అనంతపురం సెంట్రల్ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ - వెలుగు ప్రాజెక్టులో మరో చీకటి కోణం బయటపడింది. నకిలీ స్వయం సహాయక సంఘాలను సృష్టించి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ తతంగం నడుస్తోంది. అధార్ అనుసంధానం చేయడంతో అక్రమాల లోగుట్టు కాస్త వెలుగులోకి వస్తోంది. మండల, క్షేత్ర స్థాయి అధికారులే ఇందులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 54 వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 5.60 లక్షల మంది సభ్యులున్నారు.
ప్రతి సంవత్సరం బ్యాంకుల నుంచి వందల కోట్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. ఒక్క బ్యాంకు లింకేజీ ద్వారానే రూ. 600 కోట్లకు పైగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. స్త్రీనిధి, ఇతర రుణాలు కలుపుకొని ప్రతి ఏటా మొత్తం వెయ్యి కోట్ల వరకూ రుణాలు మంజూరవుతున్నాయి. ఇటీవల రుణమాఫీ కోసం అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో రూ.995 కోట్లు ఎస్హెచ్జీలపై అప్పు నిల్వ ఉన్నట్లు తేల్చారు.
వ్యవసాయ ఆధారిత రుణాలు, పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు వెనుకంజ వేస్తారేమో కానీ స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయడానికి మాత్రం ఆలస్యం చేయలేదు. ప్రతి సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యానికన్నా ఎక్కువ నిధులు మంజూరు చేసి అనేక మార్లు జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. దీన్నే ఆసరాగా చేసుకొని కొంత మంది మండల స్థాయి, క్షేత్రస్థాయి సిబ్బంది నకిలీ సంఘాలను సృష్టించారు.
సభ్యులు లేకున్నా నకిలీ పేరుతో సంఘాన్ని సృష్టించి ప్రభుత్వం, బ్యాంకులు మంజూరు చేసే రుణాలను తీసుకున్నారు. ప్రభుత్వ రాయితీలతో సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం కాస్త గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆధార్ అనుసంధానం కార్యక్రమంలో బయటపడింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం ఆధార్ అనుసంధానం పూర్తయింది. మిగిలిన 20 శాతం పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు ఎంత గింజుకుంటున్నా ముందుకు కదలడం లేదు.
మరో పది, పదిహేను రోజుల్లో ఆధార్ అనుసంధానం కాని 20 శాతం సంఘాల్లో ఎంత మందికి ఆధార్ లేదు.. వలస వెళ్లిన వారు ఎంత మంది.. నకిలీ సంఘాల పేరుతో సొమ్ము చేసుకున్న సంఘాలు ఎన్ని అనే అంశాలను అధికారులు బహిర్గతం చేయనున్నారు. 10 శాతం సంఘాలు నకిలీవేనని ఇప్పటికే అధికారులు ఓ నిర్ధారణకు వస్తున్నారు.
ఇటీవల ఆధార్ అనుసంధానంపై ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షలో సంబంధిత సెక్షన్ ఆధికారి.. నకిలీ సంఘాలు ఉండడం ద్వారా అధార్ అనుసంధానంలో వెనుకబడ్డామని అధికారులకు వివరణ ఇచ్చారు. దీంతో నకిలీ సంఘాల విషయం బయటపడింది. కాగా, కొంత మంది అధికారులే నకిలీ సంఘాలను సృష్టించారనే అరోపణలు వస్తుండడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నకిలీ సంఘాలు వాస్తవమే : మల్లీశ్వరిదేవి, ఇన్చార్జ్ పీడీ, డీఆర్డీఏ-వెలుగు ప్రాజెక్టు
జిల్లాలో నకిలీ స్వయం సహాయక సంఘాలు ఉన్న మాట వాస్తవమే. వీటిని నిర్మూలించేందుకే ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రస్తుతం మిగిలిపోయిన వారంతా నకిలీ అని చెప్పలేం. ఇందులో కొంత మందికి ఆధార్ ఉండకపోవచ్చు. త్వరలో ఎన్ని సంఘాలు నకిలీవి ఉన్నాయనే విషయం బయటపడుతుంది.
‘వెలుగు’లో చీకటి కోణం
Published Sat, Jan 3 2015 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement