండర్ ఎంప్లాయ్మెంట్) తగ్గడం వంటివి భారీగా పెరగగా, కోవిడ్ సందర్భంగా మాత్రం కొంత తగ్గుదల నమోదైనట్టుగా ఈ నివేదిక పేర్కొంది. 2000– 2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం దాదాపు మూడింతలు (5.7 – 17.5 శాతం) పెరిగింది. 2022 నాటికి అది 12.4 శాతానికి తగ్గింది’ అని ఈ నివేదిక చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. తెలంగాణ విషయానికొస్తే... సెకండరీవిద్య, ఆపై ఉన్నత చదువులు చదివినా తెలంగాణకు చెందిన యువత ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024లో నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం... ♦ 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 30.3 శాతం అమ్మాయిలు, 18.3% అబ్బాయిలు (మొత్తం 48.6%) నిరుద్యోగులుగా ఉన్నారు. అదే జాతీయ స్థాయిలో ఇదే కేటగిరిలో చూస్తే 65.7 శాతంగా ఉంది. ♦ రాష్ట్రంలో 2005 నుంచి యువతలో నిరుద్యోగిత శాతమనేది క్రమంగా పెరుగుతోందని ఈ నివేదిక తెలిపింది. 2005లో చూస్తే.. యువతలో 14.1నిరుద్యోగ శాతం ఉండగా, 2012కల్లా 14.9 శాతానికి, 2019 కల్లా 34.9 శాతానికి చేరుకుంది. ♦ అదే 2022 సంవత్సరంలో 21.7శాతానికి తగ్గుముఖం పట్టింది. అయితే 2022లో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా సాధించారు. నిరుద్యోగిత శాతం అబ్బాయిల్లో 18.3 శాతం ఉండగా, అమ్మాయిల్లో అది 30.3 శాతంగా ఉంది. ♦ 2022లో రాష్ట్రంలో 27.5% మంది యువత ‘నాట్ ఇన్ ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్స్న్ ఆర్ ట్రైనింగ్’ (నీట్) కేటగి రిలో ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2005 నుంచి 2019 మధ్యలో అది 17.9 శాతం నుంచి 34 మధ్యలో ఉంది. ♦ రాష్ట్రంలో పదిహేనళ్లకు పైబడిన క్యాజువల్ వర్కర్ల నెలవారీ వేతనం విషయానికొస్తే...2022లో మగవారిది రూ.10,175గా, మహిళలది రూ.6,642గా ఉంది. మనోళ్ల టెక్ స్కిల్స్ అంతంతే... దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే తెలంగాణ సాంకేతికంగా, టెక్ స్కిల్స్లో ఉన్నతస్థాయిలో నిలుస్తుందని అనుకుంటాం. కానీ... ♦దాదాపు 90 శాతం యువత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా రాయలేకపోతున్నారు. ♦ అధికశాతం విద్యార్థులకు ఎమ్మెస్ ఎక్సెల్ తదితర అప్లికేషన్లలో విస్తృతమైన పరిజ్ఞానం, అవగాహన లేదు. ♦ 50 శాతానికి పైగా యువత అటాచ్మెంట్తో కూడిన ఈ–మెయిల్ను కూడా పంపించలేకపోతున్నారు. ♦ 53.83 శాతం యువత కాపీ చేసి ఫైల్ను మూవ్ చేయగలుగుతున్నారు. ♦ 50.4 శాతం మంది ఏదైనా ఫైల్ను కాపీ, పేస్ట్ చేయగలుగుతున్నారు. ♦ కేవలం 14.7 శాతం మాత్రమే సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే... ♦ తెలంగాణలోని అనేక స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లున్నా, సాంకేతిక అంశాలు బోధించే టీచర్లు, టెక్ నైపుణ్యం ఉన్నవారు లేకపోవడమే కారణమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ అంశాలన్నింటిని కూడా పాఠశాల బోధనాంశాల్లో చేర్చితేనే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
బైక్తో సహా బావిలో పడి రైతు మృతి
ఎన్నికల్లో కమ్యూనిస్టులే ప్రధాన భూమిక
పర్యావరణ రక్షణకు న్యాయవ్యవస్థ కృషి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు
రేపే నీట్
జీవాలను కాపాడుకుందాం..
వేడి క్షణాల్లో గుర్తింపు!
అద్భుతం.. ప్రాజెక్టు ఎక్స్పో
కోడ్ ఉల్లంఘిస్తే గట్టి చర్యలుండాలి!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement