-
కుటుంబంలో పెను విషాదం.. అందుకే ఆ నిర్ణయం: రైనా
‘‘అప్పుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకే పంజాబ్కు వెళ్లాల్సి వచ్చింది. మా అంకుల్ కుటుంబంలో మరణాలు సంభవించాయి. ఒంటికి నూనె రాసుకుని దాడులకు పాల్పడే కచ్చా గ్యాంగ్.. గ్యాంగ్స్టర్స్ వాళ్ల కుటుంబం మొత్తాన్ని చంపేశారు. అప్పుడు మా బామ్మ కూడా అక్కడే ఉంది. పఠాన్కోట్లో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే నేను అక్కడికి వెళ్లాను. అప్పటికే ఐపీఎల్లో బయో బబుల్ నిబంధనలు మొదలయ్యాయి. కాబట్టి తిరిగి జట్టుతో కలిసే పరిస్థితి లేదు. ఆ ఘటనతో మా నాన్న అప్పటికే నైరాశ్యంలో మునిగిపోయారు. అప్పుడు నాకు నా కుటుంబమే మొదటి ప్రాధాన్యంగా కనిపించింది. క్రికెట్ కావాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కష్టకాలంలో మాత్రం ఫ్యామిలీకి అండగా ఉండాలని ఆలోచించాను. ఈ విషయాన్ని నేను ఎంఎస్ ధోని, మేనేజ్మెంట్కు చెప్పాను. అందుకే జట్టును వీడాను. నేను తిరిగి వచ్చిన తర్వాత 2021 సీజన్ ఆడాను. 2021లో ట్రోఫీ గెలిచాం. అయితే, అంతకు గతేడాది ముందు మా కుటుంబంలో ఇలాంటి పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటికే కోవిడ్-19 కారణంగా అందరూ డిప్రెషన్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఇలా ఆప్తులను కోల్పోవడం నిజంగా మా అందరినీ కుంగదీసింది. కాబట్టి ఆట కంటే ఫ్యామిలీ వైపే మొగ్గుచూపాను’’ అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే జట్టును వీడేందుకు గల కారణాలను తాజాగా లలన్టాప్ షోలో వెల్లడించాడు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యానని రైనా చెప్పుకొచ్చాడు. అయితే, మరుసటి ఏడాది తిరిగి వచ్చిన తర్వాత సీఎస్కే మరోసారి చాంపియన్గా నిలవడం సంతోషాన్నిచ్చిందని రైనా హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2020లో చెన్నై దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. పద్నాలుగు మ్యాచ్లలో కేవలం ఆరు గెలిచి పాయింట్ల పట్టిక(అప్పటికి ఎనిమిది జట్లు)లో ఏడో స్థానంలో నిలిచింది. రైనాతో పాటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో విఫలమై పరాభవం మూటగట్టుకుంది. అయితే, 2021లో విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది సీఎస్కే. 2022లో మళ్లీ దారుణంగా ఆడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానాని(పద్నాలుగు గెలిచినవి నాలుగు)కి దిగజారిన సీఎస్కే అనూహ్య రీతిలో గతేడాది ఐదోసారి చాంపియన్గా అవతరించింది. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన సురేశ్ రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తన ఆట తీరుతో రైనా ‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి పొందాడు. అదే విధంగా ‘చిన్న తలా’గా సీఎస్కే ఫ్యాన్స్ అభిమానం పొందాడు. కాగా రైనా ధోనికి అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ -
'కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్.. తలదించుకొనే బ్యాటింగ్ కొనసాగించా'
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్లో ఉంటుందని.. మనం తట్టుకోవడం కష్టమంటూ పేర్కొన్నాడు. గౌరవ్ కపూర్ నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్ యూట్యూబ్ షోలో సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కోహ్లితో జరిగిన అనుభవాన్ని సూర్య ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. ''165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాం. అయితే రెండు వికెట్లు కోల్పోవడంతో మా చేజింగ్ కాస్త స్లోగా సాగుతుంది. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఎవరు ఏం చేసినా నా బ్యాటింగ్ ఫోకస్ను కోల్పోకూడదని భావించాను. కానీ అప్పటి ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి రూపంలో నాకు ఎదురుగా కనిపించాడు. గ్రౌండ్లో ఉంటే కోహ్లి ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి. అతను పొరపాటు స్లెడ్జింగ్కు దిగాడో తట్టుకోవడం కష్టం. ఒక రకంగా కోహ్లికి ఎనర్జీ లాంటిది. తన చర్యలతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్లను కన్ఫూజ్ చేస్తాడు. అతని మాయలో పడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యా. పైగా ఇరుజట్లకు అది కీలక మ్యాచ్. ఓడిన జట్టు ఇంటికి.. గెలిచిన జట్టు ఫైనల్కు. ఈ పరిస్థితుల్లో కోహ్లి కళ్లలో పడకూడదనే ఉద్దేశంతో బ్యాటింగ్ కొనసాగించా. కోహ్లి నాకు ఎదురుగా ఉన్నప్పుడు తలదించుకొని బ్యాటింగ్ చేశా. దీనివల్ల నా ఫోకస్ దెబ్బతినలేదు. నేను బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కోహ్లిని నేను ఏమి అనలేదు.. నన్ను కోహ్లి ఎలాంటి స్లెడ్జ్ చేయలేదు. మ్యాచ్ విజయానికి చేరువవుతున్న తరుణంలో మనుసులో ఈ విధంగా అనుకున్నా.'' ఇంతవరకు అంతా సక్రమంగానే జరిగింది. ఇంకో 10 సెకన్లు ఓపిక పడితే మ్యాచ్ గెలుస్తాం.. ఈ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు''.. ఇక కోహ్లి ఒక సందర్బంలో నా దగ్గరికి వచ్చాడు. కానీ అదే సమయంలో నా బ్యాట్ కిందపడిపోవడంతో ఏం మాట్లాడకుండా బ్యాట్ తీసుకోవడానికి కిందకు వంగాను. కోహ్లి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేము మ్యాచ్ గెలవడం.. ఆపై టైటిల్ గెలవడం జరిగిపోయింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ ఎగురేసుకపోయింది. చదవండి: IPL 2022: కోహ్లి చెత్త రికార్డు.. ప్లీజ్.. భారంగా మారొద్దు.. ఇకనైనా! Kohli-Wasim Jaffer: కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాయల్స్ రాజసం
అబుదాబి: యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్లు) ‘పవర్’ గేమ్, శివమ్ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్ను గెలిపించాయి. ఐపీఎల్లో శనివారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్కు షాక్ ఇచి్చంది. మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ‘శత’గ్గొడితే... ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 32 నాటౌట్) చితగ్గొట్టాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ, దూబే అర్ధసెంచరీలతో చెలరేగారు. వరుసగా నాలుగు విజయాల తర్వాత చెన్నైకిదే తొలి ఓటమి. తాజా గెలుపుతో రాజస్తాన్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో సజీవంగా ఉంది. రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్... చెన్నై ఆట రుతురాజ్ బౌండరీతో మొదలైంది. ఆఖరి బంతికి అతడు కొట్టిన సిక్సర్తోనే ఇన్నింగ్స్ ముగిసింది. జట్టు చేసిన 189 పరుగుల్లో అతనొక్కడే వందకొట్టాడు. డుప్లెసిస్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్కు 47 పరుగులు, మొయిన్ అలీ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్కు 57 పరుగులు జోడించాడు. అతని వేగంతో జట్టు 14వ ఓవర్లో 100 పరుగులు దాటింది. గైక్వాడ్ 43 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఆఖర్లో దూకుడుగా ఆడాడు. ఆఖరి బంతిని సిక్సర్గా బాదడంతో రుతురాజ్ 60 బంతుల్లో సెంచరీ సాధించాడు. తొలి బంతి నుంచే... భారీస్కోరు చేశామన్న చెన్నై ధీమా సన్నగిల్లేందుకు ఎంతో సేపు పట్టలేదు. లూయిస్ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యేకించి హాజల్వుడ్పై వీరంగమే చేశాడు. అతని రెండు ఓవర్లను (2, 5వ) జైస్వాలే ఆడి... ఆ 12 బంతుల్లో 2, 4, 0, 2, 4, 4, 0, 6, 6, 4, 6, 0 విధ్వంసంతో 38 పరుగులు పిండుకున్నాడు. అలా రాజస్తాన్ నాలుగో ఓవర్లలోనే 50 పరుగులు దాటేయగా... యశస్వీ 19 బంతుల్లోనే (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ కొట్టాడు. ఆరో ఓవర్లో లూయిస్ను శార్దుల్ పెవిలియన్ చేర్చా డు. పవర్ ప్లేలో రాయల్స్ 81/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి యశస్వీ విధ్వంసానికి ఆసిఫ్ చెక్ పెట్టాడు. అనంతరం కెప్టెన్ సామ్సన్ (28; 4 ఫోర్లు) , శివమ్ దూబే జట్టును విజయానికి చేరువ చేశారు. దూబే 31 బంతుల్లో (2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకం చేశాడు. మూడో వికెట్కు ఇద్దరు 89 పరుగులు జోడించారు. సామ్సన్ ఔటైనా... దూబే, గ్లెన్ ఫిలిప్స్ (14 నాటౌట్; ఫోర్, సిక్స్) జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (నాటౌట్) 101; డుప్లెసిస్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తెవాటియా 25; రైనా (సి) దూబే (బి) తెవాటియా 3; అలీ (స్టంప్డ్) సామ్సన్ (బి) తెవాటియా 21; రాయుడు (సి) ఫిలిప్స్ (బి) సకారియా 2; జడేజా (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–47, 2–57, 3–114, 4–134. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 4–0–39–0, సకారియా 4–0–31–1, ముస్తఫిజుర్ 4–0–51–0, తెవాటియా 4–0–39–3, మార్కండే 3–0–26–0, ఫిలిప్స్ 1–0–3–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) హాజల్వుడ్ (బి) శార్దుల్ 27; జైస్వాల్ (సి) ధోని (బి) ఆసిఫ్ 50; సామ్సన్ (సి) గైక్వాడ్ (బి) శార్దుల్ 28; శివమ్ దూబే (నాటౌట్) 64; ఫిలిప్స్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 7; మొత్తం ( 17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–77, 2–81, 3–170. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–55–0, హాజల్వుడ్ 4–0–54–0, శార్దుల్ 4–0–30–2, ఆసిఫ్ 2.1–0–18–1, మొయిన్ అలీ 2.2–0–23–0, జడేజా 1–0–9–0. -
Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం!
వెబ్డెస్క్: సూర్యకుమార్ యాదవ్.. గత కొన్నేళ్లుగా పొట్టి ఫార్మాట్లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్న క్రికెటర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. స్వదేశంలో ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భాగంగా టీమిండియా ప్రాబబుల్స్లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్.. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే, ఆ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్తో ఇంగ్లండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో నాలుగో టీ20 ద్వారా టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న సూర్య.. సిక్సర్తో అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల ఖాతా తెరిచాడు. అంతేగాక, తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన ఐదో భారత క్రికెటర్గా ఘనత సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ గురించి కాసేపు పక్కన పెడితే.. తనకెంతగానో గుర్తింపు తీసుకువచ్చిన ఐపీఎల్, ముఖ్యంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై జట్టు అంటే సూర్యకుమార్కు ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. కోహ్లి వర్సెస్ సూర్య! ఇక గతేడాది సీజన్లో అద్భుతంగా రాణించిన సూర్య... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్లో జట్టును గెలిపించి.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి ఐపీఎల్-2020 ఆల్బమ్లో మరో జ్ఞాపకాని చేర్చుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగా, ముంబై ఎనిమిదో విజయం తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి, సూర్యకుమార్ మధ్య జరిగిన ఘటన ఐపీఎల్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్లో 13వ ఓవర్లో కోహ్లి బంతిని షైన్ చేస్తూ సూర్య వద్దకు వచ్చిన కోహ్లి దూకుడుగా వ్యవహరించాడు. అద్భుతమైన షాట్లు ఆడుతున్న అతడితో వాగ్వాదానికి సిద్ధమయ్యాడు. అయితే సూర్యకుమార్ ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ, కోహ్లికి దూరంగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన లైవ్ చాట్లో ఈ ఘటన గురించి ప్రస్తావన రాగా సూర్యకుమార్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘కోహ్లి మైదానంలో చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు. కేవలం నాతోనే కాదు, ఏ బ్యాట్స్మెన్తోనైనా అలాగే దూకుడుగా ఉంటాడు. నిజానికి తను నన్ను స్లెడ్జ్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే... నేను బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తామని తను భావించాడు. నా వికెట్ తీయాలని, తద్వారా గెలుపొందాలని వారి వ్యూహం. అంటే, నా బ్యాటింగ్ వల్ల వారికి ప్రమాదం పొంచి ఉందనే అర్థం కదా. అయితే ఇదంతా ఆట వరకే. నిజానికి కోహ్లి అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఘటన తర్వాత, మైదానం వెలుపల తను నాతో ఎంతో నార్మల్గా ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా, తనకు అవకాశం వచ్చినపుడు కచ్చితంగా బౌలింగ్ కూడా చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఆ మ్యాచ్లో సూర్యకుమార్ (43 బంతుల్లో 79 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు) సూపర్ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి: England Tour: ‘బయో బబుల్’లోకి కోహ్లి, రోహిత్ -
కాస్కోండి.. మిమ్ముల్ని చితక్కొట్టడానికి వస్తున్నాడు!
ముంబై: గత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానానికి పరిమితం కావడంతో ఆ జట్టులో పస అయిపోయిదంటూ విమర్శలు వినిపించాయి. ఈ సీజన్ ఆరంభానికి ముందు కూడా ‘సీనియర్ సిటిజన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు మొదలయ్యాయి. ఐపీఎల్-14 సీజన్లో కూడా గత జట్టుతోనే సీఎస్కే బరిలోకి దిగడమే అందుకు కారణం కావొచ్చు. అయితే సూపర్ కింగ్స్కు కర్త, కర్మ, క్రియగా సర్వం తానే అయి నడిపించే ధోని ఉండగా ఏదీ అసాధ్యం కాదని ఆ జట్టు నమ్ముతోంది. అందుకు తగ్గట్టుగానే ధోని అందరికంటే ముందుగానే ఐపీఎల్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. వరుసగా ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను చూస్తే ఫుల్ రిథమ్లో కనిపిస్తున్నాడు. భారీ షాట్లు కొట్టడంలో సిద్ధహస్తుడైన ధోని.. ఈసారి మాత్రం తన పవర్ ఏమిటో మళ్లీ చూపించాలనే ఉద్దేశమే అతని ప్రాక్టీస్లో కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎస్కే కూడా తాజాగా స్సష్టం చేసింది. బౌలర్లు.. మిమ్ముల్ని చితక్కొట్టడానికి తలా పరాక్ ఫుల్లీ లోడెడ్గా వస్తున్నాడు..విజిల్పోడు’ అంటూ ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ కూడా ఇచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే ఫ్రాంచైజీ ఇన్స్టాలోషేర్ చేసింది. సీఎస్కే ఫ్యాన్స్ను అలరించే ఈ వీడియోలో కొన్ని ధోని మార్కు షాట్లు ఉన్నాయి. వన్ హ్యాండెడ్ షాట్ కూడా ఇందులో ఉంది. గత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే జట్టు తరఫున సురేశ్ రైనా ఆడకపోవడం కూడా ప్రభావం చూపించింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈ నుంచి రైనా ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేశాడు. దానిపై అప్పట్లో పెద్ద విమర్శలే వచ్చాయి. అసలు రైనా భవితవ్యం ఏమిటి అని ప్రశ్న తలెత్తింది. అప్పుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన రైనా.. సీఎస్కే జట్టును వీడి రావడంపై అనేక అనుమానాలు వచ్చాయి. కానీ ఈసారి రైనా తిరిగి సీఎస్కే ఆడుతుండటంతో గత సీజన్ ఘటనకు ఫుల్స్టాప్ పడింది. ఇప్పుడు రైనా రాకతో సీఎస్కే మంచి జోష్లోనే ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రైనా రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో 5,368 పరుగులు సాధించాడు. ఇక్కడ చదవండి: IPL 2021: వాంఖడేలో మ్యాచ్లపై ఎంసీఏ స్పష్టత ఆర్సీబీ నా మాట వినండి.. ఏబీని అలా చేయవద్దు! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement