-
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దేశానికి ఆయువుపట్టయిన ఢిల్లీని కొల్లగొట్టిన వారే ఎర్రకోటలో జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, ఆపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఢిల్లీని క్లీన్స్వీప్ చేసి కేంద్రంలో అధికారం చేపట్టాయి. గత రెండు ఎన్నికల్లో రాజధానిలోని మొత్తం 7 ఎంపీ సీట్లనూ కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. ఎంపీలపై వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను పక్కన పెట్టేసింది! ఇక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొన్న ఆప్.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తాలూకు సానుభూతిని అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీత పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా భిన్నమైన తీర్పు ఇవ్వడం ఢిల్లీ ఓటర్లకు కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. దశాబ్దాలుగా ఢిల్లీ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్పై 90వ దశకం నుంచి క్రమంగా బీజేపీ ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత నుండి హస్తినలో అధికారం ఆ రెండు పారీ్టల మధ్యే మారుతూ వచి్చంది. 2009లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలనూ కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేయగా 2014, 2019ల్లో అదే ఫీట్ను బీజేపీ చేసి చూపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ‘చీపురు’ తిరగేసిన ఆప్ లోక్సభకు వచ్చేసరికి ఒక్క స్థానమూ దక్కించుకోలేకపోయింది. ఓట్లపరంగా కూడా బీజేపీ ఆ రెండు పారీ్టలకు అందనంత ఎత్తులో నిలిచింది. కమలం గుర్తుకు 56.86 శాతం ఓట్లు రాగా హస్తానికి 22.51 శాతం, ఆప్కు గుర్తుకు 14.79 శాతం పోలయ్యాయి. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఆప్ చేతిలో వరుసగా భంగపాటు తప్పడం లేదు.కేజ్రీవాల్ అరెస్టు కలిసొచ్చేనా? నయా రాజకీయాలతో సంచలనం అరవింద్ కేజ్రీవాల్ 2012లో పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నానాటికీ బలపడుతూ వచి్చంది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. 70 సీట్లకు 28 స్థానాలు సాధించింది. బీజేపీకి 32 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాకపోవడంతో 8 సీట్లొచి్చన కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ తొలిసారి సీఎం అయ్యారు. కానీ 49 రోజులకే రాజీనామా చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆప్కు ఒక్క సీటూ రాలేదు. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 67 సీట్లతో సంచలనం సృష్టించింది. కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యారు. మళ్లీ 2019 లోక్సభ ఎన్నికల్లో చేతులెత్తేసినా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 62 సీట్లతో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు. ఈ లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి తరఫున సుడిగాలి ప్రచారానికి సన్నద్ధమైన కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలు పాలయ్యారు. ఇది ఆప్కు కలిసొస్తుందా, ప్రతికూలంగా మారుతుందా అన్నది ఆసక్తికరం. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొనడం ఆప్కు ఊరటనిచ్చే పరిణామమే. దీనిపై మే 7న కోర్టు వెలువరించబోయే నిర్ణయం కోసం పార్టీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. బీజేపీ ‘హ్యాట్రిక్’ గురి... ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్స్వీప్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భోజ్పురి సూపర్ స్టార్ 2014లో ఇక్కడి నుంచే బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. తర్వాత ఢిల్లీ బీజేపీ పగ్గాలు చేపట్టి 7 సీట్లనూ క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి తివారీ తప్ప మిగతా ఆరుగురు సిట్టింగులనూ బీజేపీ మార్చేయడం విశేషం! ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని బీజేపీ ప్రధాన ప్రచారాంశంగా జనంలోకి తీసుకెళ్తోంది. మోదీ ఫ్యాక్టర్తో పాటు సీఏఏ, అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు తదితరాలను నమ్ముకుంది. పూర్వాంచలీలు, ముస్లింల ఆధిపత్యముండే ఈశాన్య ఢిల్లీ స్థానంలో బిహార్కు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య కీలక పోరు జరగనుంది. హ్యాట్రిక్తో మూడోసారి లోక్సభలో అడుగుపెట్టాలనుకుంటున్న మనోజ్ తివారీ ఒకవైపు, కాంగ్రెస్ నుంచి కన్హయ్య కుమార్ మరోవైపు బరిలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక సమతూకం పాటించింది. తూర్పు ఢిల్లీ నుంచి పంజాబీ అయిన హరీశ్ మల్హోత్రా, చాందినీ చౌక్ నుంచి బనియా నాయకుడు ప్రవీణ్ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి గుజ్జర్ నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి, పశ్చిమ ఢిల్లీ నుంచి జాట్ నాయకుడు కమల్జీత్ సెహ్రావత్, ఎస్సీ రిజర్వ్డ్ వాయవ్య ఢిల్లీ నుంచి దళిత నాయకుడు యోగేంద్ర చందోలియాలను బరిలో నిలిపింది. కమల్జీత్తో పాటు న్యూఢిల్లీ నుంచి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ రూపంలో ఇద్దరు మహిళలకూ అవకాశం ఇచి్చంది.సునీతా కేజ్రీవాల్ ప్రచారం... ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వాములుగా ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 చోట్ల బరిలో దిగుతున్నాయి. రాజధానిలో బీజేపీకి ఎలాగైనా ముకుతాడు వేయాలని చూస్తున్నాయి. ‘ఢిల్లీ మోడల్’ను కేజ్రీవాల్ ప్రధానంగా ప్రచారం చేశారు. ఆయన జైలుపాలైన నేపథ్యంలో ఆప్ ప్రచార భారాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. ఆమె సభలకు మంచి స్పందన కూడా లభిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు వంటి అంశాలను ఆప్, కాంగ్రెస్ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పైనా విమర్శలు గుప్పిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో, విపక్షాలపై దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు ఉసిగొల్పుతోందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.సర్వేలేమంటున్నాయి... ఢిల్లీలో ఈసారి కూడా బీజేపీ మొత్తం 7 లోక్సభ సీట్లనూ క్లీన్స్వీప్ చేస్తుందని పలు సర్వేలు అంటున్నాయి. అయితే కేజ్రీవాల్ అరెస్టు తాలూకు సానుభూతిఆప్కు కలిసొస్తే ఆ పారీ్టకి ఒకట్రెండు స్థానాలు దక్కే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
Liquor Case: సుప్రీం కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్ వేయబోనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను స్పెషల్ మెన్షన్ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సిద్ధమయ్యారు. దీంతో సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ ఆప్ శ్రేణుల్లో నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అయితే ఆ సమయంలోనే ఆయన సుప్రీం కోర్టులో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్లో ఉండడం, కింది కోర్టుల్లో విచారణతో క్లాష్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ టైంలో ఆయన ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అసలైన సూత్రధారిగా ఈడీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి తీసుకొని విచారించగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అరెస్ట్ చట్టవిరుద్ధం కాదు కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ‘‘సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు’’ అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
బీజేపీపైనా చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై బీజేపీ నేతలపైనా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి అతిశి శనివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని డిమాండ్ చేశారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని శనివారం ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీలో చేరడమో, ఈడీ అరెస్ట్ను ఎదుర్కోవడమో తేల్చుకోవాలంటూ ఆ పార్టీ నేత ఒకరు తనను బెదిరించారంటూ అతిశి చేసిన ఆరోపణలపై ఈసీ ఆమెకు శుక్రవారం నోటీసులిచి్చన విషయం తెలిసిందే. ‘మద్యం కుంభకోణంలో డబ్బు చేతులు మారిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ కేవలం అనుమానంతోనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీశ్ సిసోడియా, సీఎం కేజ్రీవాల్లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో నిందితుడొకరు బీజేపీకి కోట్లాది రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందజేసినట్లు ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు’అని ఆమె ప్రశ్నించారు. -
తీహార్ జైలు నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సందేశం
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈడీ లాకప్ ఉండి పారిపాలన కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ మీడియాకు చదవి వినిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలను ప్రతిరోజూ సందర్శించాలని కేజ్రీవాల్ సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నాట్లు వివరించారు. ‘నేను జైలులో ఉన్నందున ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురికావొద్దు. ప్రతిరోజూ ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాలోని ప్రాంతాలను సందర్శించాలి. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి’ అని కేజ్రీవాల్ సందేశం పంపినట్లు సునీతా కేజ్రీవాల్ మీడియకు తెలిపారు. అంతకు ముందు లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించిన ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సునీతా కేజ్రీవాల్ కలిశారు. ఇక.. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ను ఆశీర్వదిస్తూ..వాట్సప్లో సందేశాలు పంపి మద్దతు పలకాలని సునీతా కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. -
‘రాఘవ్ చద్దా ఎక్కడ?’.. పోస్ట్ డిలీట్ చేసిన ఎన్సీపీ నేత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అరెస్ట్ను ఆప్ మంత్రులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇకప్పటికీ స్పందించకపోవటంపై ఎన్సీపీ (శరద్ పవార్) నేత జితేంద్ర అవధ్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల కూటమిలో భాగంగా.. ఎన్సీపీ, ఆప్ భాగస్వామ్య పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్పై ఎంపీ రఘవ్ చద్దా స్పందించలేదని ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ‘రఘవ్ చద్దా ఎక్కడ?’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టిన ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ తర్వాత దాన్ని డిలీట్ చేయటం గమనార్హం. శనివారం జితేంద్ర అవధ్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ రఘవ్ చద్దా కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కానీ, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంపీ రాఘవ్ చద్దా మాత్రం కనిపించటం లేదు. ఆప్కు రాఘవ్ చద్దా కీలకమైన నేత.. ఆయన ఇక్కడ లేకపోవటం, అరెస్ట్పై స్పందించకపోవటం కార్యకర్తలను అవనించినట్లే’ అని జితేంద్ర అన్నారు. దూరంగా వేరే దేశంలో ఉన్నంత మాత్రనా ప్రజలతో కనెక్ట్కాలేని రోజుల కాలం కాదు. ఆయన లండన్లో ఉన్పటికీ కనీసం స్పందిచకపోవటం చాలా విచిత్రం. ఒక వీడియో సందేశమైనా పార్టీకి, కార్యకర్తలకు పంపాలి. రఘవ్ చద్దా పూర్తిగా కనిపించకుండా, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నా’ అని ఎనన్సీపీ నేత జితేంద్ర అవధ్ అన్నారు. ఇక.. రఘవ్ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. కంటికి సంబంధించిన చికిత్స కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుసస్తోంది. ఢల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1తో ఈడీ కస్టడీ ముగియనుంది. -
హస్తినలో విపక్షాల ర్యాలీ నేడే
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. -
మద్యం కుంభకోణంలో ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్ను ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. దీనితో ముడిపడ్డ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత కైలాశ్ గహ్లోత్ను ఈడీ శనివారం దాదాపు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సన్నిహితుడైన గహ్లోత్ హోం, రవాణా, న్యాయ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈడీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వివాదాస్పద 2021–22 ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించిన మంత్రుల బృందంలో గహ్లోత్ కూడా ఉన్నారు. చార్జిïÙట్లో ఆయన పేరునూ ఈడీ చేర్చింది. మద్యం విధానం ముసాయిదా తయారీ సందర్భంగా ఆప్ కమ్యూనికేషన్ల ఇన్చార్జి విజయ్ నాయర్ ఢిల్లీలోని గహ్లోత్ అధికారిక నివాసాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తించింది. ప్రజాప్రతినిధికి కేటాయించిన అధికారిక బంగ్లాను మరొకరు వాడటం నేరమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి సూచించింది. గహ్లోత్ ఒకే సిమ్ కార్డు వాడినా సెల్ఫోన్ ఐఎంఈఐ నెంబర్ మూడుసార్లు మారినట్లు ఈడీ ఆరోపించింది -
లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చివరిది కావొచ్చనే విశ్లేషకుల అంచనా తప్పింది. మరికొంత మందిని విచారించాలని ఈడీ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. తాజాగా.. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్కు విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్కు కైలాష్ మద్దతు ఉందనే ఆరోపణ మీద ఆయనకు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా శనివారమే తమ ఎదుటకు రావాలని సమన్లలో ఈడీ కోరింది. అంతేకాదు.. రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ నాటి లిక్కర్ పాలసీ ముసాయిదా రూపకల్పనలో సభ్యుడిగా ఉన్నారు. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల విచారణ మొదలయ్యాక.. తరచూ ఆయన ఫోన్ నెంబర్లు మార్చినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళే(శనివారం) తమ ఎదుట హాజరు కావాలని ఈడీ మంత్రి కైలాష్కు సమన్లలో స్పష్టం చేసింది. -
బీజేపీ ఖాతాలోకే మద్యం ముడుపులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం తాలూకు ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో మద్యం వ్యాపారుల నుంచి నేరుగా బీజేపీకే అందాయని ఆప్ నేతలు, ఢిల్లీ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదంతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈడీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఆప్ నేతల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ రూపాయి కూడా రికవరీ కాలేదు. మద్యం దుకాణాలు దక్కించుకున్న శరత్చంద్ర రెడ్డి వాగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్ను తానెన్నడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్తో ఏ సంబంధమూ లేదని విచారణలో చెప్పిన మర్నాడే శరత్ను ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ను కలిసి మద్యం కుంభకోణంపై మాట్లాడానంటూ మాట మార్చగానే బెయిల్ పొందారు!’’ అని ఆరోపించారు. ‘‘శరత్ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.4.5 కోట్లు అందాయి. అరెస్టు అనంతరం బీజేపీకి ఆయన ఏకంగా మరో రూ.55 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చారు’’ అంటూ సంబంధిత వివరాలను మీడియాకు చూపించారు. -
అరవింద్ కేజ్రీవాల్కు ప్రాణహాని.. ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రాణ హాని ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, కేబినెట్ మంత్రి సౌరబ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన కేజ్రీవాల్కు ప్రాణహాని ఉందని పదే పదే చెబుతున్నారని భరద్వాజ్ అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరద్వాజ్ మాట్లాడారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన తర్వాత ఓ ఫార్మా కంపెనీ డైరక్టైర్ ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో రూ.25 కోట్లను బీజేపీకి అందించారని ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈడీ అరెస్ట్తో అరవింద్ కేజ్రీవాల్కు ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా కంపెనీ నిర్వహించే ఓ సంస్థ డైరెక్టర్ను ఈడీ అరెస్ట్ చేసింది. సదరు కంపెనీ ఫార్మా కంపెనీ 2022 నవంబర్లో బీజేపీకి రూ.25 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను చెల్లించిందని’ ఆయన ఆరోపించారు. తమ ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్పై అభియోగాలు మోపినట్లుగా సంబంధిత కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తీరు అమానవీయమన్న భరద్వాజ్.. ఢిల్లీ సీఎం అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు బంధువులకు, పార్టీ నేతలకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కవిత అరెస్టు.. ‘ఈడీ’ ప్రకటనపై ‘ఆప్’ ఫైర్
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడుదల చేసిన ప్రకటనపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) స్పందించింది. ఈడీ భారతీయ జనతా పార్టీ విభాగంలా పనిచేస్తోందని ఆప్ నేతలు ఫైరయ్యారు. తమ పార్టీ నేతలకు కవిత రూ.100 కోట్లకుపైగా ముడుపులు చెల్లించారని ఈడీ ఎలా ప్రకటన చేస్తుందని మండిపడ్డారు. ఈడీ తటస్థంగా వ్యవహరించాల్సిందిపోయి బీజేపీ విభాగంలా తయారేఐ తప్పుడు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాల ప్రతిష్ట దెబ్బతీయడానికే ఈడీ తప్పుడు ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. లిక్కర్ స్కామ్లో రూ.100 కోట్ల చెల్లింపులు జరిగాయన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టిపారేసిందని ఆప్ నేతలు గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో 500కుపైగా సోదాలు జరిపిన ఈడీ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయిందని, ఈ నిరాశ, నిస్పృహలతోనే ఈడీ కవిత అరెస్టుపై ఇలాంటి ప్రకటనలు చేస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను ఇటీవలే అరెస్టు చేసిన ఈడీ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కవితకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ -
కేంద్రానికి ‘యాంటీ పంజాబ్’ సిండ్రోమ్
లూధియానా: పంజాబ్ వ్యతిరేకత అనే రుగ్మతతో బాధపడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో శిక్షించాలని ఆప్ అగ్రనేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లో తమ పార్టీకి విజయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా పంజాబ్ శకటాన్ని కేంద్రం నిరాకరించడం పంజాబీలను అవమానించడమేనన్నారు. దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసిన పంజాబ్ అమరులకు కేంద్రం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకుంటూ పాలన సజావుగా సాగకుండా ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. ఆదివారం ఆయన లూధియానాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో తనను ఇబ్బందులు పెడుతున్న కేంద్రాన్ని అడ్డుకోగలిగానన్నారు. ఇక్కడ సీఎం మాన్ కేంద్రం, బీజేపీ, గవర్నర్ల వైఖరితో పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. -
పంజాబ్లో ఆప్ కార్యకర్త కాల్చివేత
అమృత్సర్: పంజాబ్లో అధికార పార్టీ ఆప్నకు చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. తారన్తారన్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చోహల్ కోర్టు కేసు విషయమై కపుర్తలా వైపు కారులో ఒక్కడే వెళ్తున్నాడు. కారును వెంబడిస్తున్న దుండగులు ఫతేబాద్, గోయిండ్వాల్ సాహిబ్ మధ్యలోని రైల్వే క్రాసింగ్ వద్ద అతడిపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి పరారయ్యాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గుర్ప్రీత్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
ED Vs Kejriwal: ‘కేజ్రీ’వాల్ను వదలని ఈడీ..
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వదలడం లేదు. లిక్కర్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు తాజాగా ఈడీ ఏడోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 26న విచారణకు రావాలని తాజా సమన్లలో పేర్కొంది. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ.. మరోసారి కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించింది. కాగా, ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్కు సమన్లు జారీకావటం ఇది ఏడోసారి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. Delhi Excise policy case | ED summons Delhi CM Arvind Kejriwal to appear before it on Monday, 26th February: Sources This is the 7th ED summon to him. (File photo) pic.twitter.com/X7n0TaJieK — ANI (@ANI) February 22, 2024 దీంతో, తాజాగా మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ ఈసారైనా స్పందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపించినా కేజ్రీవాల్ హాజరు కాలేదు. -
బీజేపీకి పెద్ద సవాల్గా ఎదిగాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీకి రాజకీయాల్లో అతిపెద్ద సవాల్గా, కొరకరాని కొయ్యలా తయారయ్యాం కాబట్టే ఆప్పై బీజేపీ అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం కేజ్రీవాల్ ప్రసంగిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే గెలుపు కావచ్చు. కానీ 2029 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దేశానికి బీజేపీ నుంచి విముక్తి కలి్పస్తాం. ఆ బాధ్యత ఆప్ తన భుజస్కంధాలపై వేసుకుంది. సభలో ఆప్కే మెజారిటీ ఉందనేది స్పష్టం. అయితే ఆప్ ఎమ్మెల్యేలకు ఎరవేసి తమ వైపు లాక్కుని, ఆప్ సర్కార్ను కూల్చేద్దామని బీజేపీ కుట్ర పన్నింది. అందుకే ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది’’ అని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. తర్వాత విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. -
చంఢీగఢ్ మేయర్ ఎన్నికలు: సుప్రీం కోర్టు సీరియస్
చంఢీగఢ్: చంఢీగఢ్లో మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్ మనోజ్ సోంకర్ చేతిలో ఓటమి పాలైన ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ ధరోర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన బాలెట్ పేపర్లు, ఒరిజినల్ రికార్డులు, వీడియో ఫుటేజీని పంజాబ్, హర్యానా కోర్టు రిజిస్ట్రార్కు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి బాలెట్ పేపర్లను తారుమారు చేశారని స్పష్టంగా తెలుస్తోంది? ఈ చర్యతో అతను ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటానికి ప్రయత్నించారా? అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి తాము అనుమతించమని సుప్రీంకోర్టు పేర్కొంది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొంది. ఇక.. ఫిబ్రవరి 7న జరగాల్సిన చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు తిరిగి ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్లో మొత్తం 36 ఓట్లు ఉండగా.. బీజేపీ మేయర్ అభ్యర్థికి 16 ఓట్లు, ఆప్ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 మంది ఆప్-కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఈ ఫలితాలపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మోసపూరితంగా ఈ ఎన్నికల్లో గెలిచిందని మండిపడింది. -
కేజ్రీవాల్కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు. -
ఆప్ నేతకు తొలగిన అడ్డంకి.. ప్రమాణ స్వీకారానికి అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకి తొలగింది. సంజయ్ సింగ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి శనివారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేయటానికి సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని.. ప్రత్యేక న్యాయముర్తి ఎం.కే నాగ్పాల్ అనుమతి ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని కోర్టు పొడగించింది. సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలను ఫిబ్రవరి 17 తమ ముందు ప్రవేశపెట్టాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఎంపీగా సంజయ్ సింగ్ పదవి కాలం జనవరి 27న ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్ గవర్నర్ పదవికి బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా -
హరియాణా అసెంబ్లీకి ఒంటరిగానే ఆప్
చండీగఢ్: హరియాణలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంటామని చెప్పారు. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్–మేలో, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్లో జరిగే అవకాశాలున్నాయి. హరియాణాలోని జింద్లో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో కేజ్రీవాల్ పై నిర్ణయం ప్రకటించారు. ‘హరియాణ ప్రజలిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రమే నమ్ముతున్నారు. పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందుకే, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మార్పును కోరుతున్నారు. ఆప్కే అధికార మివ్వాలని భావిస్తున్నారు’అని కేజ్రీవాల్ చెప్పారు. రాష్ట్రాన్ని పాలించిన పార్టీల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ఆయా పార్టీల నేతలు తమ జేబులనే నింపుకున్నారని ఆరోపించారు. -
‘చీఫ్ సెక్రటరీ’ వివాదానికి సుప్రీం పరిష్కారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నియామకంపై కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఒక పరిష్కారమార్గం చూపింది. చీఫ్ సెక్రటరీ హోదాకు అర్హులైన అయిదుగురు సీనియర్ పరిపాలనాధికారుల పేర్లను ఈనెల 28న ఉదయం 10.30 గంటల్లోగా సూచించాలని కేంద్రాన్ని కోరింది. అందులో నుంచి ఒకరి పేరును అదే రోజు ఎంపిక చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కొత్తగా చీఫ్ సెక్రటరీని కేంద్రం నియమించ జాలదంటూ ఢిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ సూచనలు చేసింది. అంతకుముందు, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలో పోటాపోటీగా వాదనలు వినిపించాయి. -
ఆప్ను మీ జన్మలో ఓడించలేరు
న్యూఢిల్లీ: ‘‘మోదీ జీ! ఢిల్లీలో ఆప్ను మీ జన్మలో ఓడించలేరు! అందుకు మరో జన్మ ఎత్తాల్సిందే’’ అంటూ ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ సవాలు చేశారు. ‘‘నన్ను అరెస్టు చేసినా సరే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో గెలుపు ఆప్దే. ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు’’ అని జోస్యం చెప్పారు. శుక్రవారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రాంతీయ పారీ్టల నేతలను ఎలాగైనా అరెస్టు చేసి ఆప్ వాటి లోక్సభ ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు సృష్టించాలని నరేంద్ర మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అదే క్రమంలో తన అరెస్టుకు ప్రయతి్నస్తోందన్నారు. కనుక ఒకవేళ అరెస్టయి జైలుకు వెళ్లినా తానే సీఎంగా కొనసాగాలా అని ఇంటింటికీ వెళ్లి ప్రజలను అడగాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలను వారికి తెలియజెప్పాలన్నారు. ‘‘సీఎంగిరీ మీద నాకేమీ అపేక్ష లేదు. సీఎం అయిన 49 రోజులకే ఎవరూ అడగకపోయినా రాజీనామా చేసింది ప్రపంచంలో బహుశా నేనొక్కడినే. కానీ అరెస్టయినా నేనే సీఎంగా కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ముక్త కంఠంతో కోరుతున్నారు’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో పాత్రపై విచారణకు రావాలంటూ కొద్ది రోజుల క్రితం ఈడీ సమన్లివ్వగా ఆయన గైర్హాజరవడం తెలిసిందే. -
ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) విచారణకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆఖర్లో ఆయన ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ఉండడంతో విచారణకు రాలేనని, పైగా నోటీసులు చట్టవిరుద్ధమని, తనకు పంపిన సమన్లు వెనక్కి తీసుకోవాలని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఆయనకు మరోసారి సమన్లు పంపే యోచనలో ఉన్నారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తులో భాగంగా నవంబరు 2న తమ ఎదుట హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈ ఏడాది ఏప్రిల్లోనే కేజ్రీవాల్ను ఈడీ ప్రశ్నించింది. కానీ, తొలిసారిగా ఇప్పుడు సమన్లు జారీ చేసి విచారించాలనుకుంటోంది. కానీ, ఈడీ విచారణకు హాజరు కాకుండా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, అవి రాజకీయ ప్రేరేపితమైనవని.. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. వెంటనే నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని ఈడీని కోరారాయన. ఈడీ సమన్ల ప్రకారం.. ఉదయం 11గం. ఆయన ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉంది. కానీ, అదే సమయానికి ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో సింగ్రోలి ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. ఒక వ్యక్తి ఈడీ సమన్లను మూడుసార్లు విస్మరించొచ్చు. ఆ తర్వాత కూడా తిరస్కరిస్తే.. నాన్బెయిలబుల్ వారెంట్ కింద ఈడీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తుంది. మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఈడీ ఒకరికి నోటీసులు జారీ చేయొచ్చు. కేజ్రీవాల్ పేరు ఎందుకంటే.. కేజ్రీవాల్కు నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల కింద ఈ సమన్లు ఇచ్చినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22ని(ప్రస్తుతం రద్దైంది) రూపొందించే క్రమంలో, అమలు సమయంలో ముఖ్యమంత్రిగా, ఆప్ అధినేతగా కేజ్రీవాల్ను నిందితులు సంప్రదించారని ఛార్జిషీటులో ఈడీ పేర్కొంది. మద్యం డీలర్లకు భారీ ప్రయోజనం కలిగించేలా ఈ విధానాన్ని రూపొందించారని, ప్రతిగా వారి నుంచి కమీషన్లు పొందారని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేజ్రీవాల్ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. ఇదే కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ కావడం గమనార్హం. అరెస్ట్ చేయాలనుకుంటోంది.. మరోవైపు.. ఆప్ను నిర్మూలించేందుకే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్పై బూటకపు కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు ఈడీ సమన్లు జారీ చేసిందని విమర్శలు గుప్పిస్తోంది. ఇక నేటి విచారణ సందర్భంగా కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఖాయం అంటూ ప్రచారం చేస్తోంది. కేవలం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే ఆయన్ని కటకటాల వెనక్కి పంపే ప్రయత్నం జరుగుతోందని ఆప్ ఆరోపణలు గుప్పిస్తోంది. -
ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్!
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అక్కడి పాలక పార్టీ ఆప్ను మరిన్ని సమస్యలు చుట్టుముట్టేలా కని్పస్తున్నాయి. దీనికి సంబంధించిన అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో ఆప్ను కూడా నిందితుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచన చేస్తున్నట్టు సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. వాటి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు సోమవారం సుప్రీంకోర్టుకు ఈ మేరకు నివేదించారు. అవినీతి వ్యతిరేక చట్టం, నగదు అక్రమ తరలింపు (నిరోధక) చట్టంలోని సెక్షన్ 70 ప్రకారం ఈ చర్య తీసుకోదలచినట్టు వివరించారు. అయితే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఆప్పై ప్రత్యేక అభియెగాలు మోపుతారా అన్న విషయమై మంగళవారం స్పష్టత ఇవ్వాల్సిందిగా ఆయనకు ధర్మాసనం సూచించింది. మద్యం విధానం కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా ఏఎస్జీ ఈ మేరకు ప్రకటన చేశారు. -
నన్ను పోలీస్ లాకప్కు పంపొద్దు
న్యూఢిల్లీ: ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి తనను పోలీస్ లాకప్కు తరలించకుండా అడ్డుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్సింగ్ కోర్టును కోరారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో శనివారం ఈ మేరకు పిటిషన్ వేశారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఆయనను బుధవారం అరెస్టు చేయడం తెలిసిందే. కోర్టు ఆయనకు ఈనెల 10 దాకా రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయంలోని లాకప్ రూంలో ఉంచారు. అక్కడ పురుగు మందులు కొడుతున్నారనే నెపంతో తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయతి్నంచారని సంజయ్సింగ్ ఆరోపించారు. తనను టార్చర్ చేసేందుకు కుట్ర పన్నారన్నారు. తరలింపు ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అమానవీయంగా వ్యవహరించారన్నారు. -
త్వరలో ‘కింగ్ పిన్’ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు: అనురాగ్ ఠాకూర్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ ఎంపీ సంజయ్సింగ్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ సర్కార్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన విమర్శలు చేశారు. ఇదే సమయంలో సీఎం కేజ్రీవాల్ను టార్గెట్ చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే ఈ కేసులో ‘కింగ్ పిన్’(కేజ్రీవాల్) కూడా జైలులో ఉంటారని అన్నారు. అయితే, మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారు జైల్లో ఉన్నారని, ఆయన కూడా త్వరలోనే జైలుకు వెళ్లారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారు. ఆరోగ్య మంత్రి జైల్లో ఉన్నారు, ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చిన వారే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కౌంటరిచ్చారు. केजरीवाल पर जमकर भड़के अनुराग ठाकुर बोलें, इनके मंत्री से लेकर सांसद तक सब जेल में हैं।#anuragthakur #BJP #newliquorpolicy #SanjaySinghArrested #ManishSisodia pic.twitter.com/LAhuFaQTm3 — Chaupal Khabar (@ChaupalKhabar) October 5, 2023 లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు బయట ఉన్న కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు. ఆయన నెంబర్ కూడా వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కానీ రెండు నెలల్లోనే అవినీతి కారణంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చిందని ఠాకూర్ విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. సంజయ్ సింగ్ అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది మోదీ భయాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల వరకు ఇంకా చాలా మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement