రైలు నుంచి జారిపడి తండ్రి, కొడుకు దుర్మరణం | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి తండ్రి, కొడుకు దుర్మరణం

Published Thu, May 28 2015 11:01 AM

accidentally a father and son died

నక్కపల్లి (విశాఖపట్టణం): విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గుల్లిపాడు వద్ద నడుస్తున్న రైలు నుంచి జారి పడిపోయి ఓ తండ్రీకొడుకు మృతి చెందారు. విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం కొండచిగువ గ్రామానికి చెందిన అగతాని వెంకట్రావు(45), ఆయన భార్య, కుమారుడు నవీన్(17) ఇటుకబట్టీల్లో పనిచేసేందుకు రాజమండ్రి నుంచి విజయనగరం వెళ్తున్నారు. తండ్రి, కొడుకు రైలు తలుపు వద్ద కూర్చున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నక్కపల్లి మండలం గుల్లిపాడు వద్ద నిద్ర మత్తులో నవీన్ రైలు నుంచి జారిపడగా అతనిని రక్షించే క్రమంలో వెంకట్రావు కూడా కిందకి పడిపోయాడు.

తండ్రీకొడుకు ఇద్దరూ సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అయితే, ఈ విషయం తెలియని వెంకట్రావు భార్య రాజమండ్రి చేరుకున్న తర్వాత భర్త, కుమారుడు కనిపించకపోవటంతో వారిని వెతుక్కుంటూ వెనక్కివెళ్లింది. అలా గుల్లిపాడుకు చేరుకుని రైలు పట్టాల వద్ద పడి ఉన్న మృతదేహాలను గుర్తించి కన్నీరుమున్నీరయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement