ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్ ‘సరిలేరు నీకెవ్వరూ’లోని మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్ పాటకు చేసిన టిక్టాక్ వీడియోకు హీరోయిన్ రష్మిక మందన్న ఫిదా అయ్యారు. వార్నర్ పర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురిపించింది. కాగా తెలుగు స్టార్ హీరోల పాపులర్ పాటలకు తన భార్య, పిల్లలతో కలిసి స్టేప్పులేసిన వార్నర్ టిక్టాక్ వీడియాలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’లోని మైండ్ బ్లాక్ పాటకు ఆయన తాజాగా టిక్టాక్ చేశారు. (‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్’)
ఈ పాటలో ‘వాడిని కొట్టమని చెప్పు’ అనే లిరిక్స్కు వార్నర్ వినూత్నంగా టిక్టాక్ చేశాడు. ‘ఇది నా షాడో బ్యాటింగ్. ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నారు. మళ్లీ కలుద్దాం’ అంటూ షేర్ చేసిన ఈ టిక్టాక్ వీడియో.. ప్రారంభంలో బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజిచ్చిన వార్నర్ ఆ తర్వాత మాయమైపోతాడు. ఇది చూసిన రష్మిక వార్నర్ క్యాప్షన్కు ఫిదా అవుతూ.. ‘‘డేవిడ్ వార్నర్ చంపేశారు పో.. మీ క్యాప్షన్ చదివాక నవ్వు ఆగడం లేదు’’ అంటూ ఆయన వీడియోకు కామెంట్ పెట్టారు. (ఎన్టీఆర్కు వార్నర్ స్పెషల్ విషెస్!)