రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Published Thu, Jun 11 2015 8:18 AM

3 dies, 20 injures in road accident at ysr district

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం రామాపురం గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు...రామాపురం వద్ద గురువారం వేకువజామున 2.50 గంటలకు రెండు తుఫాన్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్నమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. తీవ్రంగా గాయపడిన 20 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

ప్రమాదం జరిగిన విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కడప వైపు నుంచి వస్తున్న వాహనం, తిరుపతి నుంచి వస్తున్న మరో వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement