-
ఇన్పుట్ ఇక్కట్లు
ఇప్పటికీ అందని 2014 ఇన్పుట్ సబ్సిడీ కాళ్లరిగేలా తిరుగుతున్న 22 వేల మంది రైతులు తప్పులతడకల జాబితాతో రూ.33 కోట్లు వెనక్కి? అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీ ప్రహసనంగా మారింది. 2014కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ నేటికీ పూర్తి చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. మూడేళ్లు కావస్తున్నా దాదాపు 22 వేల మంది రైతులు పరిహారం అందకపోవడంతో వారంతా కార్యాలయాల చట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మిస్ మ్యాచింగ్తోనే సమస్య వర్షాలు లేక ఖరీఫ్–2014లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేరుశనగ, ఇతర పంటలకు సంబంధించి 5.72 లక్షల మంది రైతులకు రూ.559.68 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరైంది. అయితే ఈ పరిహారాన్ని ఆన్లైన్లో రైతుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం ప్రహసనంగా సాగుతోంది. పంట నష్టపోయిన రైతుల జాబితా తయారీకి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు చేసిన పొరపాట్లు రైతులకు శాపంగా మారాయి. రైతు, తండ్రి పేరు, గ్రామం, పంట, సర్వే నంబరు, పట్టా నంబరు, బ్యాంకు అకౌంట్, ఆధార్ తదితర అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు రైతుల నుంచి సేకరించినా వాటిని అప్లోడ్ చేసే సమయంలో చేసిన తప్పిదాలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. దీంతో పేరు కరెక్టు ఉంటే బ్యాంకు అకౌంట్ నంబర్, లేదంటే ఆధార్ నంబర్, అదీ బాగుంటే పట్టా నంబర్, లేదంటే తండ్రి పేరు, అదీ కాదంటేæ ఇంటిపేరు... ఇలా ఒకటి కాదు రెండు కాదు మిస్ మ్యాచింగ్ జాబితాతో సతమతమవుతున్నారు. బ్యాంకులకు వెళ్లిన పరిహారం పెద్ద ఎత్తున మిస్మ్యాచింగ్ జాబితాలో నిలిచిపోవడంతో వాటిని సరి చేసుకునేందుకు ఏఓలు, మండల గ్రీవెన్స్లు, జిల్లా గ్రీవెన్స్, జేడీఏ కార్యాలయం, బ్యాంకులు... ఇలా అన్ని చోట్ల తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు అధికార పార్టీకి చెందిన మండలస్థాయి నేతలు తమ వారికే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, మరో పార్టీకి సంబంధించిన వారికి ఇవ్వొద్దంటూ ఒత్తిళ్లు చేస్తుండటంతో పరిహారం పంపిణీకి బ్రేకులు పడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే పరిహారం కన్నా దాని కోసం తిరగడానికి , జిరాక్స్ పత్రాలకే డబ్బులు ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి నెలకొందరు కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు పరిహారం కోసం 20 నుంచి 30 సార్లు తిరిగారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. 8 విడతల్లో రూ.505 కోట్లు విడుదల జిల్లాకు మంజూరైన రూ.559.68 కోట్లలో 2015 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది విడతలుగా రూ.505.68 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదలైంది. మొదట్లో రూ.45 కోట్ల వరకు మిస్మ్యాచింగ్ జాబితాలో నిలిచిపోగా... గత రెండేళ్లుగా పదుల సార్లు తిరిగి కాళ్లావేళ్లా పడి జాబితాను సరి చేసుకోవడంతో ప్రస్తుతం అది రూ.6 కోట్లు చేరుకున్నట్లు సమాచారం. విడుదల చేసింది పోను ఇంకా రూ.54 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. తొమ్మిదో విడత కింద రూ.4 కోట్లు, పదో విడత కింద రూ.21 కోట్ల వరకు అవసరమని జిల్లా అధికారులు రెండు నెలల కిందటే ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని తెలుస్తోంది. అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం తక్షణం రూ.25 కోట్లు కావాలని చెబుతున్నారు. ప్రతిపాదించిన ప్రకారం ప్రభుత్వం నుంచి రూ.25 కోట్లు విడుదలైనా మిగతా రూ.33 కోట్లు వెనక్కివెళ్లడం ఖాయమంటున్నారు. సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేస్తాం సాంకేతిక సమస్యతోనే ఇన్పుట్ సబ్సిడీ ఆలస్యమవుతోంది. రెండు, మూడు రోజుల్లో తొమ్మిది, పదో విడత ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ అవుతుంది. సాధ్యమైనంత త్వరగా రైతులందరికీ పంపిణీ చేస్తాం. ఈ మేరకు ఇన్పుట్ సెల్ అధికారులకు, ఏడీఏలు, ఏఓలకు ఆదేశాలు జారీ చేశాం. శ్రీరామమూర్తి, జేడీఏ -
రైతన్న దైన్యం
నెల్లూరు(అగ్రికల్చర్): కొనబోతే కొరివి..అమ్మబోతే అడవి..అన్నట్లు తయారైంది. రబీలో వరి పండించిన రైతుల పరిస్థితి. వరుస వైపరీత్యాలు..ఎరువులు, విత్తనాల సమస్యలు..రుణాలు రీషెడ్యూల్ కాక తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు..ఇలా ఎన్నో అవరోధాలను అధిగమించి ఆరుగాలం శ్రమించి వరి పండించిన రైతు చివరకు ధర విషయంలోనూ దగాకు గురవుతున్నారు. లేవీ సేకరణ నిబంధనలను ప్రభుత్వం మార్చేయడం..ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రాకపోవడం..ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు చాలాచోట్ల పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడా లభించడం లేదు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో కనీస మద్దతు ధరైనా లభిస్తే కొంతలో కొంతైనా గట్టెక్కవచ్చన్న అన్నదాత ఆశలు హరించుకుపోతున్నాయి. దిష్టిబొమ్మల్లా కొనుగోలు కేంద్రాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదు. పైగా సవాలక్ష నిబంధనలు పెట్టడంతో ప్రభుత్వం కేంద్రాల వైపు రైతులు మొగ్గుచూపడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సొమ్మును రైతుకు నేరుగా ఇవ్వకుండా ఆన్లైన్లో బ్యాంకులో వేస్తున్నారు. బ్యాంకు అధికారులు ధాన్యం సొమ్మును పాత రుణాలకు జమ చేసుకుంటుండటంతో రైతులు పరిస్థితి దయనీయంగా తయారైంది. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. వచ్చిన కాడికి చాలు అనుకుంటూ కళ్లాలోనే ధాన్యం తెగనమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. అరకొరగా కొనుగోళ్లు జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 1.219 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించగా ఇప్పటివరకు 15 కేంద్రాల ద్వారా 1,253 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగలిగారు. 109 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినప్పటికి 94 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఇంకా చాలా చోట్ల కేంద్రాలే తెరచుకోలేదు. లభించని మద్దతు ధర.. రైతులకు మద్దతు ధర దక్కెలా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఏ గ్రేడు క్వింటాలు రూ.1400, సాధారణ రకం రూ.1360 మద్దతు ధరగా ప్రకటించారు. 150 కొనుగోలు కేంద్రాలకుగానూ 15 మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటిలోనూ కొనుగోళ్లు సాగడం లేదు. ఇదే అదనుగా దళారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తున్నారు. అన్నీ సమస్యలే.. కొనుగోలు కేంద్రాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే నాణ్యత పరీక్షల పేరుతో సవాలక్ష వంకలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ముందుగా నాణ్యత పరీక్షల కోసం రెండు, మూడు కేజీల ధాన్యాన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అందులో తేమ శాతం, రాళ్లు, మట్టిగడ్డలు, చెత్త, తాలు, కల్తీగింజలు, తదితర కారణాలతో ధరను తగ్గిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమశాతం నిర్ణయించే మిషన్, కాటాలు, తూకం రాళ్లు, ప్యాడీ క్లీనర్లు, క్లాలీపర్స్, జల్లెడలు, గోతాలను అందుబాటులో ఉంచాలి. అయితే వీటిని కూడా రైతులే తీసుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామాల నుంచి కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రవాణా, కూలీల ఖర్చులు రైతులే భరించాల్సి వస్తోంది. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు, భూమి సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలతో కూడిన అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం, రుణ అర్హత కార్డు వంటి వాటి జెరాక్సు కాపీలు అందజేయాల్సి ఉంది. దీంతో రైతు మొగ్గుచూపడం లేదు. దళారులకు ధాన్యం అమ్మి నష్టపోతున్నాడు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement