కారు, లారీ ఢీ చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీ చిన్నారి మృతి

Published Mon, Apr 8 2024 12:50 AM

కారు ప్రమాదాన్ని పరిశీలిస్తున్న మేదరమెట్ల ఎస్‌ఐ చంద్రశేఖర్‌ 
 - Sakshi

● నలుగురికి గాయాలు

మేదరమెట్ల: డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా అభం శుభం తెలియని చిన్నారి కానరానిలోకానికి వెళ్లింది. ఈ ఘటన బాపట్ల జిల్లా కొరి శపాడు మండలంలోని పి.గుడిపాడు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వైఎస్సా ర్‌ కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కుటుంబం శ్రీకాకుళంలో గత మూడేళ్లుగా వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఉగాది పండగ సందర్భంగా స్వస్థలం రైల్వేకోడూరు బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. అనంతరం వారు కారులో బయలుదేరారు. సరిగా గుడిపాడు జాతీయ రహదారి వద్దకు రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. తేరుకునే లోగా కారు మొదటగా డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ధార్విక (06) అక్కడికక్కడే దు ర్మరణం పాలవ్వగా మరో నలుగురికి గాయా లయ్యాయి.

గాయపడిన వారిలో శివసుందర్‌, ఈశ్వరయ్య, సంగతిక, నాగేశ్వరమ్మ, శేషవిన్‌ ఉన్నారు. క్షతగాత్రులను హైవే అంబులెన్సులో ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. మేదరమెట్ల ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement