-
మంటల ధాటికి కాలి బూడిదైన వేల అరటి చెట్లు
-
ఆరని ‘అరటితోటల’ నిప్పు
విశ్లేషణ అందుకే అరటితోటల దహనం పేరుతో ఒక ‘రీచ్ స్టాగ్’ ఉదంతాన్ని పునరావృతం గావించారు. ఆ ఘటన జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాలైంది. ఇప్పటివరకు ఎవరినైనా అరెస్టు చేశారా, కేసులు పెట్టారా? అంటే ఏమీలేదు. ఎందుకంటే ఆ పని అధికార పార్టీ పెద్దల వ్యూహంలో భాగంగానే జరిగింది కాబట్టి, ఆ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయగలిగారు కాబట్టి. కానీ అమరావతి అనే వెలుగు జిలుగుల కథ వెనుక అరటి తోటల దహనం, ఆ తదనంతర పరిణామాలు ఒక చీకటి ఘట్టంగా మాత్రం మిగిలిపోతాయి. విశ్లేషణఫిబ్రవరి 27, 1933 రాత్రి జర్మనీ పార్లమెంటు భవనం (రీచ్ స్టాగ్) అగ్నికి ఆహుతైంది. అందుకు కారణం తెలియకపోయినప్పటికి జర్మనీ నాజీ ప్రభు త్వం మాత్రం దానికి కమ్యూనిస్టులను బాధ్యులను చేస్తూ, ప్రభుత్వాన్ని కూల గొట్టడానికి వాళ్లు కుట్రపన్నారని ప్రచారం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా ఈ ఘటనను సాకుగా చూపి ప్రజల హక్కుల మీద, రాజకీయ పార్టీల మీద అనేక రకాల నిషేధాలు విధించింది. ప్రభుత్వానికున్న అత్యవ సర అధికారాలను ఉపయోగించి ‘రీచ్ స్టాగ్ ఫైర్ డిక్రీ’ని ప్రయోగించి పత్రికా స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్చను, రాజ్యాంగం ప్రసాదించిన అనేక హక్కు లను నిషేధించింది. పోలీసులకు విశేష అధికారాలు కల్పించింది. కమ్యూనిస్టు లతో మొదలుపెట్టి సోషలిస్టులను, డెమోక్రాట్లను పెద్ద ఎత్తున అరెస్టు చేసింది. ప్రత్యర్థుల మీద పైచేయి సాధించేందుకు, నిరంకుశ పాలనను విధిం చేందుకు జర్మనీ ప్రభుత్వమే ఆ నిప్పు పెట్టించిందని నమ్మేవాళ్లే ఎక్కువ. ఆ స్థాయిలో కాకపోయినా సారాంశంలో, ప్రభుత్వ ఉద్దేశంలో ఆ ఘట నకు; డిసెంబర్ 28, 2014 రాత్రి అమరావతి రాజధాని ప్రాంతంలోని నది ఒడ్డు గ్రామాలలో అరటితోటలు తగలబడడానికీ, ఆ తర్వాత జరిగిన ఘట నలకూ సారూప్యత ఉన్నది. డిసెంబర్ 28 సాయంత్రం మొదలై అర్ధరాత్రి వరకు లింగాయపాలెం నుంచి ఉద్దండరాయపాలెం, వెంకటపాలెం, తాళ్లాయ పాలెం, ఉండవల్లి, పెనుమాక వరకు అరటితోటలలో మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల మేర దట్టంగా ఉన్న అరటితోటల్లో కొత్తవాళ్లు తిరగడం కష్టం. కొన్ని గ్రామాలలోనైతే తోటల యజమానులు టీడీపీ వాళ్లేనని, వాళ్లకు తెలిసే దహనకాండ జరిగిందని చెప్పేవారున్నారు. మంత్రి వచ్చి వెళ్లారు, మంటలు లేచాయి ఒక మంత్రి తన కాన్వాయ్ సహా లింగాయపాలెం వచ్చి, తేనీరు సేవించి వెళ్లిన కొద్దిసేపట్లోనే మంటలు చెలరేగాయని అంటారు అక్కడివారు. దీని పర్యవసానం, ఆ తర్వాత జరిగిన ఘటనలను బట్టి ప్రభుత్వ వ్యూహాన్ని అంచనా వేయవచ్చు. తెల్లవారగానే ఒకవైపు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఆ గ్రామాలను సందర్శించడం, రైతులకు ‘భరోసా‘ ఇవ్వడం, నింది తులను వెంటనే పట్టుకొని ‘శిక్షిస్తామని‘ ప్రకటనలివ్వడం జరిగిపోతుంటే, ఇంకోవైపు టీడీపీ నాయకులూ, మంత్రులూ ఇది ప్రతిపక్ష నేత చేయించిన దుశ్చర్యేనని, గూండాలు, ఫ్యాక్షనిస్టులే ఇలాంటివి చేయించగలరని (ఒక ప్రాంతం వారికి ఆపాదిస్తూ) మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. ప్రతిపక్షం కూడ దీటుగానే జవాబిచ్చింది. ప్రభుత్వం అసలు వ్యూహంలో ఇది చిన్నది మాత్రమే. గ్రామాల ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం అసలు వ్యూహం – ముఖ్యంగా పూలింగ్కు భూములివ్వని గ్రామాలలో. ఒక వ్యూహం ప్రకారమే డిసెంబర్ 29 రాత్రి అప్పటివరకు పూలింగ్కు వ్యతిరేకంగా రైతులను చైతన్యపరుస్తూ, తనకున్న సంబంధాల వలన మీడి యాకు సమాచారం అందిస్తూ వచ్చిన లింగాయపాలానికి చెందిన కొండేపాటి శ్రీనాథ్ చౌదరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ సాయంత్రం 7 గంటల నుంచే ఒక ఏఎస్పీ, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు ఆయన కోసం ఆ గ్రామశివార్లలో మాటువేశారని సమాచారం. నాలుగు రోజులు నిర్బంధించి, తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది (ఇప్పటికీ ఆయన సత్తెనపల్లె కోర్టుకు హాజరవుతున్నారు). ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వ్యూహాన్ని, ముఖ్యంగా రెండు విధా లుగా అమలుచేసింది. 1. వ్యతిరేకత ఎక్కువగా ఉన్న గ్రామాల యువతను పోలీసు స్టేషన్లకు రప్పించి, నిర్బంధించి, వాళ్లు ప్రతిపక్ష పార్టీ వారైతే చితక బాది, వారి పెద్దవాళ్ల చేత అఫిడవిట్లపై సంతకాలు చేయించుకొని, కొంత మందివి మొబైల్ కాల్ వివరాలు సేకరించి, వాటి ఆధారంగా వేధించి–ఇలా అనేక మందిని స్టేషన్ల చుట్టూ తిప్పించి భయపెట్టించింది. 2. పెద్ద ఎత్తున గ్రామాలలో పోలీసులను దింపి పోలీసు ఔట్పోస్టులను ఏర్పాటుచేసింది. కొన్ని రోజులు జంగిల్ యూనిఫారాలలో ఉన్న కొన్నివేల మంది స్పెషల్ పోలీసులను కూడ దింపింది. చీకటిపడితే పోలీసు జీపుల సైరన్ శబ్దాలు. ప్రజలపై అప్పటికే (నవంబర్–డిసెంబర్ నెలల్లో) ప్రభుత్వం ఆడుతున్న ‘మైండ్ గేం’కు ఈ పరిస్థితి తోడైంది. గ్రామీణ వాతావరణంతో సందడిగా ఉండే గ్రామాలు చీకటిపడే సరికి నిర్మానుష్యంగా మారిన పరిస్థితిని కల్పిం చింది ప్రభుత్వం. డిసెంబర్ 2014 ఆఖరివారం నుంచి జరిగిన ఈ ఘటనల నేప«థ్యంలోనే ఇఖఈఅ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం (డిసెంబర్ 30), కేంద్ర ప్రభుత్వం లాండ్ ఆర్డినెన్స్ను జారీ చేయడం (డిసెంబర్ 31), ల్యాండ్ పూలింగ్ నిబంధనలు ప్రకటించండం (జనవరి 1) వెనువెంటనే జరిగిపో యాయి (తర్వాత ఏపీకి సహకరించడానికే కేంద్ర ప్రభుత్వం లాండ్ ఆర్డినె న్స్ను మూడుసార్లు పొడిగించింది). గ్రామాలలో సెక్షన్ 144, పోలీసుయాక్టు, ఇద్దరుమంత్రుల నిరంతర పర్యవేక్షణ నేపథ్యంలో పూలింగ్ జరిగింది. పూలింగ్కు ఎప్పుడూ వ్యతిరేకతే! ప్రభుత్వం ఎందుకు ఈ విధమైన నిర్బంధ విధానాలకు పాల్పడిందో తెలుసుకోవాలంటే జరీబు భూముల గ్రామాల్లో అంతవరకు పెరుగుతూనే ఉన్న నిరసనలను అర్థం చేసుకోవాలి. 2014 అక్టోబర్లో తుళ్లూరు ప్రాంతంలో రాజధానిని నిర్మించబోతున్నామని ప్రకటించిన తర్వాత మెట్టప్రాంత గ్రామాలలో భూముల ధరలు అనూహ్యంగా పెరిగి ఒక వర్గం వారు సంతోషపడినప్పటికీ జరీబు భూముల గ్రామాలలో పూలింగ్కు వ్యతిరేకత పెరిగిందే కాని తగ్గలేదు. గ్రామాలకొచ్చి టీవీ చానళ్లు జరిపిన చర్చల్లోను, మంత్రివర్గ ఉపసంఘం పేరుతో అధికార పార్టీ నాయకులు, అధికారులు గ్రామాలలో పెట్టిన సభలలోను ఇది ప్రస్ఫుటంగా బయట పడింది. పంచాయతీ తీర్మానాలకు పంగనామాలు నవంబర్ 4, 2014న నిడమర్రు గ్రామపంచాయతీ, గ్రామసభలు రాజధానికి పూలింగ్లో భూములిచ్చేది లేదంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఎంతో మంది సామాజికంగా వెనుకబడిన కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధార పడి ఉన్నాయనీ, వ్యవసాయం పోతే ఈ కుటుంబాలన్ని వీధినపడతాయనీ, కాబట్టి భూములివ్వడం సమ్మతం కాదనీ తీర్మానించాయి. ప్రజలు స్వచ్ఛం దంగా భూములిస్తున్నారంటూ బయట ప్రచారం చేసుకొంటున్న ప్రభుత్వా నికి ఈ తీర్మానాలు షాకిచ్చాయి. ప్రభుత్వం వీటిని తీవ్రంగా పరిగణించింది. గ్రామస్తులు భవిష్యత్తులో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్ప వని భావించి ఇలాంటి తీర్మానాలను ప్రోత్సహించవద్దని, ఒకవేళ ఏ గ్రామ మైన అలాంటి తీర్మానం చేస్తే దానిపై పంచాయతీ కార్యదర్శులు అధికారిక ముద్ర వేయవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అందువలన రాయపూడి పంచాయతీలోని 8 మంది సభ్యులు (మొత్తం 12 మంది అయితే, 11 మంది మాత్రమే ఉన్నారు) తమ గ్రామం భూములివ్వడానికి సిద్ధంగా లేదంటూ తీర్మానం చేసి సంతకాలు పెడితే ప్రభుత్వ హుకుం వలన దానికి అధికారిక ముద్ర పడలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నేరుగా రైతులతో మాట్లాడతారని నవం బరు18, 2014న టీడీపీ వాళ్లు కొన్ని బస్సులలో రైతులను హైదరాబాదుకు తీసుకొచ్చారు. రాజధానికి భూములిస్తే మిమ్మల్ని అందరిని జీఎంఆర్ లాగ పారిశ్రామికవేత్తలను చేస్తానన్న ముఖ్యమంత్రి మాట అందులో పాల్గొన్న రైతులెవ్వరినీ సంతృప్తిపరచలేదు. అదొక తంతుగా జరిగినప్పటికీ అందులో చంద్రబాబు చేసిన రెండు వ్యాఖ్యలు ఆయన మనస్తత్వానికి అద్దం పట్టా యని, అవి ఇప్పటికీ తన మనసులో మెదులుతున్నాయని ఆ ముఖాముఖిలో పాల్గొన్న టీడీపీ మద్దతుదారుడైన కృష్ణాయపాలెం రైతు ఆవేదనతో ఈ వ్యాస కర్తతో చెప్పడం జరిగింది. 1. జరీబు భూములు వదిలేసి రాజధానిని నిర్మిం చుకోవచ్చు కదా అన్నందుకు, ‘నది పక్కన భూములివ్వక పోతే రాజధానిని అక్కడపెట్టవలసిన అవసరమే లేదు. ఇంకెక్కడైన స్థాపిస్తాను‘ అంటూ ముఖ్య మంత్రి స్పందించారట. నది ఒడ్డున, లోపల తాము నిర్మించదలచుకున్న స్టార్ హోటళ్లు, రిసార్టులు, గోల్ఫ్ కోర్సులు, పర్యాటక రంగ వ్యవహారాల కోసం నది ఒడ్డు గ్రామాలు ఎంత కీలకమైనవో ఆయన మాటల్లో తెలిసి పోయింది. 2. జరీబు భూములివ్వడం తమకిష్టం లేదన్నందుకు, ‘భూము లివ్వకపోతే మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసు‘ అన్న ఆయన హెచ్చరిక ఆ తర్వాత ఆ గ్రామాలలో ఏర్పడిన పోలీసు రాజ్యానికి నాందీ వాచకమైంది. డిసెంబర్ 3న 11 గ్రామాల రైతులు రాయపూడిలో సమావేశమై పూలింగ్లో భూములివ్వకూడదని తీర్మానించారు. అరటితోటల అగ్ని అధికారపార్టీదే ఇలాంటి నిరసనల నేపథ్యంలో, ఆరునూరైన సరే రాజధానిని అక్కడే కట్టా లనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వ పెద్దలకు గ్రామాలపై తీవ్ర నిర్బంధం, పోలీసుల ప్రవేశం జరిగితే గాని రైతులను లొంగదీసుకోవడం సాధ్యం కాదని అర్థమైనట్లుంది. అందుకే అరటితోటల దహనం పేరుతో ఒక ‘రీచ్ స్టాగ్’ ఉదంతాన్ని పునరావృతం గావించింది. ఆ ఘటన జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాలైంది. ఇప్పటివరకు ఎవరినైనా అరెస్టు చేశారా, కేసులు పెట్టారా? అంటే ఏమీలేదు. ఎందుకంటే ఆ పని అధికార పార్టీ పెద్దల వ్యూహంలో భాగంగానే జరిగింది కాబట్టి, ఆ వ్యూహాన్ని విజయవంతంగా అమలుచేయ గలిగారు కాబట్టి. కాని అమరావతి అనే వెలుగు జిలుగుల కథ వెనుక అరటి తోటల దహనం, ఆ తదనంతర పరిణామాలు ఒక చీకటి ఘట్టంగా మాత్రం మిగిలిపోతాయి. (వ్యాసకర్త : డాక్టర్ చిగురుపాటి రామచంద్రయ్య, సామాజిక శాస్త్రవేత్త Email: crchandraiah@gmail.com)
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
Advertisement