లారీ క్యాబిన్లో మంటలు.. తప్పిన ముప్పు
రామగుండం : అకస్మాత్తుగా లారీ క్యాబిన్లో మంటలు రావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం బీ-పవర్హౌస్ సమీపంలోని రాజీవ్ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వసంత్నగర్ నుంచి కంకర లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయానికి గురైన డ్రైవర్ లారీని వదిలి పారిపోయాడు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.