ఒంగోలు సబర్బన్: పోలీస్ సిబ్బంది వృత్తి పరమైన సమస్యలు ఏమైనా ఉంటే స్వయంగా తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ మలికాగర్గ్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వ్యక్తిగత సమస్యలతో పాటు బదిలీలు, హెచ్ఆర్ఏ తదితర సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. సిబ్బందితో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అర్జీలను సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐసీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, స్పందన ఎస్సై శ్రీనివాసరావుతోపాటు డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.