ఎన్నికల ప్రశాంతతకు సహకరించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రశాంతతకు సహకరించాలి

Published Wed, Nov 15 2023 1:30 AM

మాట్లాడుతున్న సీఐ శశిధర్‌రెడ్డి - Sakshi

● సీఐ శశిధర్‌రెడ్డి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌లో పార్టీల నాయకులతో ఎన్నికల ప్రవర్తన, నియమావళి గురించి అవగాహన కల్పించారు. అన్ని పార్టీల నాయకులు నియమావళి ప్రకారం ప్రచారం చేసుకోవాలని పేర్కొన్నారు. ఏ పార్టీ వారైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎన్నికల నియమావళికి లోబడి ముందుకు పోవాలని వివరించారు. గ్రామాల్లో డబ్బులు, మద్యం పంచితే సమాచారం అందించాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో ఎస్సై రమాకాంత్‌ వివిధ పార్టీల మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement