బాలీవుడ్‌ నటుడు మహేశ్‌ ఆనంద్‌ మృతి | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటుడు మహేశ్‌ ఆనంద్‌ మృతి

Published Sun, Feb 10 2019 1:47 AM

Bollywood Villain Mahesh Anand Dead  - Sakshi

1980, 90 దశకంలో విలన్‌గా బాగా పాపులర్‌ అయిన బాలీవుడ్‌ నటుడు మహేశ్‌ ఆనంద్‌ కన్నుమూశారు. ‘శెహన్‌షా, మజ్‌బూర్, స్వర్గ్, తనీదార్, విజేత, కురుక్షేత్ర’ వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించారు మహేశ్‌. ఎస్వీ కృష్ణారెడ్డి  తీసిన ‘నంబర్‌ వన్‌’ సినిమాలోనూ నటించా రాయన. 2002లో భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ముంబైలో మహేశ్‌ ఒంటరిగానే ఉంటున్నారు. ఈ ఏడాది రిలీజైన ‘రంగీలా రాజా’ చిత్రంతో 18 ఏళ్ల తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చారు. ‘‘18 ఏళ్లుగా ఎవ్వరూ నాకు సినిమా ఆఫర్‌ చేయలేదు. పని, డబ్బు లేకుండా ఇన్నేళ్లు ఒంటరిగా బతికాను. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తులతో పని చేశాను. కానీ నన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు’’ అని చివరిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మహేశ్‌.  

Advertisement

తప్పక చదవండి

Advertisement