♦ మంత్రులు, టీడీపీ నేతలపై ముఖ్యమంత్రి అసహనం
♦ ‘తుని’ కేసులో ముద్రగడ తప్ప మిగిలిన వారి అరెస్టుకు యోచన
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విజయవాడ: కాపుల ఆందోళన సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీతోపాటు ఇతర పార్టీలు, వివిధ కుల సంఘాలు తనపై చేసిన ఆరోపణల దాడిని మంత్రులు, టీడీపీ నేతలు సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్లో సభ్యుల నియామకం, బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై క్యాంప్ ఆఫీసులో బుధవారం ఆయన నారా లోకేష్తోపాటు మంత్రులతో సమీక్ష జరిపారు. కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు దీటుగా ఎదుర్కోలేకపోయారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కాపు కమిషన్లో ముద్రగడ పద్మనాభం నుంచి నాలుగు పేర్లు తీసుకుని అందులో ఒకరిని మనమే ఎంపిక చేద్దామని సీఎం చేసిన సూచనను నాయకులు సమర్థించారు. తునిలో రైలు దహనం, పోలీసు స్టేషన్ల కాల్చివేత కేసుల్లో ముద్రగడను తప్పించి, మిగిలిన వారందరినీ ముద్దాయిలు చేస్తేనే పార్టీకి ఉపయోగం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్, ప్రకాష్గౌడ్ టీఆర్ఎస్లో చేరికపై కూడా చర్చ జరిగింది. ఎంత మంది వెళ్లినా పార్టీకి నష్టం లేదనే వాదనతో తెలంగాణలో టీడీపీ కేడర్ను నిలుపుకునే ప్రయత్నం చేద్దామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, నారాయణ పాల్గొన్నారు..
టీడీపీ జిల్లా అధ్యక్షుల మార్పు?
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జిల్లా మహానాడుల్లో వీరిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలుగా మారారు. మరికొందరు అంతకు ముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలయ్యారు. వీరు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టకపోవడం, కనీసం సమావేశాలు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొనడంతో అధ్యక్షులను మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
ఆరోపణలను తిప్పి కొట్టలేకపోయారు
Published Thu, Feb 11 2016 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement