రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Mon, May 2 2016 1:28 AM

man killed in road accident

 చింతపల్లి : హైదరాబాద్ - నాగార్జునసాగర్ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి వైపు నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తున్న క్రేన్ వాహనం వెంకటంపేట నుంచి మల్లేపల్లి వైపు వెళ్తున్న ఐస్‌క్రీం విక్రయించే వాహనాన్ని వెంకటంపేట గ్రామ సమీపంలోని లక్ష్మణ్‌నాయక్‌తండా వద్ద వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్ కానావ్ జిల్లా భూర్గావ్ గ్రామానికి చెందిన బబ్లు (38) తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతుడిని 108 వాహనం ద్వారా హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement