-
పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. -
మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
సాక్షి, నల్గొండ జిల్లా: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన వారు పట్టపగలే కార్యాలయంలో కుర్చీలో కునుకు తీస్తున్నారు.తాజాగా, పని వేళల్లో దర్జాగా ఆఫీసులో నిద్రపోతున్న మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టేబుల్పై కాళ్లేసి మరీ కమిషనర్ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న కమిషనర్ ఫొటో వైరల్గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పనులను పక్కన పెట్టి కార్యాలయంలోనే కునుకు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే పనిచేయాలని (రిటర్న్-టు-ఆఫీస్) ఆదేశాలు జారీ చేశాయి. ఈ విధానాన్ని ఇప్పుడు 'కాగ్నిజెంట్' కంపెనీ అమలు చేసింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా 'రిటర్న్ టు ఆఫీస్' పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. 2023లో విప్రో, టీసీఎస్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.టెక్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న క్రమంలో.. కాగ్నిజెంట్ సీఈఓ 'రవి కుమార్' తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ ఆఫీసు నుంచి వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని పేర్కొన్నారు.కాగ్నిజెంట్ కంపెనీలు మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 2.54 లక్షల మంది భారతదేశంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటి నుంచి పని చేయడంలో కంటే ఆఫీసు నుంచి పనిచేస్తేనే పనితీరు మెరుగ్గా ఉంటుందని సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. -
ఆఫీస్లో నోటీసులు.. షాక్లో ఉద్యోగులు
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఆర్ధిక మాంద్యం దెబ్బకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఉద్యోగుల్ని తొలగిస్తూనే.. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల టైం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలా ఓ ఆఫీస్ మేనేజ్మెంట్ ‘టైమ్ క్లాక్ ఫ్రాడ్’ పేరుతో ఓ మెమోను జారీ చేసింది. ఇప్పుడు ఆ మెమో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ రెడ్డిట్ యూజర్ హెచ్ఆర్ విభాగం జారీ చేసిన మెమోని షేర్ చేశారు. ఆ మెమోలో ఇలా ఉంది. టైమ్ క్లాక్ మోసాన్ని అరికట్టేందుకు ఉద్యోగులు ఐదు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలలో భాగంగా ఆఫీస్ వర్క్ ప్రారంభించే ముందు ఉద్యోగులు వ్యక్తిగత కార్యకలాపాలు, బ్యాగ్, ఇతర వస్తువులను సర్ధడం లాంటి పనులు చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి తప్పని సరిగా మెమోలోని అంశాలను పాటించాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు మెమోలో హైలెట్ చేసింది. దీంతో పాటు 10 మంది ఉద్యోగులు రోజుకు 10నిమిషాలు వృధా చేస్తే... అంటే రోజుకు వంద గంటలు నెలకు మూడు వేలగంటలు.. అలా 50 గంటల పేరోల్ లాస్ అవుతుందని తెలిపింది. దీంతో మెమోలో పేర్కొన్న నిబంధనలపై నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది తమ అఫీస్లో ఎదురవుతున్న అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
పార్టీ ఆఫీసులోకి వెళ్లనివ్వడం లేదు: ‘ఆప్’ నేతలు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ తమ పార్టీ ఆఫీసును సీజ్ చేసి తమను లోపలికి వెళ్లకుండా చేశారని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి మండిపడ్డారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విటర్లో) ఆమె ఒక పోస్టు చేశారు. Aam Aadmi Party office has been sealed off from all sides. How can access to a national party office be stopped during the Lok Sabha election? This against the ‘level playing field’ promised in the Indian Constitution. We are seeking time with the Election Commission to… pic.twitter.com/wf9VdittvW — Atishi (@AtishiAAP) March 23, 2024 ఢిల్లీ నడిబొడ్డున్న ఉన్న తమ పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ముంగిట ప్రతిపక్షాలకు సమాన పోరాట వేదిక లేకుండా చేసే బీజేపీ కుట్రలో ఇది భాగమని ఫైర్ అయ్యారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ చర్య అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్ నిరసన -
జనసేన దుకాణం క్లోజ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం. ఓ పక్క పొత్తుల్లో అధిక శాతం సీట్లు కోల్పోవడం, ఉన్న సీట్లను కూడా కొత్తగా వచ్చిన వారికి ఇస్తుండటంతో స్థానిక నేతలందరూ పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లూ డబ్బు ఖర్చుపెట్టుకొన్న తమను పొత్తులు, కొత్తవారికి సీట్లతో దెబ్బ తీశారని కుతకుతలాడుతున్నారు. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి. పారీ్టలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానాన్ని, అంతకుముందు చేరిన పంచకర్లకు పెందుర్తి, నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచీ ఉండి పనిచేసిన తమను కాదని కొత్తగా వచి్చన వారికి పెద్దపీట వేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే అనకాపల్లి నేత పరుచూరి భాస్కర్రావు, పెందుర్తి నేత కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామ చేశారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. నేతలెవ్వరూ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆ భవనం అద్దె కూడా వృథా అని భావించి, అద్దె కట్టడం మానేసినట్లు సమాచారం. ఇది రెండోసారి జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండోసారి. గతంలో నరసింహనగర్ రైతుబజార్ సమీపంలోని అపార్టుమెంట్లో పార్టీ కార్యాలయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్లదీశారు. రెండేళ్ల క్రితం మాధవధారలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ఇప్పుడు మూతపడటంతో ఉత్తరాంధ్రలో ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
వైఎస్ఆర్ సీపీ కార్యాలయం తగలబెట్టిన దుండగులు
-
అధికారులపై టీడీపీ నేత కొల్లు దౌర్జన్యం
సాక్షి, మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొట్లు రవీంద్ర గురువారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సమయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పేదల ఇళ్ల పట్టాల తయారీలో నిమగ్నమై ఉండగా రాత్రి 9:30 గంటల సమయంలో కొల్లు రవీంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొరబడ్డారు. రాత్రి వేళ రెవెన్యూ కార్యాలయంలో ఏదో చేస్తున్నారంటూ తహశీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఏం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. వారు చేస్తున్న పనిని ఫొటోలు, వీడియోలు తీయాలంటూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. నకిలీ పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు తయారు చేస్తున్నారంటూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వారి చేతుల్లోని ఫైళ్లు లాక్కొని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు. కలెక్టర్ దృష్టికి కొల్లు దౌర్జన్యం తహసీల్దార్ కార్యాలయంలోకి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుల చొరబాటు, అధికారుల విధులకు ఆటంకం కల్పించడంపై తహసీల్దార్ పి. సతీష్ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు ఫిర్యాదు చేశౠరు. దీనిపై ఆయన స్పందించి జాయింట్ కలెక్టర్ను విచారణకు ఆదేశించారు. దీనిపై జాయిట్ కలెక్టర్ విచారించి.. విధుల నిర్వహణ సక్రమంగానే ఉందని, సమయం తక్కువ ఉండటంవల్లే అధికారులు రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంపై గురువారం రాత్రి తహశీల్దార్ పి. సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయ సిబ్బంది కొత్తగా వచ్చిన కన్వెయన్స్ డీడ్లు సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తుండగా కొల్లు రవీంద్ర 30 మందితో కార్యాలయంలోకి వచ్చారని, ఫోటోలు, వీడియోలు తీసి తన వివరణ కోరారని తెలిపారు. మచిలీపట్టణం మండలంలోని అర్బన్, రూరల్లో 18,119 నివాస స్థలాల ఎన్పీఐ కన్వెయన్స్ డీడ్లు ప్రింట్ చేశామని, ఇంకా 2,829 డీడ్లను పరిశీలన చేస్తున్నట్లు వివరించామని పేర్కొన్నారు. -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్లోని భింద్లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
టీసీఎస్ బాటలో హెచ్సీఎల్ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు..
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా చాలామందికి ఇంటి నుంచే ఉద్యోగం చేయడానికి సుముఖత చూపుతూ.. ఆఫీసులకు రావడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్ణింగ్ ఇచ్చేసింది. ఈ బాటలో ఇప్పుడు హెచ్సీఎల్ అడుగులు వేస్తోంది. హెచ్సీఎల్ టెక్ కంపెనీ ఇప్పుడు తమ ఉద్యోగులను తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. హెచ్సీఎల్ ఉద్యోగి ఎవరైనా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలు 2024 ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టంగా చేసింది. దీంతో ఉద్యోగులు 19వ తేదీ నుంచి తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయాలని ఆదేశించాయి. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా ఆఫీసుకు రావాలని హెచ్సీఎల్ టెక్ పీపుల్స్ ఫంక్షన్స్ గ్లోబల్ హెడ్ వికాస్ శర్మ ఆదేశిస్తూ.. ఈ నెల 14న మెయిల్స్ పంపినట్లు సమాచారం. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే జీతం లేకుండా సెలవు తీసుకున్నట్లు (లాస్ ఆఫ్ పే) ప్రకటించే అవకాశం ఉన్నట్లు మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! ఆఫీసులకు రావడమే కాకుండా ఉత్పాదక కూడా పెంచాలని యాజమాన్యం ఆదేశిస్తున్నట్లు సమాచారం. అంటే ఉద్యోగులు రోజుకు సగటున కనీసం 8 గంటలు పనిచేయాలని చెబుతున్నారు. 8 గంటలపాటు ల్యాప్టాప్ యాక్టివిటీ నమోదు కాని సందర్భంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
ఆస్తి ఆడపడుచులకు.. మరి నాకు, ముగ్గురు పిల్లలకు మిగిలేదేంటి?
హైదరాబాద్: మమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకునే భర్త అనారోగ్యంతో చనిపోయాడు... మాకు రావలసిన ఆస్తిని తన పిల్లలకు కాకుండా ఆడపడుచులకు ఇచ్చి అత్త అన్యాయం చేస్తుందని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఓ మహిళ మౌన దీక్షకు దిగింది. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెలితే... మణికొండ గ్రామ పంచాయతీకి వార్డు సభ్యునిగా పనిచేసిన ధన్రాజ్ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. దాంతో ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుని భారం భార్య సుధారాణిపై పడింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ వారిని చదివిస్తుంది. తన భర్త సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు చెందనివ్వకుండా అత్త యాదమ్మ ఇటీవల ఆడపడుచులు సావిత్రి, రేణుకల పేరుపైకి మార్చింది. అది తెలిసి తనకు న్యాయం చేయాలని కాలనీ, గ్రామ పెద్దలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోయింది.దీంతో పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలని శివాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మౌన దీక్షకు దిగింది. వారంలో న్యాయం చేస్తాం... ఆమె పరిస్థితిని తెలుసుకుని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్, వార్డు కౌన్సిలర్ యాలాల లావణ్య నరేష్, రాయదుర్గం పోలీసులు స్పందించి వారం రోజుల్లో చర్చించి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. దాంతో ఆమె ఆందోళనను విరమించింది. -
పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి/సత్తెనపల్లి : టీడీపీ, జనసేన మూకలు గుంటూరులో విధ్వంసానికి తెరలేపాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని కొత్త కార్యాలయంపై ఆ మూకలు రాళ్ల దాడిచేశాయి. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్రమౌళినగర్ మెయిన్రోడ్డులో మంత్రి రజిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ, జనసేన కార్యకర్తల ముసుగులో కొందరు గూండాలు పెద్ద సంఖ్యలో బైక్లపై ర్యాలీగా వచ్చారు. ముందుగా పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 12 గంటల తర్వాత కేక్ కటింగ్ నిర్వహించారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా.. తెలుగుదేశం, జనసేన జిందాబాద్.. అంటూ నినాదాలు చేస్తూ మంత్రి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయం మొత్తం టీడీపీ రౌడీమూకలు విసిరిన రాళ్లతో నిండిపోయింది. అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఆఫీసు సెక్యూరిటీ మాసారపు చిరంజీవి అడ్డుకోబోతే అతనిపైనా దాడిచేశారు. కార్యాలయం ప్రారంభానికి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ మూకలు చించివేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు మేడా ప్రకాష్, సాధు రఘు, మద్దులూరి రామబ్రహ్మం, పుల్లా రేవంత్, కోనేటి సాయిమణికంఠ, పాములపాటి రాంబాబుతోపాటు మరో 24 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు వంద మంది పాల్గొన్నట్లు పట్టాభిపురం పోలీసులు నిర్ధారించారు. మిగిలిన వారిపైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పథకం ప్రకారమే దాడి.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే.. మంత్రి రజినిని ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రమౌళినగర్లో పార్టీ కార్యాలయాన్ని ఆమె ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థులు దాడికి దిగినట్లు తెలిసింది. మరోవైపు.. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కూడా రజినిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని సహించలేని తెలుగుదేశం నేతలు ఈ దాడిని ప్రేరేపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీసీ మహిళపై టీడీపీ రౌడీయిజం : మంత్రి రజిని ఈ ఘటనపై మంత్రి రజిని స్పందిస్తూ.. తన పార్టీ కార్యాలయంపై దాడి టీడీపీ గూండాల అధికార దాహానికి పరాకాష్ట అని మండిప డ్డారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళ పోటీచేయడాన్ని చూసి తట్టుకోలేక టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారన్నారు. వారికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ధ్వంస రచనకు తెరతీశారని ఆమె ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్నారు. వాహనాల ద్వారా బస్తాల్లో రాళ్లు తీసుకొచ్చి పార్టీ కార్యాలయంపై విసిరారని.. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. మంత్రి కార్యాలయంపైనే టీడీపీ రౌడీమూకలు దాడులకు పాల్పడ్డాయంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణే ఉండదన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం పెడితే.. రాష్ట్రం సర్వనాశనమవుతుందని మంత్రి చెప్పారు. భౌతిక దాడులతో నైతికంగా తమను దెబ్బతీయాలని చూస్తున్నారని.. తమ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ఎవరి తరం కాదని రజిని హెచ్చరించారు. టీడీపీ దౌర్జన్యాలు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో గుంటూరు ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. దాడి దుర్మార్గం : ఎమ్మెల్యే మద్దాళి గిరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీ మహిళ పోటీచేయడాన్ని టీడీపీ గూండాలు సహించలేకపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి తెలిపారు. బీసీలను అందలం ఎక్కిస్తామంటూ ఓ పక్క మాయమాటలు చెబుతూ మరోవైపు బీసీలపై ఇలా దాడులకు తెగబడటం టీడీపీకే చెల్లిందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేసిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. బలహీనవర్గాలపై టీడీపీ, జనసేన దాడులు : మంత్రి జోగి ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ కూడా స్పందిస్తూ.. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల వారు సంఘ విద్రోహశక్తులుగా, గూండాలుగా మారి బలహీనవర్గాలపై దాడులకు తెగబడుతున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్లు తమ శ్రేణులను రెచ్చగొడుతూ.. ఇతర పార్టీలపై దాడులు చేయిస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థిర నివాసం కూడా లేని వీరు సీఎం జగన్పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న వీరికి రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెబుతారన్నారు. టీడీపీ, జనసేన కలిశాకే అరాచకాలు : మంత్రి అంబటి ఇక టీడీపీ, జనసేన పార్టీల కలయిక ప్రజాప్రయోజనాల కోసం కాదని, అరాచకం సృష్టించేందుకేనని.. గుంటూరులో బీసీ మహిళ మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఇందులో భాగమేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రజినీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం టీడీపీ దాష్టీకమని, దీనిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిన తర్వాతే అరాచకాలు పెరిగాయన్నారు. చంద్రబాబునాయుడు నిరాశా నిస్పృహల్లో ఉన్నాడని, పవన్కల్యాణ్ ఒక అరాచక శక్తి అని ఆయన నిప్పులు చెరిగారు. ‘ఎర్ర’బుక్కులో పేర్లు రాసుకుని అధికారంలోకి వస్తే అధికారుల తాటతీస్తానని లోకేశ్ హెచ్చరిస్తున్నాడని, టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పంను కనీసం మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్గా కూడా చేసుకోలేని చంద్రబాబుకి ఇప్పుడు ఎన్నికల ముందు అక్కడి ప్రజలు గుర్తుకొచ్చారని అంబటి విమర్శించారు. అంతకుముందు.. ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఏడాదంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. -
మంత్రి రజిని ఆఫీస్పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
మంత్రి రజిని ఆఫీసుపై దాడి..15 మంది గూండాలు అరెస్ట్
-
మంత్రి విడదల రజిని ఆఫీసుపై టీడీపీ, జనసేన రౌడీలు దాడి
-
కంప్యూటర్ మాయం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలికి సంబంధించి కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండాపోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్చైర్మన్(వీసీ) అహ్మద్ తెలిపారు. ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని మండలి కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్ వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వీసీగా కూడా ఉన్నారు. ఈ కారణంగా ఆయన మండలి కార్యాలయానికి వచ్చి పోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అందులో ఏముందో...? కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యమున్న కంప్యూటర్ను 2017లో కొనుగోలు చేశారు. అయితే, గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీనిని స్క్రాప్గా నమోదు చేసి, స్టోర్ రూంలో ఉంచామంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలొచ్చిన రోజు కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన హడావిడిగా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు అందులో ఏముంది? పనిచేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్్కలో ఉండే అవకాశం లేదా? హార్డ్డిస్క్ ఎక్కడుంది? అందులో డేటాను ఏం చేశారు? పనికి రాని కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అయితే, ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరుకాలేదని చెబుతున్నారు. దోస్త్ డేటా ఉన్నట్టేనా? ఆన్లైన్ ద్వారానే ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తుంది. ఈ డేటా అంతా కంప్యూటర్లో పొందుపరుస్తారు. దీంతోపాటు మండలి ఆదేశాలు, డిగ్రీ కాలేజీల అనుమతులు ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ లింబాద్రి వీసీ–1గా ఉన్నప్పుడు, వెంకటరమణ వీసీ–2గా ఉన్నారు. లింబాద్రి మండలి చైర్మన్ అయిన తర్వాత అహ్మద్ను మండలి వైస్చైర్మన్గా నియమించారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ వీసీ–2 నుంచి వీసీ–1 మారుస్తూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఇది మండలిలో తీవ్ర వివాదానికి దారి తీసింది. వీసీ–1, వీసీ–2 మధ్య రగడ తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే దోస్త్ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడం, వీసీ–1గా ఉన్న వెంకటరమణను తీసేయడం, ఇదే సమయంలో దోస్త్కు సంబంధించిన కంప్యూటర్ మాయం కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ దోస్త్ మొదలైనప్పట్నుంచీ డేటా ఉందా? అనే సందేహం మండలివర్గాల నుంచే వినిపిస్తోంది. -
‘శాడిస్ట్ బాస్కు భలే బుద్ధి చెప్పింది’
ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్ కొలీగ్స్, శాడిస్ట్ బాస్, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్ ప్లేస్ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇదిగో ఈ తరహా వర్క్ కల్చర్ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్ బాస్తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్ మీద రివెంజ్ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ రెడ్డిట్లో.. రెస్టారెంట్లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. జాబ్ రిజైన్ చేశా. రిజైన్ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్ పాస్వర్డ్లు మార్చాను. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం, బాస్, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ చేశా. పాస్ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. -
కంపెనీల్లో నయా ట్రెండ్, కాఫీ కప్పులతో ఉద్యోగులు.. బాసుల్లో గుబులు!
ప్రపంచ దేశాల్లోని ఎక్కువ శాతం సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ను రద్దు చేస్తున్నాయి. ఆఫీసుకు రావాలని పిలుపునిస్తున్నాయి. దీంతో సుదీర్ఘ కాలంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న వారిని ఇప్పుడు ఆఫీసులో పనిచేయాలని ఆదేశించడం ఉద్యోగులకు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే కాఫీ బ్యాడ్జింగ్ అనే కొత్త ట్రెండ్తో సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్ అంటే? కోవిడ్-19 తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్లతో ఆఫీస్లకు కొత్త కళ వచ్చింది. దీంతో కరోనా మహమ్మారితో రిమోట్గా వర్క్ చేస్తున్న సిబ్బందిని కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాఫీ బ్యాడ్జింగ్ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఎవరైతే ఆఫీస్లో పనిచేయడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారో ఆ ఉద్యోగులు.. ఆఫీస్లో ఐడీని స్వైప్ చేస్తారు. ఆ తర్వాత సహాచరులకు కలిసి కాఫీ తాగే ప్రదేశానికి వెళ్తారు. అక్కడే హెచ్ఆర్, మేనేజర్ల దృష్టిలో పడేలా అటు ఇటూ తిరుగుతుంటారు. ఆ తర్వాత డెస్క్కు వచ్చి ఇంటికి వెళ్లిపోతారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్ అంటారు. ప్రతి 5 మందిలో ఒకరు మాత్రమే ఈ ఏడాదిలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ప్రతి 5 మందిలో 1 ఒకరు పూర్తిస్థాయిలో ఆఫీస్లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 37 శాతం మంది హైబ్రిడ్ వర్క్ను కోరుకుంటుంటే 41 శాతం మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో రిమోట్ వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ‘ఓల్ ల్యాబ్స్’ అనే సంస్థ తెలిపింది. రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్ ఓల్ ల్యాబ్స్ చేసిన అధ్యయనంలో తప్పని సరిగా ఆఫీస్లో పనిచేయాలన్నా నిబంధనను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల్లో సగం (58శాతం) మంది కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడుతున్నారు. ధోరణి అక్కడితో ఆగలేదు. మరో 8 శాతం మంది రోజులో ఎక్కువ సార్లు కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడడంతో ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించడం యజమానులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. సంస్థల్లో ప్రతి విభాగంలో ఒకరో, ఇద్దరో ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడినా కంపెనీలకు పెద్ద నష్టం ఉండేది కాదు. హై స్కిల్ ఉన్న ఉద్యోగులు మూకుమ్మడిగా ఆఫీస్ పనిచేయకుండా కాఫీ కప్పులతో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేయడం యామాన్యాలకు మింగుడు పడడం లేదు. క్లయింట్ ఇచ్చిన డెడ్ లైన్లోపు ప్రాజెక్ట్లను పూర్తి చేయకపోవడం, ఇటు ఉద్యోగులు చేజారిపోకుండా కాపాడుకోవడం కత్తిమీద సాములా మారింది. కాఫీ బ్యాడ్జింగ్ను పుల్ స్టాఫ్ పెట్టాలంటే 'కాఫీ బ్యాడ్జింగ్' ట్రెండ్ తగ్గాలంటే కంపెనీలు అంతర్గత సమస్యలను పరిష్కరించాలి. కమ్యూనికేషన్ను పెంపొందించాలి, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించాలి. ఆఫీస్ వాతావరణం సైతం ఉద్యోగుల్ని ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. -
ఆఫీస్లో కాసేపు పడుకోనివ్వండి!
ఆఫీస్ టైమ్లో చేసేపని కాస్త చాలెంజింగ్గా ఉంటే నిద్రకు అవకాశం ఉండదు. కానీ వర్క్లో ఎలాంటి చాలెంజ్ లేకుండా కూర్చొని చేసే కొన్ని పనుల్లో చాలాసార్లు నిద్ర వస్తూంటుంది. దాంతో ఉత్పాదకత తగ్గుతుంది. ఆఫీస్ టైమ్లో కొంతసేపు నిద్రపోవడానికి అవకాశమిస్తే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే జపాన్లో ఈ సంప్రదాయం ఉంది. పని బాగా చేయడానికి, అలసట నుంచి బయటపడేందుకు ఆఫీస్ అవర్స్లో కొద్ది సేపు నిద్రపోవడం ముఖ్యమని తాజాగా జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఆఫీస్ టైమ్లో న్యాప్ (కునుకు తీయడం) బ్రేక్ ఇవ్వడం ముఖ్యమని 94 శాతం మంది చెప్పారు. మూడు శాతం మంది మాత్రం ఇలాంటి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఆన్లైన్లో చేసిన ఈ సర్వేలో మొత్తం 1,207 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25–అక్టోబర్ 27 మధ్య ఈ సర్వే చేసినట్లు జీనియస్ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఆఫీస్ అవర్స్లో కొంత సేపు నిద్రపోతే పని సామర్ధ్యం మెరుగవుతుందని 82 శాతం మంది చెప్పగా, 12 శాతం మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. రోజువారి పనిలో అలసట, ఆయాసం వంటివి ఎదుర్కొంటున్నామని 60 శాతం మంది చెప్పారు. మరో 27 శాతం మంది మాత్రం తమకు అలసట లేదని పేర్కొన్నారు. ఒక గంట పాటు పడుకోవడానికి టైమ్ ఇస్తే అదనపు అవర్స్లో పనిచేసేందుకు తమకు ఓకే అని 49 శాతం మంది వెల్లడించారు. కానీ 36 శాతం మంది మాత్రం ఈ ఆలోచన బాగోలేదన్నారు. జపాన్లో పాటించే ‘ఇనెమురి (ఆఫీస్ అవర్స్లో పడుకోవడం)’ విధానం మంచిదని, దాంతో ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవుతుందని 78 శాతం మంది పేర్కొన్నారు. ఆఫీస్ అయిపోయాక పడుకోవడానికి వీలు కలిపిస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుందని 64 శాతం మంది చెప్పగా, దీని వలన ఎటువంటి ఉపయోగం లేదని 21 శాతం మంది అన్నారు. ఇదీ చదవండి: రూ.55 వేలకోట్ల దావూద్ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే.. -
తెలంగాణలో మాజీ మంత్రుల కార్యాలయాల్లో మిస్సవుతున్న ఫర్నీచర్
-
పనిచేసే చోట అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఏం చేయాలంటే..
ఆఫీసు అంటేనే అక్కడ ఉన్న అందరితోనూ కలిసి పని చేయాలి. ఇలాంటప్పుడు ఎవ్వరితోనైనా కలిసి ఎలా పని చేయాలి? వర్కప్లేస్ ఎక్స్పర్ట్, స్పీకర్, రైటర్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పాడ్కాస్ట్ హోస్ట్ అమీ గలో కార్యాలయాలలో ఎలా ఉండాలో పుస్తకంగా మన ముందుకు తీసుకువచ్చారు. ‘గెటింగ్ ఎలాంగ్’ అనే ఈ బుక్ ఇప్పుడు పని ప్రదేశాల్లో ఉండే ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాలలో ఎదుర్కొనే సమస్యలను అమీ గలో వివిధ రంగాల నుండి స్వయంగా సేకరించింది. ఈ యేడాది చదివి తెలుసుకోదగిన పుస్తకాలలో అమీ బుక్ ప్రముఖంగా నిలిచింది. వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలో అమీ సేకరించిన విషయాలు, సూచించిన పరిష్కారాలు ఉద్యోగులందరికీ ఎంతగానో తోడ్పడుతున్నాయి. పనిలో సంఘర్షణ ఉంటుంది. పనిచేసే చోట సంబంధాలు కఠినంగా ఉంటాయి. వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఒత్తిడి ఉంటే మన సృజనాత్మకత, ఉత్పాదకత కూడా తగ్గుతుంది. స్పష్టంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమూ తగ్గుతుంది. ఈ విషయాల గురించి రాత్రిపూట ఆందోళన చెందుతూ నిద్రలేని రాత్రులు గడపవచ్చు. ఈ ప్రవర్తన చేస్తున్న ఉద్యోగం వదులుకునేలా చేస్తుంది. చేస్తున్న పని నుండి బయటకు వచ్చేసి, ఆ తర్వాత పశ్చాత్తాప పడవచ్చు. మీటింగ్లో కళ్లు తిప్పడం, ఎగరేయడం, సహోద్యోగులపై విరుచుకుపడటం లేదా మనం మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండటం కూడా మనల్ని ఉద్యోగం నుంచి వేరు చేస్తాయి. చాలావరకు నవ్వుతూ, వేరే మార్గం లేనట్టుగా వ్యక్తులను భరిస్తుంటారు. సరైన పరిష్కారాలు తెలియక హానికరమైన ప్రవర్తనలను భరిస్తుంటారు. ఇక్కడ చూడాల్సింది మనలోని చిత్తశుద్ధి, కెరియర్ మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వర్క్ప్లేస్ ఎక్స్పర్ట్ అమీ ‘గెటింగ్ ఎలాంగ్’లో కష్టతరమైన సహోద్యోగులను గుర్తించి, ఇలా మన ముందుంచింది. ►సరైన బాస్ లేకపోవడం: వీరిపై ఉద్యోగుల్లో విశ్వాసం ఉండదు. ఫలితంగా ఏదో విధంగా మేనేజ్ చేస్తుంటారు. ఇలాంటి బాస్ తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాని గురించే ఎక్కువ ఆందోళన చెందుతారు. నిర్ణయాలు తీసుకోవడానికి, కట్టుబడి ఉండటానికి కష్టపడవచ్చు. ► నిరాశగా ఉండేవారు: ఇలాంటి వారితో సరైన ప్రోత్సాహం, కెరీర్లో పెరుగుదల ఉండదు. ► దూకుడుతనంగా ఉండటం: సహోద్యోగులు తమ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే ధోరణి ఉండదు. తాము ఏదైనా తెలియజేయడానికి పరోక్ష పద్ధతులను ఉపయోగిస్తారు. ఎప్పుడూ ఇతరుల అవసరాలను తీర్చడానికి ఉన్నట్టు కనిపిస్తారు. ► అన్నీ తెలుసు అనే ఆలోచన: అత్యంత తెలివైన వారిగా చూపించుకోవడానికి తపన పడుతుంటారు. తగినంత సమాచారం లేకపోయినా, చెప్పేది తప్పు అని తెలిసినా తనదే కరెక్ట్ అనే ధోరణలో ఉంటారు. ► హింసించే వ్యక్తులతో ఎప్పుడూ ప్రమాదమే: సాధారణంగా ఒక సీనియర్ వ్యక్తి ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తేనే ఆ స్థాయికి చేరుకుంటారు. కానీ, అది మర్చిపోయి తన కింద ఉన్నవారితో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తన ప్రవర్తనతో ఇతరులు బాధపడుతున్నారా అనేది కూడా ఆలోచించరు. ►పక్షపాతంతో పనిచేసే సహోద్యోగి: పై స్థాయిలో ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. వారిని పొగుడుతుంటాడు. ఏదైనా నీ కోసం చేస్తాను అంటారు. ► రాజకీయాలు చేసేవాళ్లు: ఈ వ్యక్తులు తమ కెరీర్ను ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. అందుకోసం అధికంగా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. అబద్ధాలు చెబుతుంటారు. అభద్రత పెంచే భయం నాయకత్వ పాత్రను పోషించాల్సిన సందర్భంలో అభద్రత పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అధికారుల అతిపెద్ద భయం అసమర్థతే అని ఒక సర్వేలో తేలింది. సీనియర్ స్థానానికి ప్రమోట్ అయినప్పుడు పనితీరుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇది సంభవించవచ్చు. కలిసిపోవడానికి ముఖ్యమైనవి ఎవరితోనైనా ఇట్టే కలిసిపోవడానికి సహాయపడేది ముందుగా మన దృష్టి కోణం. అందుకు ఎదుటివారికి ప్రపంచమంతా తెలియాల్సిన అవసరం లేదు. ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎదుటివారి గురించి తప్పుగా అనుకోకూడదు. సహోద్యోగి ఎంత సన్నిహితమైనా మన స్థాయిని మర్చిపోకూడదు. నియంత్రణలపై దృష్టి పెట్టాలి. సహోద్యోగిని మార్చమని పై అధికారులకు చెప్పే బదులు మనం విభిన్నంగా ఏం చేయగలమో వాటిపైన దృష్టి పెట్టాలి. సహోద్యోగులతో నేరుగా పనులు చేసే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఇ–మెయిల్ వంటి ఇతర మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. ఒకరి దృక్పథాన్ని మరొకరు అర్ధం చేసుకోవాలి. లేదంటే, సహోద్యోగి ప్రవర్తన ఎందుకు అలా ఉంది? వారు సహకరించకపోతే నేను మాత్రమే ఎలా పరిష్కరించగలను? ప్రతిదీ ప్రయత్నించాను.. కానీ, ఇప్పుడు ఎలా? ... ఇలాంటి ప్రశ్నలు కొన్ని సార్లు భయానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. పనిలో కష్టతరమైన సంబంధాలను కొనసాగించడానికి, వ్యక్తుల మధ్య మంచి బంధాలను పెంపొందించడానికి గెటింగ్ ఎలాంగ్ ఒక మంచి గైడ్లా ఉపయోగపడుతుంది. టీమ్ వర్క్ బాస్ నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను గుర్తించాలి. సంవత్సరాంతపు లక్ష్యాలను చేధించడం, వర్క్పాలసీ గురించి నిరంతరం తెలుసుకోవాలి. ఉద్యోగులపై ఉన్న అభద్రతా భావాలను తొలగించగలగాలి. పనిని ఉమ్మడిగా చేయడానికి ప్రయత్నించాలి. పై అధికారి దగ్గర సాధ్యమైనంతవరకు ‘మేము’ వాక్యాన్నే జోడించాలి. ఉదాహరణకు..‘ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేయడానికి ‘మేమంతా’ కష్టపడ్డాం. టీమ్గా ఇంకా బాగా కనిపించాలనే మేమంతా కోరుకుంటున్నాం’ అని విజయం సాధించినప్పుడు బాస్కు తెలియజేయాలి. పనిలో టీమ్ సహకారం ఎంత ఉందో తెలియజేయాలి. ఆఫీసులో స్నేహాలు ‘గెటింగ్ ఎలాంగ్ కోసం నేను న్యూరోసైన్స్, వ్యక్తుల హావభావాలలో చూపించే తెలివి, చర్చలు, మేనేజ్మెంట్ సైన్స్.. వంటి వివిధ అంశాల నుండి విషయ సేకరణ చేశాను. స్నేహితుల బృందాలు ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. సపోర్టివ్గా ఉండే సహోద్యోగులతో ఉన్న వ్యక్తులు తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు. సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటం వల్ల సమాచారం, ఆలోచనలు పంచుకోవడం, ఆత్మవిశ్వాసం, సాధన పెరుగుతాయి. ఇతరులతో సామాజిక సంబంధాలు ఎలా ఉంటున్నాయో కూడా దీని ద్వారా అర్ధమవుతుంది. స్నేహాలు కెరీర్కు కూడా మంచివి. స్నేహితులుగా భావించే సహోద్యోగుల బృందాలు, వారి పనితీరుపై చేసే పరిశోధనలో ఎక్కువ ఉత్పాదకత వచ్చింది. – అమీ గలో -
పోలీసు సిబ్బందిని భయపెడుతున్న దెయ్యం!
ఆదిలాబాద్టౌన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దెయ్యం ఉందంటూ పుకార్లు సాగుతున్నాయి. దీంతో రాత్రి వేళలో నిద్రిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే వారు సైతం కార్యాలయంలో దెయ్యం ఉన్నట్లు సిబ్బందితో తెలిపిన ట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి మాంత్రికుడిని తీసుకొ చ్చి అక్కడి మరుగుదొడ్లను చూపించగా.. అక్క డ దెయ్యాలున్నాయని చెప్పడంతో కొంత మంది ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డీఈవో విషయాన్ని జన విజ్ఞాన వేదిక దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి సిబ్బందితో పాటు వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్, రవీందర్రెడ్డితో పాటు జిల్లా సైన్స్ అధికారి రఘురమణ రాత్రి సమయంలో కార్యాలయంలో నిద్రించారు. తమకు ఎలాంటి శబ్ధాలు వినిపించలేదని, దెయ్యం ఉన్నట్లు వస్తున్న పుకార్లు అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా, దెయ్యాలు లేవని, కావాలనే కొంత మంది పుకార్లు చేస్తున్నారని వివరించారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించడం ఇష్టం లేకనే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మూఢనమ్మకాలను దూరం చేసి శాస్త్రీయ దృక్పదా న్ని పెంపొందించాలి్సన విద్యాశాఖలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చోద్యంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. -
బీసీ సీఎం ప్రకటనపై బీజేపీ కార్యాలయంలో సంబురాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని బీజేపీ అధిష్టానం చేసిన ప్రకటనకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు సంబురాలు జరిపారు. పార్టీ ఆఫీస్ బయట పటాసులు కాల్చి, డప్పులు వాయిస్తూ, స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పార్టీ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఓబీసీ మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, పార్టీ నేతలు ఆకుల విజయ, టి.వీరేందర్గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా ప్రకటన చరిత్రాత్మకమని అన్నారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, దీనిపై బీసీ సమాజం ఆలోచించాలని అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కేసీఆర్కు బీసీలంటే చిన్నచూపని ఆరోపించారు. బీజేపీ 40 స్థానాలకు పైగా బీసీలకు అవకాశాలు కల్పించబోతోందని, తెలంగాణ సమాజం నిండు మనస్సుతో పార్టీని ఆశీర్వదించాలని కోరారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదని అన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. -
టీసీఎస్లో మరో కొత్త సమస్య! ఆఫీస్కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..
ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి దాదాపుగా స్వస్తి పలికాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండగా టీసీఎస్ (TCS) మాత్రం ఉద్యోగులందరూ ఆఫీస్లకు రావాల్సిందేనని తేల్చిచెప్పేసింది. దీంతో ఉద్యోగులు ఇప్పుడిప్పుడే ఆఫీల బాట పడుతున్నారు. అయితే ఉద్యోగులందరూ కార్యాలయాలకు వస్తుండటంతో మరో సమస్య ఎదురైంది. పని చేసేందుకు సీట్ల కొరత టీసీఎస్ రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ఓ వైపు ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఆఫీస్కు వెళ్తున్న ఉద్యోగులకు మరో కొత్త సమస్య వచ్చింది. ఉద్యోగులందరూ ఆఫీస్ నుంచి పనిచేసేందుకు రావడంతో వారికి తగినన్ని సీట్లు అందుబాటులో లేవు. దీంతో వారికి కేటాయించిన సీట్లపై గందరగోళం నెలకొంది. గత రెండేళ్లలో టీసీఎస్ లక్ష మంది ఉద్యోగులను చేర్చుకుంది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. దీంతో సీట్ల కొరత ఏర్పడింది. కారిడార్లు, లాబీల్లో.. అకేషనల్ ఆక్యుపేషన్ జోన్లు అని పిలిచే ఉద్యోగుల తాత్కాలిక సీటింగ్ సౌకర్యాలను కంపెనీ తొలగించడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఉద్యోగులందరికీ తగినన్ని సీట్లు లభించగా కొందరు ఆఫీస్ కారిడార్లు, లాబీల్లో కూర్చొని పనిచేసుకుంటున్నారు. అయితే రోజంతా ఇలా పనిచేయడానికి చాలా అసౌకర్యంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనం ప్రచురించింది. (టీసీఎస్కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..) ఆఫీస్కి రావాల్సిందే.. వారంలో ఐదు రోజులూ కార్యాలయానికి తిరిగి రావాల్సిందేనని టీసీఎస్ ఉద్యోగులను అభ్యర్థిస్తోంది. కొన్ని బృందాలకు వర్క్ ఫ్రం హోమ్ ముగిసింది. ఉద్యోగులు తమకు కేటాయించిన కార్యాలయాలకే రావాలని, తమ ఇళ్లకు దగ్గరగా ఉండే ఆఫీస్లు కావాలంటే కుదరదని చెప్పడం గందరగోళానికి తోడైంది. రిటర్న్-టు-ఆఫీస్ మార్పును క్రమబద్ధీకరించడానికి, ఉద్యోగులందరికీ సాఫీగా ఉండేలా చేయడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని టీసీఎస్ హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని ఆఫీస్లు ఇరుగ్గా ఉండటం, మరికొన్నింటిలో తగినన్ని సౌకర్యాలు లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. (TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!) అయితే ఉద్యోగులు ఎక్కడైతే నియమితులయ్యారో అదే ఆఫీస్ నుంచి పని చేయాలని, లేకుంటే వారికిచ్చే సిటీ అలవెన్స్ కోల్పోవాల్సి ఉంటుందని తమ టీం మేనేజర్లు తెలియజేసినట్లు కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. టైర్-1 నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ. 2,000-3,000 సిటీ అలవెన్స్ లభిస్తుంది. కానీ తమ సౌకర్యం కోసం కొందరు ఉద్యోగులు ఈ అలవెన్స్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సమీప భవిష్యత్తులో ఇండియా కూటమి సర్కారు
మేడిగడ్డలో మరో గేటు ఎత్తారు
జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
లోక్ అదాలత్లో 10,35,520 కేసుల పరిష్కారం
తుంగభద్ర ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందేనా?
Russia-Ukraine war: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో దాడులు..
మూడు రోజులు తేలికపాటి వర్షాలు
వంద చిత్రాల ఆకాంక్ష నెరవేరకుండానే..
డెన్మార్క్ ప్రధానిపై దాడి
Advertisement