కాంగ్రెస్‌, బీజేపీవి మాయమాటలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీవి మాయమాటలు

Published Thu, Nov 9 2023 5:56 AM

-

అందోల్‌లో అభ్యర్థి క్రాంతికిరణ్‌

మునిపల్లి(అందోల్‌): తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్రాంతికిరణ్‌ అన్నారు. బుధవారం మండలంలోని అల్లాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు పార్టీలో చేరగా కండువాలను కప్పి ఆహ్వానించారు. కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. రెండోసారి అందోల్‌ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీలకు డిపాజిట్లు దక్కకుండా చేయాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఈ రెండు పార్టీల మాయమాటలు నమ్మడానికి వారు సిద్ధంగా లేరన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొన్నారు.

‘సీఎంఆర్‌’ వేగవంతం చేయండి

సంగారెడ్డి టౌన్‌: నిర్ణీత సమయంలో కష్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) డెలివరీ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ మాధురి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా నుంచి రోజూ రైస్‌ మిల్లర్లు 27 ఆక్సులు(ఒక ఆక్స్‌ 290 క్వింటాలు) పెట్టాలని ఆదేశించారు. సీఎంఆర్‌ ను సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ డెలివరీ చేయాలన్నారు.

Advertisement
Advertisement