రాష్ట్ర పంచాయతీరాజ్,ఐటీ మంత్రి కేటీఆర్
వేములవాడ : అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సంక్షేమం గురించి నిర్మాణాత్మక సూచనలు చేయూల్సిన ప్రతిపక్ష పార్టీలు ఆ విషయూన్ని మరిచి అరిచి పెడబొబ్బలు పెట్టాయని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మండలాలకు తాగునీరందించే వాటర్గ్రిడ్ పైలాన్ను ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ మొబైల్ వ్యాన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై విరుచుకుపడ్డారు. ‘
‘జానారెడ్డి జానేడు సూచన చేయలేదు, చిన్నారెడ్డి చిన్నపాటి సలహా ఇవ్వలేదు, జీవన్రెడ్డి రైతుల జీవితాల గురించేమీ చెప్పలేదు, దయాకరన్న రైతుల పట్ల దయచూపనే లేదు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కిషన్రెడ్డి కూడా తిడుతుండు. రైతులు చనిపోవడం ఎవరికి సంతోషమయ్యా? మనస్సున్న వారి గుండె కరగదా? బాధకాదా? ముఖ్యమంత్రి కావాలనుకుంటే వారి (ప్రతిపక్షాల) బట్టలిప్పి వత్తుండే. 42 ఏండ్లు ఒక పార్టీ, 17 ఏండ్లు ఇంకో పార్టీ రాజ్యమేలింది. ఏం జేసిండ్రు, ఏం ఉద్ధరించిండ్రు, అరవైఏండ్ల గబ్బు... ఇంత తొందరగా పోతదా.. మాట్లాడడానికి సిగ్గు లేదూ..!’’ అంటూ ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6లక్షలు ఎక్స్గ్రేషియూ ప్రకటించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందన్నారు.
ఇంటింటికి నీళ్లివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగం
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్గ్రిడ్ పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కేటీఆర్ చెప్పారు. ఏ ఆడబిడ్డ కూడా నెత్తిన బిందెతో రోడ్లపై కనిపించే పరిస్థితి దాపురించవద్దని, వంటింటిలోనే నల్లా తిప్పితే నీరు వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పైప్లైన్ల ఏర్పాటుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రత్యేక చట్టం తీసుకొచ్చామన్నారు. ప్రతి ఇక్కరూ సహకరిస్తేనే ఈ పథకం విజయవంతమవుతుందని పేర్కొన్నారు.
కావాలనే ప్రతిపక్షాల రచ్చ
Published Sat, Oct 3 2015 3:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement