సంగమేశ్వరుని సేవలో స్పీకర్‌ దంపతులు | Sakshi
Sakshi News home page

సంగమేశ్వరుని సేవలో స్పీకర్‌ దంపతులు

Published Tue, Dec 5 2023 4:58 AM

సంగమేశ్వరసన్నిధిలో అభిషేకం చేస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతులు  
 - Sakshi

వంగర: పవిత్ర పుణ్యక్షేత్రం సంగాంలో వెలసిన సంగమేశ్వర స్వామివారిని ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వాణి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదాశీస్సులు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్టించిన శివలింగం ఇక్కడ నెలకొని ఉండడం గొప్ప విశేషం అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ గేదెల వెంకటనాయుడు, ఎంపీటీసీ సభ్యురాలు గేదెల పారమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు గేదెల రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement