అంటిగ్వాలో వెస్టిండీస్తో జరిగే మూడో వన్డేలో జట్టు కూర్పుపరంగా ప్రయోగాలు చేస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపారు. మూడో వన్డేలో కొత్త కుర్రాడు రిషభ్ పంత్కు జట్టులో తీసుకునే అవకాశముందని తెలిపాడు. ఐదు వన్డేల సిరీస్ కోసం టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండో వన్డేలో ఘనవిజయం సాధించిన తర్వాత కెప్టెన్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ‘జట్టు కూర్పు విషయంలో ఏమేం మార్పులు చేయాలో మేం కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అంటిగ్వా మ్యాచ్లో జట్టులో మార్పులు చేసే అవకాశముంది. కొందరికి తుదిజట్టులో అవకాశం దొరకొచ్చు’ అని చెప్పాడు.
కరీబియన్ పర్యటనలో భారత్ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో రెండో వన్డేలో విండీస్ను చిత్తు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే శతకంతో చెలరేగగా, ధావన్, కోహ్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమైంది. యువ బౌలర్ కుల్ధీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ ఫేస్బుక్లో ప్రధాని మోదీ తర్వాత అత్యధికమంది ఫాలో అవుతున్న వ్యక్తిగా తాను రికార్డు సొంతం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. మైదానంలో తమ ఆటతీరు వల్లే ఇలాంటివి సొంతమవుతాయని చెప్పాడు.
మూడో వన్డేలో అతనికి చాన్స్ ఇస్తాం: కోహ్లి
Published Mon, Jun 26 2017 8:55 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
సన్రైజర్స్ ఫ్యాన్స్తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
లండన్ చేరుకున్న సీఎం జగన్
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
తప్పక చదవండి
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement