►రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా
►484 మందికి 10కి 10 జీపీఏ
►98.54 శాతం ఉత్తీర్ణత బాలికలదే పైచేయి
►సంబరాలు చేసుకున్న విద్యా శాఖాధికారులు
సాక్షి ప్రతినిధి, కడప : పదవ తరగతి ఫలితాలల్లో వైఎస్సార్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 98.54 శాతం ఉత్తీర్ణులై తొలిసారిగా ఈ ఘనత సాధించారు. మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వచ్చిన జిల్లా.. ఈ ఏడాది రాష్ట్రానికి తలమానికంగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 35,366 మంది పరీక్షలకు హాజరవ్వగా 34,848 మంది ఉత్తీర్ణులయ్యారు. దాంతో 98.54 శాతంతో జిల్లా ప్రథమ స్థానానికి చేరుకుంది. బాలుర విభాగంలో 17399 మందికి గాను 17733 మంది ఉత్తీర్ణులై 98.54 శాతం ఫలితాలు సాధించారు.
బాలికల విభాగంలో 17,367 మందికి గాను 17,115 మంది ఉత్తీర్ణత సాధించి 98.55 శాతం ఫలితాలతో బాలుర కంటే ఒకమెట్టు పైన నిలిచారు. జిల్లా యంత్రాంగం సమష్టి కృషి, విద్యార్థుల పట్టుదల కారణంగా గత సంవత్సరం సాధించిన రెండవ స్థానం నుంచి మరో మెట్టుపెకైక్కి ప్రథమ స్థానంలో నిలిచింది. మంచి ఫలితాలు సాధించడంతో విద్యా శాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ప్రథమ, చివరి స్థానాలు రాయలసీమలోనే...
పదవ తరగతి ఫలితాలల్లో వైఎస్సార్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ, చివర స్థానాలు రాయలసీమకే దక్కాయి. వైఎస్సార్ జిల్లా 98.54 శాతం సాధించగా, అనంతపురం జిల్లా 93.11 శాతం, కర్నూలు జిల్లా 90.97 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చిత్తూరు జిల్లా 71.29 శాతం ఫలితాలతో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. కాగా ఫలితాల కోసం ఇంటర్నెట్ కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ సైతం 100 శాతం ఫలితాలు సాధించి అటు క్రీడలు, ఇటు చదువులోనూ తిరుగులేదని చాటి చెప్పింది.
484 మందికి 10కి 10 జీపీఏ
జిల్లా విద్యార్థులు ఫలితాల్లో చరిత్ర ృసష్టించారు. ఏకంగా 484 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించి చరిత్ర ృసష్టించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం 10కి 10 పాయింట్లు సాధించి సత్తాచాటారు. 10 పాయింట్లు సాధించిన ప్రైవేట్ పాఠశాలల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. గత ఏడాది 87 మంది విద్యార్థులు మాత్రమే 10కి 10 పాయింట్లు సాధించారు. ఈమారు ఏకంగా 5 రెట్లు అధికంగా 484 మంది 10కి 10 పాయింట్లు సాధించడం విశేషం.
18 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
జూన్ 18 నుంచి జూలై 1వ తేదీ వరకు పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు జూన్ 2వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 4న ప్రధానోపాధ్యాయులు ఫీజును ట్రెజరీలో చెల్లించి 6న డీఈఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం జూన్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్షల విజయంలో డీఈఓ వెబ్సైట్ కీలకపాత్ర...
పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ర్ట స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంలో కడప డీఈఓ.కాం వెబ్సైట్ ఎంతో కీలకపాత్ర పోషించిందని జిల్లా విద్యాశాఖాధికారి బండ్లపల్లె ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. దీంతో పాటు నైట్విజన్, బడిబస తదితర అంశాలతో పాటు ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు, సిబ్బంది అందరి సమష్టి కృషితోనే విజయం సాధించామన్నారు. ఎస్సీఈఆర్టీ డెరైక్టర్, పాఠశాల విద్య డెరైక్టర్, కలెక్టర్ తదితర అధికారుల సూచనలతో నిపుణులతో తయారు చేసిన మెటీరియల్ను వెబ్సైట్లో ఉంచామన్నారు.
ఇందులోనుంచే దాదాపు 80 శాతం మేర ప్రశ్నలు రావడంతో విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. ఈ వెబ్సైట్ను 3 నెలల్లో 60 వేల మంది చూశారన్నారు. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 85 శాతం మేర ప్యాడ్స్, పెన్నులు, రబ్బర్లు, పెన్సిల్లు అందజేసినట్లు ఆయన తెలిపారు. స్థానికంగా ఎంఈఓలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇందుకు సహకరించాయని తెలిపారు.
డీఈఓ కార్యాలయం వద్ద సంబరాలు
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల డీఈఓ కార్యాలయ సిబ్బంది కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు. ఒకిరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం డీఈఓ కార్యాలయ ఆవరణంలో కేక్ కట్చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖపై ప్రశంసల వర్షం కురిసింది.
పదిలో ఫస్ట్
Published Thu, May 21 2015 3:43 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- ‘సత్య’ మూవీ రివ్యూ
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- 'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement