విద్యార్థిని అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అనుమానాస్పద మృతి

Published Fri, Jul 7 2017 11:08 AM

student suicide attempt in westgodavari

తాడేపల్లిగూడెం రూరల్‌ : ప్రేమించిన యువకుడు మృతి చెందటంతో మనస్థాపం చెందిన 16ఏళ్ల యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో జరిగింది. స్థానిక వీకర్స్‌ కాలనీకి చెందిన షేక్‌ రజియాబేగం (16) ఓ కళాశాలలో  ఇంటర్మీడియట్‌ చదువుతోంది. తాను ప్రేమించిన సురేష్‌ అనే యువకుడు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.

దీంతో మనస్థాపం చెందిన రజియా బేగం సురేష్‌ మృతదేహాన్ని చూసి వచ్చింది. రజియా బేగం గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. అన్నయ షేక్‌ ముస్తాఫా ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై సూర్యభగవాన్‌ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement