ప్రత్యేక అవసరాల పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అవసరాల పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ

Published Thu, Nov 9 2023 12:22 AM

ట్యాబ్‌లు అందజేస్తున్న కలెక్టర్‌, జేసీ - Sakshi

విశాఖ విద్య: ప్రత్యేక అవసరాల పిల్లలకు అధునాతన సాఫ్ట్‌వేర్‌తో తీర్చిదిద్దిన ట్యాబ్‌లను బుధవారం కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌. విశ్వనాథన్‌ అందజేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలు చదువుతో పాటు, ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేందుకు ఇటువంటి సాంకేతిక పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు తగిన శ్రద్ధ తీసుకుని విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌, డీఈవో ఎల్‌.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీనివాసరావు, సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్‌ అబ్దుల్‌ ఆషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement