● పెందుర్తి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం రూ.25.19 కోట్లు వెచ్చించారు.
● మండలంలో మరో రూ.12కోట్ల రహదారులు టెండర్ పూర్తి చేసుకుని ఉన్నాయి.
● పెందుర్తి మండలం పెదగాడి–చింతగట్ల రోడ్డును రూ.5.40కోట్లతో నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణం ఇక్కడి ప్రజల నాలుగు దశాబ్దాల కల. ఆ కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెరవేర్చింది.
● రూ.2.99 కోట్లతో సుజాతనగర్ ప్రధాన రోడ్డును నిర్మించారు.
● రూ.1.98 కోట్లతో బీఆర్టీఎస్ రహదారి– పులగానివానిపాలెం రోడ్డు నిర్మాణం చేపట్టారు.
● రూ.12 కోట్లతో పెందుర్తి–సబ్బవరం ప్రధాన రహదారిని నిర్మించారు.
● రూ.కోటితో పాపయ్యరాజుపాలెం–లక్ష్మీపురం రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.
● రూ.2 కోట్లతో పినగాడి–కోట్నివానిపాలెం–గొరపల్లి–గొల్లలపాలెం రహదారి వేశారు.
● సబ్బవరం మండలంలో దాదాపు రూ.10 కోట్లతో రహదారుల నిర్మాణం పూర్తయింది.
● టెక్కలిపాలెం–నాయనమ్మపాలెం–వంగలి–ఒమ్మివానిపాలెం రోడ్డు నిర్మాణం కోసం రూ.3.15 కోట్లు వెచ్చించారు.
● పరవాడలో మండలంలో రూ.9 కోట్లతో రోడ్లు నిర్మాణం చేపట్టారు.
● రూ.2 కోట్లతో తానం–తాడి రహదారి నిర్మించారు.
● జీవీఎంసీ జోన్–8 పరిధిలోని రోడ్ల నిర్మాణం కోసం రూ.40 కోట్ల వరకు ఖర్చు చేశారు.
● సబ్బవరం, పరవాడ, పెందుర్తి గ్రామీణ మండలాల్లో తాగునీటి సదుపాయం కోసం రూ.27.45 కోట్లు నిధులు వెచ్చించారు.