వీ జ్యువెలరీ మార్ట్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

వీ జ్యువెలరీ మార్ట్‌ ప్రారంభం

Published Sat, Dec 23 2023 4:36 AM

కస్టమర్లతో కళకళలాడుతున్న వీ జ్యూయలరీ మార్ట్‌ - Sakshi

డాబాగార్డెన్స్‌ (విశాఖపట్నం): హోటల్‌ మేఘాలయ సమీపంలోని నవరత్న ట్రేడ్‌ సెంటర్‌ 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ‘వీ జ్యువెలరీ మార్ట్‌’ను శుక్రవారం సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, నవరత్నం ఎస్టేట్స్‌ ప్రతినిధి సురేష్‌కుమార్‌ జైన్‌ ప్రారంభించారు. వైశ్యరాజు జ్యూయలర్స్‌ అధినేత వైశ్యరాజు ఫల్గుణరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. మంచుకొండ శ్యామ్‌, నవరత్న ఎస్టేట్స్‌ డైరెక్టర్‌ మొదటి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వీ జ్యువెలరీ మార్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ధరకే బంగారు ఆభరణాలు అందిస్తున్నట్లు తెలిపారు. వీవీఎస్‌ క్లారిటీ, ఈఎఫ్‌ కలర్‌ గల డైమండ్స్‌ క్యారెట్‌ రూ.49,900 నుంచి ప్రారంభమని, వాటిపై తరుగు, మజూరీ లేదన్నారు. జీఎస్టీ కూడా కస్టమర్ల తరఫున తామే చెల్లిస్తామన్నారు. రెగ్యులర్‌ వెండి వస్తువులపై కూడా తరుగు, మజూరీ లేదన్నారు. అత్యుత్తమమైన డిజైనరీ ఆభరణాలు ఫ్యాక్టరీ ధరకు ఎవరూ ఇవ్వలేరని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బ్రాంచ్‌ మేనేజర్‌ సయ్యద్‌ ఖాదర్‌ కోరారు.

జ్యూయలరీ మార్ట్‌ ప్రారంభిస్తున్న సురేష్‌కుమార్‌
1/1

జ్యూయలరీ మార్ట్‌ ప్రారంభిస్తున్న సురేష్‌కుమార్‌

Advertisement
Advertisement