Sakshi News home page

రూ.27.91లక్షల ఆస్తిపన్ను చెల్లింపు

Published Wed, Mar 27 2024 1:05 AM

- - Sakshi

వరంగల్‌ అర్బన్‌ : ఆర్టీసీ హనుమకొండ డిపో బల్దియాకు బకాయి పడిన ఆస్తిపన్ను రూ.27.91 లక్షలు చెల్లించారు. మంగళవారం హనుమకొండ డిపోలో బల్దియా డిప్యూటీ కమిషనర్‌ గొడిశాల రవీందర్‌ గౌడ్‌కు డిపో మేనేజర్‌ మోహన్‌రావు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ నగర పరిధిలోని గృహాల యజమానులు, ప్రభుత్వ అధికారులు తమ ఆస్తులకు సంబంధించిన పన్ను బకాయిలను ఈ నెల 31 లోపు చెల్లించాలన్నారు. వడ్డీ సొమ్ములో 90 శాతం రిబేట్‌ అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి యూసుఫుద్దీన్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, బిల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement