సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిలతో వివిధ పార్టీలు, పలు సంఘాలకు చెందిన నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోటస్ పాండ్లోని ఆమె కార్యాలయంలో మంగళవారం మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ సతీమణి అనితాసేన్ తనయుడితో కలిసి భేటీ అయ్యారు. ఈ క్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విద్యారెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి షర్మిల పార్టీలో చేరారు. ఓయూ కాలేజీ స్కాలర్, సోషల్ వర్కర్ శోభ, పొంగులేని శ్రీనివాస్రెడ్డి అనుచరులైన డి.సత్యనారాయణ రాజు తదితరుల కూడా షర్మిలకు తన మద్దతు తెలిపారు.
ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న కళాకారులను శిక్షణ తరగతులను ప్రారంభించారు. కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ రూపొందించిన పాటలతో పాటు షర్మిలకు మద్దతుగా జనరంజకంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన కళారూపాలపై ఆయన ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో దాదాపుగా 50 మంది ప్రజా గాయకులు పాల్గొన్నారు.