హన్మకొండ అర్బన్: జిల్లాలో ఓటరుస్లిప్పుల పంపిణీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జనరల్ అబ్జర్వర్ డాక్టర్ గోపాలకృష్ణ, పోలీస్ అబ్జర్వర్ తోరో ఖార్గా అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్ఓలతో సమావేశం నిర్వహించి సత్వరమే పోల్ చిట్టీల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద సదుపాయలు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, డీఆర్ఓ గణేశ్, ఆర్ఓలు రమేశ్, శ్రీనివాస్ అధికారులున్నారు.
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
పోలింగ్ రోజు కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జనరల్ అబ్జర్వర్ డాక్టర్ గోపాలకృష్ణ అన్నారు. శనివారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. 50 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, మైక్రో అబ్జర్వర్లు 29న రిపోర్ట్ చేయాలని, 30న విధులు నిర్వహించి నివేదిక అందించాలన్నారు. ట్రెయినీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.
జనరల్ అబ్జర్వర్ గోపాలకృష్ణ
ఎన్నికల నిర్వహణపై సమావేశం