పెరుగుతున్న సెల్‌ఫోన్ ట్రేడింగ్ | Trading cellphone hike | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న సెల్‌ఫోన్ ట్రేడింగ్

May 8 2015 1:46 AM | Updated on Sep 3 2017 1:36 AM

సెల్‌ఫోన్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ విస్తరిస్తోందని, తమ కస్టమర్లలో 30 శాతానికిపైగా...

నెలకు రూ.1,899 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ ట్రేడింగ్
* ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ ఈడీ వికాస్ సింఘానియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్‌ఫోన్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ విస్తరిస్తోందని, తమ కస్టమర్లలో 30 శాతానికిపైగా సెల్ ఫోన్ ద్వారానే చేస్తున్నారని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వికాస్ సింఘానియా చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థకు  దేశ వ్యాప్తంగా 16 వేల మంది కస్టమర్లున్నారని, వీరిలో 40 శాతం దక్షిణ భారతం నుంచే ఉన్నారని తెలియజేశారు. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలియజేశారు. ‘‘దక్షిణ భారతదేశ ప్రజలు టెక్నాలజీతో పాటు ట్రేడింగ్ అన్నా.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డబ్బు జమ చేయడం కంటే షేర్ మార్కెట్లో సొమ్మును మదుపు చేయడమే బెటరని వారు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లలో వ్యాపారుల కంటే ఉద్యోగులే ఎక్కువగా ఉండటం దీన్ని నిరూపిస్తోంది’’ అని ఆయన చెప్పారు. 2013 జనవరిలో ముంబై కేంద్రంగా స్థాపించిన తమ సంస్థ ద్వారా రోజుకు 2,500 కోట్ల ట్రేడింగ్ జరుగుతోందని, ఇది ఎన్‌ఎస్‌ఈలో మొత్తం ట్రేడింగ్‌లో 1 శాతంగా ఉందని చెప్పారాయన. ‘‘నెలకు రూ.1,899 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ట్రేడింగ్ చేసేవారు చాలా తక్కువ. ట్రేడింగ్‌పై ప్రజల్లో విస్తృతమైన ప్రచారం జరిగితేనే ఈ సంఖ్య పెరుగుతుంది’’ అని చెప్పారు. తమ సంస్థ నిధుల సమీకరణపై తొలిసారిగా దృష్టిపెట్టిందని, 10 మిలియన్ డాలర్ల పీఈ ఫండ్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement