-
అంతర్జాతీయ క్రికెట్కే సిగ్గుచేటు: పాక్ ఆటగాడిపై విమర్శలు
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్పై విమర్శల వర్షం కురుస్తోంది. సొంత జట్టు అభిమానులే అతడి ఆట తీరుపై మండిపడుతున్నారు. బంధుప్రీతితో ఇలాంటి వాళ్లను జట్టుకు ఎంపిక చేస్తే మున్ముందు భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి సన్నద్దమయ్యే క్రమంలో బట్లర్ బృందంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ ఆడింది.తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మూడో టీ20 రద్దైపోగా.. గురువారం నాటి ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.పూర్తిగా విఫలంఇదిలా ఉంటే.. తాజా సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఆడిన రెండు మ్యాచ్లలోనూ పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండో టీ20లో 10 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్.. నాలుగో టీ20లో డకౌట్ అయ్యాడు.ఇంగ్లండ్ సీనియర్ పేసర్ మార్క్వుడ్ దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఐదు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. కాగా 2021లో ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆజం ఖాన్.. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్లు ఆడి కేవలం 88 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్రేటు 135.38.అయితే, వరల్డ్కప్-2024 జట్టులో మాత్రం అనూహ్యంగా అతడికి చోటు దక్కింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో సిరీస్లోనైనా రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని భావిస్తే.. ఆజం ఖాన్ పూర్తిగా విఫలం కావడం అభిమానులను సైతం నిరాశపరిచింది.ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ అంటూ ట్రోల్స్ఇక ఈ సిరీస్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడటంతో అందరి దృష్టి ఆజం ఖాన్పై పడింది. వికెట్ కీపర్గానూ అతడు విఫలం కావడంతో.. ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ తప్ప ఏమాత్రం ఉపయోగం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆజం ఖాన్పై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అతడి ఆట తీరుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ.. ‘‘నెపోటిజం అన్న పదానికి అత్యుత్తమ ఉదాహరణగా ఇతడిని చూపవచ్చు.అతడు జట్టులో ఉండాలని కోరుకున్న వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలి. ఇదేదో చిన్న పొరపాటు కాదు.. తీవ్రంగా పరిగణించదగ్గ నేరం. అంతర్జాతీయ క్రికెట్కే ఒక రకంగా సిగ్గుచేటు’’ అని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తనయుడే ఈ ఆజం ఖాన్!!చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుAzam Khan is an embarrassment to international cricket pic.twitter.com/Ferp0ys5nf— yang goi (@GongR1ght) May 30, 2024Azam Khan is the best example of nepotism in our country. Mediocrity rules here in every department. Shameless people who persisted with him must be charged and sentenced. This is a criminal act not a simple mistake.— Mubasher Lucman (@mubasherlucman) May 30, 2024WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024 -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్గా రికార్డుకెక్కింది. చెమ్స్ఫోర్డ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన ఎక్లెస్టోన్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.సోఫీ కేవలం 63 మ్యాచ్ల్లో 100 వికెట్ల మార్క్ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్ప్యాట్రిక్ పేరిట ఉండేంది. ఆమె 64 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను నమోదు చేసింది. తాజా మ్యాచ్తో క్యాథరిన్ ఆల్టైమ్ రికార్డును ఎక్లెస్టోన్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్పై 178 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. -
ENG vs PAK: ఇంగ్లండ్కు ఓ గుడ్న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్తో జరగనున్న మూడో టీ20కు ముందు ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మూడో టీ20కు దూరమయ్యాడు. బట్లర్ భార్య లూయిస్ తమ మూడో బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. బట్లర్ పితృత్వ సెలువు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మూడో టీ20కు జోస్ దూరం కానున్నాడు. నాలుగో టీ20కు కూడా అతడి అందుబాటులో ఉండేది అనుమానమే. బట్లర్ గైర్హజరీలో స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇంగ్లీష్ జట్టును నడిపించనున్నాడు. అయితే తొలుత బట్లర్ టీ20 వరల్డ్కప్-2024లోని తమ ప్రారంభ మ్యాచ్లకు బట్లర్ దూరమవుతాడని అంతా భావించారు. కానీ అనుకున్న సమయం కంటేముందు తన భార్య బిడ్డకు జన్మనించే అవకాశం ఉంది.దీంతో అతడు ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు ఇంగ్లండ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 3000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 115 టీ20 మ్యాచ్లు ఆడిన బట్లర్.. 3011 పరుగులు చేశాడు.బట్లర్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో 23 ఫిప్టీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా బట్లర్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(84)తో పాటు విల్ జాక్స్(37), బెయిర్ స్టో(21) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. రవూఫ్, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. -
చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్ ఆజం
వన్డే వరల్డ్కప్-2023ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్కతా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 44.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో అఘా సల్మాన్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ వరల్డ్కప్లో పాకిస్తాన్కు ఇది ఐదో ఓటమి. వన్డే ప్రపంచకప్ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్ 5 మ్యాచ్ల్లో ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. "ఈ మ్యాచ్లో మా ప్రదర్శన చాలా నిరాశపరిచింది. మేము దక్షిణాఫ్రికా మ్యాచ్లో గెలిచినట్లయితే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో తప్పిదాలు చేశాం. 20-30 పరుగులు అదనంగా ఇచ్చాం. మా స్పిన్నర్లు వికెట్లు తీయలేదు. అది మాపై పెద్ద ప్రభావాన్ని చూపింది. మిడిల్ ఓవర్లో స్పిన్నర్లు వికెట్లు తీయకపోతే ఏ జట్టుకైనా గెలవడం చాలా కష్టం. ఈ టోర్నీలో మేము చేసిన తప్పిదాలను కచ్చితంగా చర్చిస్తాం. తప్పులతో పాటు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. జట్టుకు సారథిగా ఎల్లప్పుడూ 100 శాతం ఎఫెక్ట్ పెడతాను" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బాబర్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: నెదర్లాండ్స్తో మ్యాచ్.. బుమ్రా దూరం! జట్టులోకి యువ బౌలర్ -
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్..
వన్డే ప్రపంచకప్-2023ను ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో 93 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో అఘా సల్మాన్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: World Cup 2023: వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
జో రూట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్.. ఈ అరుదైన మైలు రాయిని రూట్ అందుకున్నాడు. రూట్ ఇప్పటివరకు వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో 25 ఇన్నింగ్స్లలో 1034 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 72 బంతులు ఎదుర్కొన్న రూట్.. 4 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది వరల్డ్కప్లో రూట్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన రూట్.. 248 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: World Cup 2023: వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. -
చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. పాక్ టార్గెట్ 338 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ ఎట్టకేలకు తమ బ్యాటింగ్ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా వేదికగా పాకిస్తాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇఫ్తికర్ అహ్మద్కు ఒక వికెట్ దక్కింది. చదవండి: WC 2023: వరల్డ్కప్లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్బై..! -
టాస్ ఓడిన పాక్.. సెమీస్ రేసు నుంచి అవుట్! 2.5 ఓవర్లలో ఛేదిస్తేనే
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బాబర్ టాస్ ఓడిపోవడంతో పాకిస్తాన్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా శ్రీలంకపై జయభేరి మోగించి న్యూజిలాండ్ అనధికారికంగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సాంకేతికంగా పాక్కు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు ఉండేవి. ఇంగ్లండ్పై 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 3 ఓవర్లలోపు ఛేదించడం వంటి సమీకరణలు ఉన్నాయి. అయితే, గత రికార్డుల దృష్ట్యా ఇది ఏ రకంగా చూసినా అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇక తాజాగా ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడం లాంఛనమే అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు బాబర్ ఆజం మాట్లాడుతూ.. ఇంగ్లండ్తో మ్యాచ్ గెలిచి.. రన్రేటు భారీగా పెంచుకుంటామని తెలిపాడు. అయితే, అద్భుతం జరిగితే తప్ప అతడి మాటలు నిజమయ్యే ఛాన్స్ లేదు! కాబట్టి పాక్ ఖేల్ టాస్ వద్ద ఖతమైందని చెప్పొచ్చు! కానీ.. బాబర్ చెప్పినట్లు క్రికెట్లో ఎప్పుడు, ఏమైనా జరగొచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! అయితే, పాజిటివిటీకి అది పరాకాష్ట లాంటిదే! సమీకరణాల దృష్ట్యా అలాంటి అవకాశం ఇప్పుడైతే లేదు మరి!! View this post on Instagram A post shared by ICC (@icc) ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది కాబట్టి! ►ఇంగ్లండ్ స్కోరు - 20, 1.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ స్కోరు - 50, పాక్ 2 ఓవర్లలోనే ఛేదించాలి ►ఇంగ్లండ్ - 100, 2.5 ఓవర్లలోనే పాక్ ఛేదించాలి ►ఇంగ్లండ్ - 150, పాక్ 3.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ - 200, 4.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి ►ఇంగ్లండ్ - 300, పాక్ 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. చదవండి: కానిస్టేబుల్ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! -
పాక్కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్కతా వేదికగా ఇంగ్లండ్ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి. లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం. ఈ మేరకు ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం. రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్తో పాటు ఆల్రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు. చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా -
CWC 2023: పాక్ను సెమీస్కు చేర్చేందుకు వసీం అక్రమ్ మాస్టర్ ప్లాన్
ప్రస్తుత ప్రపంచకప్లో పాక్ సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదో అత్యద్భుతం జరిగితే తప్ప, దాయాది జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించలేదు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడా గెలవడంతో నాలుగో సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు ఆ జట్టు సెమీస్కు చేరడం ఖాయమైపోయింది. పాక్ సెమీస్కు చేరాలంటే ఆ జట్టు ముందు రెండు ప్రధాన అప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లండ్తో రేపు (నవంబర్ 11) జరుగబోయే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేయడం. అనంతరం ప్రత్యర్ధిని 287 పరుగుల తేడాతో ఓడించడం. ఈ మ్యాచ్లో పాక్ కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్ను 13 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. అదే 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు ప్రత్యర్ధిని మట్టుబెట్టాల్సి ఉంటుంది. వన్డేల్లో ఒక్కసారి కూడా 400 స్కోరు దాటని పాక్కు ఈ టాస్క్ అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో పాక్ టాస్ ఓడితే బరిలోకి దిగకుండానే సెమీస్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇంగ్లండ్ నిర్ధేశించే ఎంతటి లక్ష్యాన్నైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగానూ ఊహకు అందని విషయం. కాబట్టి పాక్ సెమీస్ అవకాశాల విషయంలో ప్లాన్ ఏ ఫెయిల్ అయినట్లే అని చెప్పాలి. ప్లాన్ బి ఏంటంటే.. పాక్ సెమీస్కు చేరే అంశంపై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ఓ స్థానిక టీవీ ఛానల్ డిబేట్లో అతను మాట్లాడుతూ పాక్ జట్టుపై సెటైర్లు వేశాడు. ఇంగ్లండ్పై తమ జట్టు 400కు పైగా స్కోర్ చేయడం లేదా 287 పరుగుల భారీ తేడాతో గెలవడం వంటివి జరగని పనులు. కాబట్టి పాక్ సెమీస్కు చేరాలంటే ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. పాక్ తొలుత బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఆపై ఇంగ్లండ్ జట్టును డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి తాళం వేసి, వారి బ్యాటర్లందరినీ 'టైమ్డ్ ఔట్' అయ్యేలా చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్గా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే వసీం అక్రమ్ పాక్ జట్టుపై టైమ్డ్ ఔట్ సెటైర్లు వేశాడు. -
పాక్ సెమీస్కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్ ఓడినా ఇంటికే..!
వన్డే వరల్డ్కప్ 2023లో సెమీస్ బెర్త్లు దాదాపుగా ఖరారైపోయాయి. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ సెమీస్కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. శ్రీలంకపై భారీ తేడా గెలవడంతో న్యూజిలాండ్ నాలుగో సెమీస్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుని భారత్తో పోటీకి సిద్ధమైంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్లు సెమీస్కు చేరలేవు. 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాక్ ముందుకు.. అక్షరాలా 287 పరుగులు... శనివారం ఇంగ్లండ్పై ఇంత భారీ తేడాతో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్ను 13 పరుగులకు పరిమితం చేయాలి! 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. వన్డేల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్ జట్టు 400 పరుగుల స్కోరు దాటలేదు. ఇంగ్లండ్ ఏ జట్టుకూ 400 పరుగులు సమర్పించుకోలేదు. ఇంగ్లండ్ను నిలువరించడం సంగతేమో కానీ పాక్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ జట్టే కనీసం 300 పరుగులు చేసే స్థితిలో లేదు. అసలు 287 పరుగులు చేస్తే గానీ లెక్క రాసే అవకాశం కూడా లేదు! ఇక ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం టాస్ వద్దే పాక్ జట్టు ఖేల్ ఖతం. ఎందుకంటే ఎంతటి లక్ష్యమైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది! ఇది ఏ రకంగానూ ఊహకు కూడా అందనిది. చదవండి: CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు..! -
న్యూజిలాండ్కు షాక్ తప్పదా? బ్యాడ్న్యూస్ ఏమిటంటే..?
WC 2023- Semi Final Race: వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ రేసులో నిలిచే జట్లపై మూడు రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4లో నిలిచేందుకు న్యూజిలాండ్, పాకిస్తాన్లతో పాటు.. అఫ్గనిస్తాన్ కూడా పోటీ పడుతోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఈ మూడు జట్లు నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే, రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్లను దాటి నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో ఈ మూడు జట్లకు మిగిలిన ఒక్క మ్యాచ్లో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపైనే సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్లలో న్యూజిలాండ్, పాక్, అఫ్గన్ విజయం సాధిస్తే రన్రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టే సెమీస్లో అడుగుపెడుతుంది. ముందుగా న్యూజిలాండ్ బరిలోకి ఈ క్రమంలో ముందుగా... న్యూజిలాండ్ శ్రీలంకతో గురువారం మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో కివీస్ భారీ విజయం గనుక సాధిస్తే సులువుగానే సెమీస్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అయితే, వర్షం రూపంలో కివీస్ జట్టుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. accuweather సైట్ వివరాల ప్రకారం గురువారం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా.. లేదంటే దురదృష్టవశాత్తూ లంక చేతిలో ఓడినా కివీస్కు ఎదురుదెబ్బ తప్పదు. అలా అయితే పాక్, అఫ్గన్ మరింత ముందుకు కాగా వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే కివీస్, లంకకు చెరో పాయింట్ మాత్రమే వస్తుంది. అంటే అపుడు కివీస్ ఖాతాలో 9 పాయింట్లు మాత్రమే ఉంటాయి. వర్షం పడక అంతా సవ్యంగా సాగి గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. అయినప్పటికీ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాల తర్వాతే సెమీస్ బెర్తు ఖాయమైంది లేనిదీ తెలుస్తుంది. అయితే, శ్రీలంకతో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం అఫ్గన్, పాకిస్తాన్ రేసులో మరో ముందడుగు వేస్తాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ -
T20 WC: ప్రపంచకప్నకు ముందు పాక్ కీలక సిరీస్.. షెడ్యూల్ విడుదల
Pakistan Men And Women To Tour England 2024: టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్ వచ్చే ఏడాది ఇంగ్లండ్లో పర్యటించనుంది. వెస్టిండీస్, యూఎస్ఏలో జరుగనున్న ఈ మెగా టోర్నీకి ముందు పాక్ పురుష, మహిళా జట్లు ఇంగ్లండ్ టీమ్తో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. స్వదేశంలో పాకిస్తాన్తో వరుస సిరీస్లకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. మే 22, 2024 నుంచి ఇంగ్లండ్- పాకిస్తాన్ పురుష జట్ల మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక అంతకంటే ముందుగానే అంటే.. మే 11 నుంచి మహిళా జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సమరం మొదలుకానుంది. ఇంగ్లండ్- పాకిస్తాన్ వుమెన్ టీమ్లు మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్- పాకిస్తాన్ తలపడగా.. జో రూట్ బృందం జగజ్జేతగా నిలిచింది. ఇంగ్లండ్లో పాకిస్తాన్ పర్యటన-2024 పూర్తి వివరాలు మహిళా జట్ల టీ20, వన్డే సిరీస్ ►తొలి టీ20 మే 11- ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హాం ►రెండో టీ20 మే 17- ది కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్ ►మూడో టీ20 మే 19- హెడ్డింగ్లీ, లీడ్స్ ►మొదటి వన్డే మే 23- డెర్బీ ►రెండో వన్డే మే 26- టాంటన్ ►మూడో వన్డే మే 29- చెల్మ్స్ఫోర్డ్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మెన్స్ నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ►తొలి టీ20- మే 22- హెడ్డింగ్లీ, లీడ్స్ ►రెండో టీ20- మే 25- ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హాం ►మూడో టీ20- మే 28- సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ ►నాలుగో టీ20- మే 30- ది ఓవల్, లండన్. చదవండి: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! -
కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్
ICC Womens T20 World Cup 2023- ENGW Vs PAKW: మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్ చేసిన తప్పునకు పెనాల్టీ కింద ఇంగ్లండ్కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు అంపైర్లు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్యాటర్ బ్యాక్ఫుట్ షాట్ ఆడింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కీపర్ సిద్రా నవాజ్కు త్రో విసిరింది. అయితే కీపర్ నవాజ్ తన చేతికున్న గ్లోవ్స్ను కింద పడేసి బంతిని అందుకుంది. ఆ తర్వాత బంతిని కింద పడేసిన గ్లోవ్స్కు కొట్టింది. ఇది గమనించిన అంపైర్లు కొంతసేపు చర్చించుకున్న తర్వాత కీపర్ నవాజ్ తప్పిదాన్ని గుర్తిస్తూ పాక్కు పెనాల్టీ విధిస్తూ ఇంగ్లండ్కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం కీపర్ ఓవర్ పూర్తయిన తర్వాతే చేతికున్న గ్లోవ్స్ తొలగించొచ్చు.. లేదంటే బౌలర్ బంతి విడవకముందు సరిచేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బంతి వేశాకా గ్లోవ్స్ తీసేసినా.. కింద పడేసిన గ్లోవ్స్పై బంతిని విసరడం నిబంధనలకు విరుద్ధం. ఈ తప్పిదం కింద జట్టుకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇక మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టు భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి ఇన్నింగ్స్ల ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 24న జరగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 23న(గురువారం) జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా వుమెన్స్, ఆస్ట్రేలియా అమితుమీ తేల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: పాక్ కెప్టెన్పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు కోహ్లి ప్రపంచ రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్ -
‘టీమిండియాను పాక్ మాత్రమే ఓడించగలదు’.. అవునా! కౌంటర్ అదుర్స్
India vs Australia- World Test Championship: టీమిండియా- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ పాకిస్తాన్ అభిమానికి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. సానుకూల దృక్పథంతో ఉండటం తప్పు కాదంటూనే పాక్ జట్టు వైఫల్యాలు ఎత్తిచూపుతూ సెటైర్లు వేశాడు. కాగా భారత్ వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. ఇరు జట్ల మధ్య నాగ్పూర్లో గురువారం తొలి టెస్టు ఆరంభం కాగా.. ఆది నుంచి రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్విటిజెన్.. ‘‘భారత గడ్డపై టీమిండియాను ఓడించగల సత్తా కేవలం పాకిస్తాన్కు మాత్రమే ఉంది’’ అంటూ కామెంట్ చేశాడు. పాపం.. పాకిస్తాన్! తిక్క కుదిరింది.. ఇందుకు స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘నీ సానుకూల దృక్పథం నాకు నచ్చిందబ్బాయ్! అయితే.. ఒకటి కనీసం సొంతగడ్డపై అయినా మీ జట్టు సిరీస్లు గెలవొచ్చు కదా! ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో స్వదేశంలో సిరీస్లు ఏమయ్యాయి. విదేశీ గడ్డపై బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ల సిరీస్లు అన్నిటిలో పాకిస్తాన్ గెలిచి ఉంటే గనుక ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరి ఉండేది’’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తిక్క బాగా కుదిర్చావు! దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు ఆకాశ్ భాయ్’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ పోరులో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో భాగంగా ఆఖరి టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్.. ఆసీస్పై గెలిస్తే ఫైనల్ చేరడం ఖాయం. మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సొంతగడ్డపై ఇంగ్లండ్తో వైట్వాష్కు గురవడం సహా ఇతర సిరీస్లు గెలవలేకపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో ముగించింది. చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్కు చుక్కలు! వీడియో వైరల్ Todd Murphy: 7 వికెట్లతో చెలరేగిన ఆసీస్ సంచలనం.. మరో రికార్డు! I love your positivity but janaab, aap Apne ghar ki series toh Jeet lo. With Australia, England and NZ at home. Bangladesh, Sri Lanka and WI in away series, Pakistan should have reached the WTC finals already. 🫣🫂 https://t.co/UEo67hQYU9 — Aakash Chopra (@cricketaakash) February 9, 2023 -
ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. పాక్ హెడ్ కోచ్పై వేటు! బాబర్ కూడా..
ఇంగ్లండ్తో చారిత్రాత్మక టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్లో ప్రక్షాళన మొదలైంది. తమ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాకు ఉద్వాసన పలికేందుకు సిద్దమైన పాకిస్తాన్ క్రికెట్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, కెప్టెన్ బాబర్ ఆజంపై కూడా పీసీబీ గవర్నింగ్ కౌన్సిల్ వేటు వేసేందుకు సిద్దమయినట్లు సమాచారం. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ అనంతరం సక్లైన్ ముస్తాక్ తన హెడ్ కోచ్ బాధ్యతలు తప్పుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఏడాది జూలైలో బాబర్ ఆజం కూడా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం గడ్డాఫీ స్టేడియంలోని పిసిబి ఛైర్మన్ రమీజ్ రాజా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పీసీబీ సెలెక్టర్ మహ్మద్ వసీం కూడా పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశంలో టెస్టు కెప్టెన్సీ, హెడ్ కోచ్ సక్లైన్ పాత్ర గురించి చర్చ జరిగింది. టెస్టు కెప్టెన్గా బాబర్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకున్నాం. అతడిని వచ్చే ఏడాది జూలై వరకు టెస్టు కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించాం. ఆ తర్వాత పాక్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ను ఎంపిక చేస్తాం" అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా వైట్ బాల్ క్రికెట్లో సారథిగా విజయవంతమైన బాబర్.. టెస్టుల్లో మాత్రం తన కెప్టెన్సీ మార్క్ను చూపించలేకపోయాడు. చదవండి: బంగ్లాదేశ్తో రెండో టెస్ట్.. టీమిండియా కెప్టెన్కు గాయం..? -
ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ ఎఫెక్ట్.. పీసీబీ చైర్మన్ను పీకేసిన పాక్ ప్రధాని
Ramiz Raja: స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజాపై పడింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవంతో పాటు స్వదేశంలో వరుసగా నాలుగు టెస్ట్ల్లో ఓటమి, అలాగే ఇంగ్లండ్ సిరీస్లో పిచ్ల తయారీపై ఆరోపణల నేపథ్యంలో రమీజ్కు ఉద్వాసన పలినట్లు పీసీబీ ఇవాళ (డిసెంబర్ 21) ప్రకటించింది. రమీజ్పై వేటును పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ కూడా సమర్ధించారని, ఇందుకు ఆయన కూడా ఆమోద ముద్ర వేశారని పీసీబీ వెల్లడించింది. రమీజ్ స్థానంలో పీసీబీ నూతన చైర్మన్గా నజమ్ సేథీ (78) బాధ్యతలు చేపడతారని, సేథీని స్వయంగా పాక్ ప్రధానే నామినేట్ చేశారని పీసీబీ పేర్కొంది. కాగా, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉండగా 2021 సెప్టెంబర్లో రమీజ్ రజా పీసీబీ చైర్మన్గా ఎంపికయ్యారు. రమీజ్ హయాంలో పాక్ రెండు టీ20 వరల్డ్కప్లు, 50 ఓవర్ల మహిళ వన్డే ప్రపంచకప్లో పాల్గొంది. రమీజ్.. తన హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలు ఉండటంతో అతని హవా కొనసాగింది. ప్రస్తుతం ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడంతో రమీజ్పై కూడా వేటు తప్పలేదు. పీసీబీ నిబంధనల ప్రకారం బోర్డు అధ్యక్షుడిని ప్రధాని నామినేట్ చేస్తే.. బోర్డు ఆఫ్ గవర్నర్లు అతన్ని అధికారికంగా ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే, పీసీబీ కొత్త చైర్మన్ నజమ్ సేథీ ఈ పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదు. 2018లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు సేథీ పీసీబీ అత్యున్నత పదవిలో కొనసాగారు. అయితే నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో విభేదాల కారణంగా నజమ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! ప్రతి వాడూ..
Pakistan vs England, 3rd Test- Babar Azam: ‘‘ప్రతీ ఫార్మాట్ కోసం ఒక కచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. తమ వ్యూహాలకు అనుగుణంగా ఎవరైనా ఎలాగైనా ఆడవచ్చు. అయితే, ఒక్కరోజు లేదంటే ఒక్క వారంలో మార్పు సాధ్యం కాదు. ఆటతీరు మార్చుకోవడానికి, ఆటగాళ్ల మైండ్సైట్ మారాలంటే కాస్త సమయం పడుతుంది. అంతేగానీ వెంట వెంటనే ఏదీ జరిగిపోదు. ఒకవేళ మేము డిఫెన్స్ ఆడితే.. దూకుడుగా ఎందుకు ఆడటం లేదని ప్రశ్నిస్తారు. అదే దూకుడుగా ఆడితే.. ఇంకోలా ఆడొచ్చు కదా అంటారు. మనం ఎలా ఆడినా ఇలాంటి పెదవి విరుపులు, ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందరికి సంతృప్తి కలిగేలా ఆడటం ఎవరికీ సాధ్యం కాదు’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. ఇంగ్లండ్లా ‘బజ్బాల్’ విధానాన్ని అవలంబించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాకు పరక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శనం, కెప్టెన్ బెన్ స్టోక్స్ నేతృత్వంలో ఇంగ్లండ్ టెస్టుల్లోనూ దూకుడైన ఆట తీరు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు తమ తమ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లండ్ ఆడిన 10 టెస్టుల్లో తొమ్మిదింట విజయం సాధించడంతో.. బజ్బాల్ విధానంపై క్రీడా ప్రపంచంలో చర్చ నడుస్తోంది. బాబర్కు చెప్పాను.. ఈ నేపథ్యంలో పర్యాటక ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్రై క్రికెట్ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ మాదిరిగానే.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడాలని బాబర్కు సూచించాను. ఇందుకోసం జట్టులో ఎక్కువ మంది టీ20 ప్లేయర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పాను. పాకిస్తాన్ ఇలాంటి ఆటతీరు కచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే. భవిష్యత్ తరం ఇంగ్లండ్ మాదిరిగానే సంప్రదాయ క్రికెట్లోనూ టీ20ల మాదిరి ఆడాలని బలంగా కోరుకుంటున్నా’’ అని రమీజ్ రాజా పేర్కొన్నాడు. మ్యాచ్ ఓడితే ఇంతే! ఈ విషయం గురించి మూడో టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజంకు ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలో పాక్ సారథి ఈ మేరకు పైవిధంగా స్పందించాడు. మ్యాచ్ ఫలితాన్ని బట్టే ఎదుటి వాళ్ల ప్రవర్తన ఉంటుందన్న బాబర్... ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే విమర్శలు వినిపిస్తాయి అని పేర్కొన్నాడు. ప్రతి ఫార్మాట్కు ఒక విధానమంటూ ఉంటుందని.. ఒక్కరోజులోనే మార్పు సాధ్యం కాదంటూ రమీజ్ రాజాకు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్తో మూడు టెస్టుల మ్యాచ్లో పాక్ వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే. దీంతో బాబర్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: Ben Stokes: పాక్ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్.. అరుదైన జాబితాలో చోటు Lionel Messi: వరల్డ్కప్ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో -
Pak Vs Eng: పాక్ను చిత్తుగా ఓడించి.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్
Pakistan vs England, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్కు ఘోర పరాభవాన్ని మిగిల్చి ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కరాచీలో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ బృందం ఆతిథ్య పాక్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా స్వదేశంలో ఇలా క్లీన్స్వీప్ కావడం పాక్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. కోహ్లి రికార్డు సమం అదే విధంగా.. సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్టులు ఓడిన మొదటి పాకిస్తాన్ కెప్టెన్ కూడా బాబర్ ఆజం కావడం విశేషం. ఇలా మూడో టెస్టుతో పాక్ ఖాతాలో చెత్త రికార్డులు నమోదు కాగా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాత్రం అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా విజయవంతమైన టెస్టు కెప్టెన్గా పేరొందిన విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టెస్టుల్లోనూ దూకుడుగా జో రూట్ తర్వాత ఇంగ్లండ్ టెస్టు పగ్గాలు చేపట్టిన స్టోక్స్.. జట్టును విజయపథంలో నడుపుతున్న విషయం తెలిసిందే. కోచ్ బ్రెండన్ మెకల్లమ్తో కలిసి సంప్రదాయ క్రికెట్లోనూ దూకుడైన ఆటకు మారు పేరుగా జట్టును మార్చి మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. ఈ క్రమంలో పాక్తో మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవడంతో ఈ ఏడాది స్టోక్స్ ఖాతాలో 9(ఆడిన 10 మ్యాచ్లలో) విజయాలు చేరాయి. తద్వారా క్యాలెండర్ ఇయర్లో ఈ ఘనత సాధించిన టెస్టు కెప్టెన్ల జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు గ్రేమ్ స్మిత్(సౌతాఫ్రికా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా), స్టీవ్ వా(ఆస్ట్రేలియా), మైకేల్ వాన్(ఇంగ్లండ్), క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్), విరాట్ కోహ్లి(ఇండియా) ఈ ఘనత సాధించారు. సొంతగడ్డపై ఓటమి తప్పలేదు పాకిస్తాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3–0తో సొంతం చేసుకుంది. చివరి టెస్టులో గెలుపు కోసం మ్యాచ్ నాలుగో రోజు మంగళవారం ఇంగ్లండ్ మరో 55 పరుగులు చేయాల్సి ఉండగా... 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బెన్ డకెట్ (82 నాటౌట్; 12 ఫోర్లు), బెన్ స్టోక్స్ (35 నాటౌట్; 3 ఫోర్లు) మూడో వికెట్కు అభేద్యంగా 73 పరుగులు జోడించి ఆటను ముగించారు. సిరీస్లోని తొలి టెస్టులో 74 పరుగులతో, రెండో టెస్టులో 26 పరుగులతో ఇంగ్లండ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జట్టులో ఇద్దరు సీనియర్ పేసర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లేకుండా 2007 తర్వాత ఇంగ్లండ్ గెలిచిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్.. ఇప్పుడు సూర్య, చహల్ -
Pak Vs Eng: బాబర్ ఓ జీరో.. కోహ్లితో పోల్చడం ఆపండి ప్లీజ్: పాక్ మాజీ క్రికెటర్
Pakistan vs England Test Series 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా మండిపడ్డాడు. సారథిగా బాబర్ ఓ సున్నా అని, ఇకనైనా అతడిని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోల్చడం ఆపేయాలని కోరాడు. కోహ్లితో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్ జట్టులో లేరంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో బాబర్ ఆజం బృందం వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన పాక్... సొంతగడ్డపై దారుణ వైఫల్యం కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా పాక్ ఆట తీరుపై మండిపడ్డాడు. బాబర్ ఆజంకు కెప్టెన్గా ఉండే అర్హత లేదంటూ విమర్శించాడు. దానిష్ కనేరియా పాక్ జట్టులో అలాంటి వాళ్లు లేరు ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా కనేరియా మాట్లాడుతూ.. ‘‘దయచేసి ఇప్పటికైనా బాబర్ ఆజంను కోహ్లితో పోల్చడం ఆపేయండి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గొప్ప ఆటగాళ్లు. వాళ్లతో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్ జట్టులో లేరు. ఒకవేళ ఎవరైనా వాళ్లలా ప్రశంసలు అందుకోవాలంటే ఆటలో రారాజై ఉండాలి. మెరుగైన ప్రదర్శన కనబరచాలి. లేదంటే జీరోలు అవుతారు. ఇక బాబర్ ఆజం కెప్టెన్గా ఓ పెద్ద సున్నా. అతడికి నాయకుడిగా ఉండే అర్హత లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో జట్టును ముందుకు నడిపే సామర్థ్యం, నాయకత్వ ప్రతిభ అతడికి లేవు’’ అని బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. ఇగో పక్కన పెడితేనే ఇక ఇంగ్లండ్తో సిరీస్ ద్వారా కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నుంచి కెప్టెన్సీ మెళకువలు నేర్చుకునే అవకాశం బాబర్కు దక్కిందన్న కనేరియా.. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమితో బాబర్ ఆజం ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్లు ఓడిన మొదటి పాక్ కెప్టెన్గా నిలిచాడు. చదవండి: FIFA WC 2022: పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్మనీ, అవార్డులు, ఇతర విశేషాలు -
Pak Vs Eng: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. బాబర్ ఆజం చెత్త రికార్డు
Pakistan vs England, 3rd Test- Babar Azam: సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైంది పాకిస్తాన్. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. ఇలా మరో పరభవాన్ని మూటగట్టుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో వరుసగా తొలి టెస్టులో 74 పరుగులు, రెండో టెస్టులో 26 పరుగులు, మూడో టెస్టులో 8 వికెట్లతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడి ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేసి బెన్ స్టోక్స్ బృందం చరిత్ర సృష్టించింది. మరోవైపు.. పాక్ స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టులు ఓడటంతో కెప్టెన్ బాబర్ ఆజం పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఓ క్యాలెండర్ ఇయర్లో పర్యాటక జట్ల చేతిలో పాకిస్తాన్ వరుస మ్యాచ్లు ఓడిపోవడం ఇదే తొలిసారి. బాబర్ ఆజం చెత్త రికార్డు ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా చేతిలో 1-0తో పాక్ టెస్టు సిరీస్ కోల్పోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి రెండు డ్రాగా ముగియగా.. ఆఖరి మ్యాచ్లో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో పాక్ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఏకంగా 3-0తో వైట్వాష్ చేసి సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ రెండు సిరీస్లలో పాక్కు సారథ్యం వహించిన బాబర్ ఆజం.. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఇలా వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన మొదటి పాకిస్తాన్ కెప్టెన్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. చెత్త కెప్టెన్సీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో బాబర్ ఆజం వరుసగా 78, 54 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్టు స్కోర్లు: పాకిస్తాన్: 304 & 216 ఇంగ్లండ్: 354 & 170/2 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హ్యారీ బ్రూక్ (111 పరుగులు) చదవండి: Harry Brook: ఇంగ్లండ్కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు FIFA WC 2022: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
ఇంగ్లండ్కు వరంలా మారాడు.. 39 ఏళ్ల రికార్డు బద్దలు
పాకిస్తాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. పాక్ను వారి సొంతగడ్డపై వైట్వాస్ చేసి ఆ జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇక ఈ సిరీస్ ద్వారా హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్కు మంచి బ్యాటర్ దొరికాడు. ఈ సిరీస్లో బ్రూక్స్ మూడు టెస్టులు కలిపి 468 పరుగులు సాధించాడు. 93.60 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన బ్రూక్ ఖాతాలో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యారీ బ్రూక్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటంటే.. పాక్ గడ్డపై ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇంతకముందు 1983-84లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ గోవర్ 449 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇదే సిరీస్లో 179 పరుగులు నాటౌట్గా నిలిచాడు. అంతేకాదు మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన మార్కస్ ట్రెస్కోథిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ట్రెస్కోథిక్ పాక్ గడ్డపై 12 ఇన్నింగ్స్లు కలిపి 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి రికార్డులను బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్ పాక్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్కు పరాభవమే ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: ఇంగ్లండ్ చేతిలో వైట్వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం అంపైర్కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
ఇంగ్లండ్ చేతిలో వైట్వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం
పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్కు సొంత గడ్డపైనే ఘరో పరాభవం ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 354 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు 50 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో పాక్ బ్యాటర్లు తడబడడంతో 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ముందు 167 పరుగుల టార్గెట్ను ఉంచింది. జాక్ క్రాలీ 41 పరుగులు, రెహాన్ అహ్మద్ 10 పరుగులు చేసి ఔటవ్వగా.. బెన్ డకెట్, స్టోక్స్లు మరో వికెట పడకుండా ఇంగ్లండ్ను గెలిపించారు. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్: 304 ఆలౌట్ & 216 ఆలౌట్ ఇంగ్లండ్: 354 ఆలౌట్& 170/2 🏴 3-0 🇵🇰 Whitewash at home 🫣🥱#ENGvPAK || #PAKvENG #TestCricket #WTC23 pic.twitter.com/XWXxGzpwbc — Diptiman Yadav (@Diptiman_yadav9) December 20, 2022 చదవండి: అంపైర్కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
అంపైర్కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్..
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి అంకానికి చేరుకుంది. మరో 55 పరుగులు చేస్తే ఇంగ్లండ్ విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఏం చేసినా ఇంగ్లండ్ గెలుపును ఆపడం పాక్కు కష్టమే.ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ క్లీన్స్వీప్పై గురి పెట్టింది. 17 సంవత్సరాల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ పాక్ జట్టుకు బొమ్మ చూపించింది. ఈ విషయం పక్కనబెడితే.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లెగ్ అంపైర్కు దడ పుట్టించాడు. కొద్దిగా అటు ఇటు అయ్యుంటే అంపైర్ తల కచ్చితంగా పగిలేదే. రెహాన్ అహ్మద్ ఔటయ్యాకా స్టోక్స్ క్రీజులో అడుగుపెట్టాడు. అప్పటికే ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నుమాన్ అలీ వేసిన ఐదో బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టోక్స్ చేతిలో గ్రిప్ జారిన బ్యాట్ స్క్వేర్లెగ్లో నిలబడిన లెగ్ అంపైర్ పక్కనబడింది. ఈ చర్యతో భయపడిన అంపైర్ హసన్ రాజా కాస్త పక్కకు జరిగి స్టోక్స్వైపు చూశాడు. స్టోక్స్ కూడా అయ్యో నేను కావాలని చేయలేదు.. బ్యాట్ గ్రిప్ జారిందంటూ వివరించాడు. ఇదంతా గమనించిన పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వుల్లో మునిగిపోయారు. అయితే అంపైర్ అదృష్టం బాగుంది లేకపోయుంటే కచ్చితంగా ఏదో ఒక చోట తగిలేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి స్టోక్స్ తన చర్యతో అంపైర్ గుండెల్లో దడ పుట్టించాడంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. Ben Stokes has thrown a bat further than I have ever hit a ball I reckon pic.twitter.com/hDKH6gO5tO — Ticker Merchant (@WillMarshall15) December 19, 2022 చదవండి: మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? IND VS BAN 1st Test: విరాట్ కోహ్లిని కాపాడిన రిషబ్ పంత్
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
Advertisement