విద్యుత్‌షాక్‌తో హార్వెస్టర్‌ డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో హార్వెస్టర్‌ డ్రైవర్‌ మృతి

Published Fri, Nov 24 2023 1:30 AM

అరుణ్‌ (ఫైల్‌) - Sakshi

సంగెం: విద్యుత్‌షాక్‌తో హార్వెస్టర్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బీకోజీనాయక్‌ తండాలో గుగులోత్‌ వెంకటేష్‌ వరి పంటను తమిళనాడు రాష్ట్రంలోని రాండం గ్రామానికి చెందిన అరుణ్‌ పాలనీ(30) బుధవారం రాత్రి హార్వెస్టర్‌తో కోస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు 11 కేవీ తీగలు తగిలి ఆయన విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా అరుణ్‌ పాలనీ మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరుడి కుమారుడు ఎలంగో సెల్వరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.భరత్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement