ఇదేమైనా స్కూల్‌ అనుకుంటున్నారా..? | Sakshi
Sakshi News home page

ఇదేమైనా స్కూల్‌ అనుకుంటున్నారా..?

Published Wed, Mar 22 2017 3:02 PM

ఇదేమైనా స్కూల్‌ అనుకుంటున్నారా..? - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో సభ్యుల గందరగోళం మితిమీరటంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదేమైనా స్కూల్‌ అనుకుంటున్నారా అంటూ విసుక్కున్నారు. బుధవారం ఉదయం సభ క్వశ్చన్‌ అవర్‌తో ప్రారంభమైంది. క్వశ్చన్‌ అవర్‌ ముగిసేదాకా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలోనే ఉన్నారు. అది ముగిసిన వెంటనే ఆయన బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి సభ్యుల వాదులాట మొదలైంది. ఎంతకీ సభ్యులు నిశబ్దం పాటించకపోయేసరికి స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు.
పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు నెమ్మదించకపోటంతో ఏం జరుగుతోంది? ఇది స్కూలా? అంటూ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ్యులు నెమ్మదించారు. గొడవ సద్దుమణిగిన తర్వాత సభ కార్యకలాపాలు తిరిగి సజావుగా నడిచాయి.

Advertisement
Advertisement