-
పూర్తయిన ఓటర్ స్లిప్పుల పంపిణీ
-
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, విజయవాడ: ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో నల్లటి మేఘాలు కమ్మేసి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితలో లోతట్లు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బైక్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. దురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది.ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం కురిసింది. నూజివీడు తరువూరు కైకలూరు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు సిటీ, కైకలూరు, కలిదిండి, ఆచంట ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. ఏలూరుజిల్లా పోలవరం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరి, మొక్క జొన్న పంటంతా వర్షపు నీటిపాలు అయ్యింది. రైతులు పరదాలు కప్పి పంట రక్షించుకుంటున్నారు.కృష్ణాజిల్లా :బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో అకాల వర్షం.ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం.ఉదయం నుండి భానుడి భగభగలతో అల్లాడిన జనం.భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.ఏలూరు జిల్లానూజివీడు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.మధ్యాహ్నం మూడు గంటలకు పట్టపగలే కారుమబ్బులు, నల్లని మబ్బులతో కమ్మేసిన ఆకాశం.అకాల వర్షంతో సేద తీరుతున్న నూజివీడు ప్రాంత ప్రజలు.అల్లూరి సీతారామరాజు జిల్లాచింతూరు,కూనవరం, విఆర్ పురం మండలాల్లో ఈదురుగాలల భీభత్సంపలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన విద్యుత్తు స్థంభాలు, వృక్షాలు. -
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్.. సునీల్ కుమార్ వాహనంపై దాడి!
సాక్షి, ఏలూరు: ఏపీలో ఎన్నికల వేళ పచ్చ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వాహనాన్ని చుట్టుముట్టి అద్ధాలు ధ్వంసం చేశారు.వివరాల ప్రకారం.. ఏలూరులోని లింగపాలెం మండలం రంగాపురం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడిక దిగాయి. జంగారెడ్డిగూడెం టౌన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని నూజివీడు నియోజకవర్గం ముసునూరు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ వర్గీయులే దాడి చేసినట్టు గుర్తించారు.కాగా, రంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న సునీల్ కుమార్ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సునీల్ కుమార్ వాహనాన్ని చుట్టిముట్టి టీడీపీ శ్రేణులు అద్ధాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పచ్చమూకల దాడి నుంచి సునీల్ కుమార్, అతని అనుచరులు చాకచక్యంగా తప్పించుకున్నారు.అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారు. రెండు కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడి నుండి వచ్చేశాను. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు. హుందాగా రాజకీయాలు చేయాలి. కానీ మా సహనాన్ని పరీక్షించకండి. ఓడిపోతున్నామనే భయంతోనే మాపై దాడులకు పాల్పడుతున్నారు.దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో 150 కుటుంబాలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కోసం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వారి దాడిలో మాకు సంబంధించిన రెండు కార్లు ధ్వసం అయ్యాయి. దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాము. వారు కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి చర్యలను నియంత్రించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగే రాజకీయాలు చేయకూడదు. తెలుగుదేశం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోంది. ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపు అన్న రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
-
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
-
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
-
14 ఏళ్ల ముఖ్యమంత్రిపై పవర్ ఫుల్ పంచులు..
-
జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన ఏలూరు..
-
రైతన్నకు మన ప్రభుత్వం చేసిన మంచి.. చంద్రబాబు ఎందుకు చేయలేదు?
-
చంద్రబాబు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పగలవా..!
-
పేదలకు - పెత్తందార్లకు మధ్య యుద్ధం
-
పేదలకు మంచి చేస్తుంటే వాళ్లు తట్టుకోలేక పోతున్నారు.. కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తారంట..!
-
సీఎం జగన్ రాక కోసం ఏలూరులో కిక్కిరిసిన రోడ్లు
-
పేదల గురించి మాట్లాడుతుంటే బాబుకు కోపం వస్తుంది: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగన్కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ఆగిపోతాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావు.. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవని పేర్కొన్నారు. ఇది కులాల మధ్య యుద్దం కాదు.. క్లాస్ వార్ అని తెలిపారు. ఈ యుద్ధంలో ఓ వైపు పేదలు ఉంటే మరోవైపు పెత్తందార్లు ఉన్నారని అన్నారు.ఏలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సీఎం జగన్ ప్రచార సభకు ప్రజాభిమానం పోటెత్తింది. జై జగన్ నినాదాలతో ఏలూరు మార్పోగిపోయింది. ఈ సందర్భంగా సభకు హాజరైన జనసమూహాన్ని ఉద్ధేశిస్తూ సీఎం మాట్లాడారు వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు.. అయిదేళ్ల భవిష్యత్త్ను నిర్ణయిస్తాయని చెప్పారు.. మంచి చేసిన జగన్ పేదల పక్షాన ఉన్నాడని తెలిపారు. పేదల పక్షాన ఉన్న జగన్ను చూసి బాబుకు కోపమొస్తుందని దుయ్యబట్టారు. తాను పేదల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు కోపం వస్తుందని మండిపడ్డారు.సీఎం జగన్ ప్రసంగం..మన రాష్ట్రంలో దాదాపు 90 శాతం తెల్ల రేషన్కార్డు దారులే.కోటి 44 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.వీళ్లందరికీ పథకాలు అందాలంటే మీ జగన్కు తోడుగా ఉండాలి.కోటి 5 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్నారు.పొదుపు సంఘాల మహిళలు పేదలు కాదా, వారికి పథకాలు అందొద్దా? పేదలకు పథకాలు అందాలా లేదా?పిల్లల చదవుుల కోసం అమ్మ ఒడి తీసుకొచ్చి ప్రోత్సహించాం.93 శాతం మంది పిల్లలకు విద్యాదీవెనచ వసతి దీవెన అందుతోంది.ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం.అక్కాచెల్లెమ్మల కోసం అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ.మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం.అక్కాచెల్లెమ్మలకు 50శాతం నామినేటెడ్ పదవులిచ్చాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం.పెట్టుబడి సాయంతో రైతన్నకు అండగా నిలబడ్డాం.వాహన మిత్రతో ఆటోడ్రైవర్లకు తోడుగా ఉన్నాం.వాలంటీర్ వ్యవస్థతో పౌరసేవలుగ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు.గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం.నాడు, నేడుతో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చాం.సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం.పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం.59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలురద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటికోఉద్యోగం అన్నాడు ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నాడు.. నమ్ముతారా?కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటాడు.. నమ్ముతారా?ఇలాంటి మోసగాళ్లు నమ్మొద్దు.. జాగ్రత్తగా ఉండండివాలంటీర్ల సేవలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.పేదల భవిష్యత్ కోసం ఫ్యాన్ గుర్తు ఓటేయండి. -
Watch Live: ఏలూరులో సీఎం జగన్ ప్రచార సభ
-
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
ప్రగతి గోదావరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం: పైరు పచ్చని సీమ ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రగతి బాటన పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అద్భుత అభివృద్ధి సాధించింది. ఆక్వా వర్సిటీ, మెడికల్ కళాశాలలు, ఫిషింగ్ హార్బర్, వాటర్గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో పశ్చిమ ముంగిట వాలాయి. పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. జిల్లా పునర్వి భజనతో ఏలూరు జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. ఫలితంగా పాలన పల్లె ముంగిటకు చేరింది. ఆణి‘మత్స్యం’.. ఆక్వా వర్సిటీ తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాస్త్రీయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలో తుఫాన్ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు. బియ్యపుతిప్ప వద్ద రూ. 430 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.490 కోట్లతో వశిష్టగోదావరి వంతెన, అంబేడ్కర్ కోనసీమ జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ. 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. సహజసిద్ధ ప్రవాహం మళ్లింపు పోలవరం ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా గాడిలో పెట్టి కరోనా కష్టకాలంలోనూ పనులు వేగంగా సాగేలా చేశారు. ప్రధా నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 48 స్పిల్ వే గేట్ల నిర్మాణం, స్పిల్ చానల్ ఎగువ, దిగువ డ్యాంలు, 2021 జనవరి 11 నాటికి పూర్తి చేసి 6.1 కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. సహజసిద్ధ గోదావరి నది ప్రవాహాన్ని ఇంత భారీ ఎత్తున మళ్లించడం చరిత్రలో ఇదే ప్రథమం. తాడువాయిలో 3095 పునరావాస ఇళ్ళను ఒకేచోట మెగా టౌన్షిప్ మాదిరి రూ.488 కోట్లతో నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఏలూరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరుతోపాటు, పాలకొల్లు మండలంలో వైద్యకళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏలూరులోని వైద్య కళాశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రూ.60 కోట్లతో అధునాతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.525 కోట్లు. ► పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ్మిలేరుకు ‘వాల్’జడ ఏలూరు నగరాన్ని తమ్మిలేరు ముంపు నుంచి రక్షించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2006లో తమ్మిలేరు ముంపుతో ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని రిటైనింగ్వాల్ నిర్మించాలని విన్నవించారు. వెంటనే ప్రతిపాదనలు తయారు చేయించి వైఎస్సార్ అనుమతులు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019లో అంచనాలు సవరించి రూ.80 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించి 90 శాతానికిపైగా పూర్తి చేశారు. ఇతర అభివృద్ధి పనులు ► రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిరి్మంచనున్న భారీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు టెండర్ దశకు చేరుకున్నాయి. ► భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ► యనమదుర్రు డ్రెయిన్పై నిరి్మంచిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా త్వరలో పనులు మొదలుకానున్నాయి. ► ఏలూరు జిల్లా చింతలపూడి– జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రికి అనుసంధానం చేస్తూ 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీలుగుమిల్లి– కొవ్వూరు మధ్య ఎన్హెచ్ 365 (బీబీ) రూ.605 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. రూ.124 కోట్ల వ్యయంతో 516 (డీ) జాతీయ రహదారిని కొయ్యలగూడెం– జీలుగుమిల్లి మధ్య అభివృద్ధి చేశారు. -
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్ప్రదేశ్, కర్ణాటక గవర్నర్గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
ఏలూరు జిల్లా గణపవరం వద్ద సీఎం వైఎస్ జగన్ రోడ్ షో దృశ్యాలు
-
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో మంగళవారం పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల, శనగపాడు, కొళ్లికూళ్ల గ్రామాలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు ఆనంగి శ్రీనివారావు యాదవ్ ఇటీవల టీడీపీలో చేరారు. ఆయన తిరిగి ఉదయభాను సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. – సాక్షి నెట్వర్క్ ► విజయవాడ 11వ డివిజన్కు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 100మందికి పైగా వైఎస్సార్సీపీలో చేరారు. వారికి వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ► పల్నాడు జిల్లా వినుకొండలో కొప్పుకొండ గ్రామ పంచాయతీ బ్రహ్మయ్య పాకాలు గ్రామానికి చెందిన 50 కుటుంబాలవారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ► కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. జనసేనకు చెందిన వీరందరికీ అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం నార్త్లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో మెట్రేవు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు బర్రి రమేష్ తన అనుచరులు సుమారు 25 మందితో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో అత్తిలికి చెందిన తూర్పు కాపు సంఘ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో తూర్పు కాపు సంఘ నాయకులు, అత్తిలి రెండో వార్డు మాజీ సభ్యుడు ముల్లు సత్యనారాయణ, కిలాడి అప్పన్న, రెడ్డి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్, మండలంలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన 40 కుటుంబాలవారు టీడీపీ, జనసేన పారీ్టలను వీడి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
తణుకు అర్బన్/మొగల్తూరు/కైకలూరు/ భీమవరం/పెనుగొండ/పాలకొల్లు అర్బన్/పోలవరం రూరల్/బు చ్చిరెడ్డిపాళెం రూరల్: ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం తణుకు 27వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ మెర్ల అనంతలక్ష్మి పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులు మెర్ల వెంకట్రావు, మెర్ల రాంబాబు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా టీడీపీకి చెందిన 80మంది కాపు నాయకులు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి కారుమూరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ నాయకుడు నమ్మి వాసు, మహిళా నాయకురాలు తిరునాల శకుంతల ఆధ్వర్యాన టీడీపీ నాయకులు వర్థినీడి సూర్యచంద్రరావు, ఉజ్జిన సిద్ధయ్య, వీర్ని సూర్యప్రకాశరావు, వారి కుటుంబ సభ్యులతోపాటు ఏరపాటి రమణమ్మ, పాలాటి లక్ష్మి తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వారిని మంత్రి కారుమూరి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవు ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు తిరుమాని ఏడుకొండలు తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరాజు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహా్వనించారు. ► ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన మండల గౌరవ అధ్యక్షుడు పోకల దేవేంద్ర గోపాలకృష్ణ, మండల కార్యదర్శి నాగదేశి గణేష్బాబు, నాయకులు నర్రా ప్రభు, కారుమంచి యుగంధర్, ముదినేపల్లి మండల టీడీపీ నాయకులు అల్లాడి సతీష్బాబు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కైకలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహా్వనించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన సుమారు వంద మంది టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో ములపర్రు గ్రామానికి చెందిన కాపు సంఘ నాయకులు, మారెమ్మ గద్దెకు చెందిన శెట్టి బలిజ నాయకులు భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వాలమర్రులో సర్పంచ్ గంటా సత్యనారాయణ, ఉప సర్పంచ్ దాసరి రమేష్ నాయకత్వంలో దళిత యువకులు సరిపల్లి సుదీప్, సరెళ్ల నివాస్, సరిపల్లి రమేష్, దాయం ఏసురత్నం, సబ్బితి భరత్కుమార్, సరెళ్ల శివాజీతోపాటు 30కుటుంబాలవారు పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసం పంచాయతీ పరిధిలోని బంగారంపేటతోపాటు పోలవరానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు దత్తి దేవి, కొవి్వడి పోశయ్య, కోటాబత్తుల రాంబాబు తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పెనుబల్లి గ్రామ టీడీపీ ఉప సర్పంచ్ గుమ్మ భాస్కర్ తన అనుచరులు 200 మందితో, కోవూరు నగర పంచాయతీకి చెందిన గిలకా కల్యాణ్, కనపరెడ్డి వేణు తమ అనుచరులు 200 మందితో కలిసి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పంచేడు గ్రామానికి చెందిన గారితోటి విజయ్, బి.కామేశ్వరరావు కూడా ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
నిమ్మగడ్డ పచ్చ బానిస..అవ్వా, తాతల గోడు తగులుద్ది
-
ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో కంటి పరీక్షలు
-
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్
-
రెబల్ గా మారనున్న బీజేపీ నేత...పొత్తుకు మరో దెబ్బ
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement