-
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
హమరేశ్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన చిత్రం సత్య. ఈ చిత్రాన్ని వాలీ మోహన్దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను శివమ్ మీడియా బ్యానర్పై శివమల్లాల నిర్మించారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి సినిమాగా సత్య నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎనిమిది మంది దర్శకుల చేతుల మీదగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..'హమరేష్ చూడడానికి జీవీ ప్రకాష్ లాగా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ..' సత్య ట్రైలర్ చాల బాగుంది. టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి. అలానే మంచి సక్సెస్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ.' తమిళంలో ఈ సినిమాని నేను రంగోలిగా తీశాను. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తోంది. అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ..'ఈరోజు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నా. కానీ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంఛ్కే ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ప్రొడ్యూసర్ వరకు వచ్చా. నా కెరీర్ ముందు నుంచి సపోర్ట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మే 10న సత్య సినిమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుందరమూర్తి కేఎస్ సంగీతమందించారు. -
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్ లేరు. ఆయన ప్రస్తుతం 'వార్2' సెట్స్లో ఉన్నారు.జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ హిట్ టాక్తో స్ట్రీమింగ్ అవుతుంది. మే 1నుంచి నెట్ఫ్లిక్స్లో అలరిస్తుంది. ఇందులో మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తదితరులు నటించారు.హీరామండి వెబ్ సిరీస్లో ఉస్తాద్జీ పాత్రలో మెప్పించిన ఇంద్రేష్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హాతో ఇంటిమేట్ సీన్ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.‘సోనాక్షీకి, నాకు మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ కోసం ఎక్కువ రీటేక్లు తీసుకోలేదు. ఈ సీన్స్ తీస్తున్న సమయంలో నేను భయాందోళనకు గురైయాను. కాస్త సిగ్గుగా కూడా అనిపించింది. కానీ, సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్గా ఉండమని కోరారు. ఈ సీన్స్ కూడా ఆమె అమ్మగారి ముందే జరిగాయి. ఈ క్రమంలో సోనాక్షీ తల్లి ముందే నాతో మాట్లాడారు. ఈ సిరీస్లో ఇలాంటి సీన్లు అవసరం, కంగారు పడొద్దని చెప్పారు. సుమారు గంటకు పైగానే అందరం చర్చించుకున్నాకే షూట్ మొదలపెట్టాం. అందుకే ఎక్కువ రీటేక్లు తీసుకోలేదు. ఈ సిరీస్లో నా పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది నా కోసమే రూపొందించబడిందని నేను అనుకుంటున్నాను. సంజయ్ భన్సాలీ ప్రతీ సీన్ను చాలా జాగ్రత్తగా తీశారు.మరోక సన్నివేశంలో సోనాక్షి తన కాళ్లతో నా తలను టచ్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమె తల్లి పూనమ్ సిన్హా కూడా సెట్స్లో ఉన్నారు. ఆ సీన్ సమయంలో కాస్త ఇబ్బంది ఉన్నా.. ఆమె నాకు కొంత ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఇలాంటి ఎన్నో సీన్స్ మా మధ్య ఉన్నాయి. హీరామండి సెట్ నుంచి నాకు చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.' అని ఇంద్రేష్ మాలిక్ చెప్పాడు. -
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
గతేడాదిలో 'సలార్'తో ట్రెండింగ్లోకి వచ్చిన శ్రియా రెడ్డి తాజాగా 'తలైమై సేయలగం' వెబ్ సిరీస్తో రానుంది. తమిళంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్లో కాంతార ఫేమ్ కిషోర్ మరో లీడ్రోల్లో నటిస్తోన్నాడు. జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ సిరీస్ను రిలీజ్ చేస్తున్నారు.తలైమై సేయలగం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ను భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శ్రియారెడ్డితో పాటు కస్తూరి, భరత్, రమ్య నంబీశీన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ ఈ పొలిటికల్ మ్యాజిక్ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ గురించి కీలక సమాచారాన్ని మేకర్స్ ప్రకటించారు. మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు.రీసెంట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్కుమార్ ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై ఆమె నిర్మిస్తుంది. ఈ సిరీస్కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. -
డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. అవి మనసులైనా, మనుషులైనా! ఒకప్పుడు అందంతో, నటనతో ఊదరగొట్టిన ఎంతోమంది తారలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైన కనిపిస్తున్న నటి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె తండ్రి గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్.. తల్లి మమతా రావ్ కన్నడలో హీరోయిన్. సినీ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉన్న ఈమెను ఇప్పటికైనా గుర్తుపట్టారా? తన పేరు రక్షిత.తొలి చిత్రంతోనే హిట్2002లో అప్పు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ఇడియట్గా, తమిళంలో ధమ్గా రీమేక్ చేశారు. ఈ రెండుచోట్లా రక్షితే కథానాయిక. ఈ మూవీ విజయం సాధించడంతో తెలుగులో పెళ్లాం ఊరెళితే.., నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు.. ఇలా అనేక సినిమాల్లో నటించింది.సినిమాలకు గుడ్బైకన్నడలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ను పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లినాటి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'కొన్నిచోట్ల మామయ్యే పెళ్లికూతుర్ని మండపానికి తీసుకెళ్తుంటాడు. అలా నన్ను కూడా మా మామయ్య తీసుకెళ్లాల్సి ఉంది. ఆ రోజు అంతా రెడీ అయ్యాం.నో ఎంట్రీసమయానికి ఆయన కనిపించలేదు. తీరా ఆయన బయట ఏదో పనిమీద వెళ్లాడని తెలిసింది. తిరిగి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. నేను ఆమె మామయ్యను.. వెళ్లనివ్వండి అని చెబుతున్నా వాళ్లు వినిపించుకోలేదు. ఆయన ఎలాగోలా లోపలికి వచ్చేసరికే పెళ్లి తంతు దాదాపు పూర్తయింది. ఇప్పటికీ ఇది గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటాం' అని రక్షిత చెప్పుకొచ్చింది.చదవండి: ఆ వివాదంతో వార్తల్లో.. గుడ్న్యూస్ చెప్పిన సీరియల్ జంట
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement