‘సెస్‌లో అగ్నిప్రమాదం ఓ కుట్ర’ | Sakshi
Sakshi News home page

‘సెస్‌లో అగ్నిప్రమాదం ఓ కుట్ర’

Published Wed, Nov 15 2023 1:30 AM

మాట్లాడుతున్న నాయకులు - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సెస్‌ కార్యాలయంలో దీపావళి రోజు జరిగిన అగ్నిప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే గౌస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఆరోపించారు. ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొనుగోలు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌స్తంభాలకు సంబంధించిన ఫైళ్లు ఉన్న గదిలో అగ్నిప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసేందేనన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సెస్‌ పాలకమండలిని రద్దు చేసి ట్రాన్స్‌కోలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజుయాదవ్‌, కిసాన్‌సెల్‌ జిల్లా నాయకులు మర్రి శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాహెబ్‌, మైనార్టీ సెల్‌ మండలాధ్యక్షుడు రఫీక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement