బొండపల్లి: వరల్డ్కప్ క్రికెట్ (ఇండియా–న్యూజిల్యాండ్) సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఆండ్ర ఎస్సై ఎస్.సిద్ధార్థ కుమార్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి వారి నుంచి ఒక సెల్ఫోన్తో పాటు రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు.
18న టెన్నికాయిట్
క్రీడాకారుల ఎంపిక
చీపురుపల్లి రూరల్: ఈనెల 18న ఉదయం 9గంటలకు చీపురుపల్లిలోని అగ్నిమాపకశాఖ కార్యాలయం వద్ద 41వ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ జిల్లా స్థాయి టెన్నికాయిట్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని టెన్నికాయిట్ అసోసియేషన్ స్టేట్సెక్రటరీ కేవీఎన్ సత్యనారాయణ గురువారం తెలిపారు. విజయనగరం అసోసియేషన్ ఆధ్వర్యంలో చీపురుపల్లి ఫైర్ అధికారి డి.హేమసుందరరావు సహకారంతో జరగనున్న ఎంపికలో ప్రతిభ చూపిన క్రీడాకారులు శ్రీకుకుళంలో జరగనున్న 41వ సీనియర్ టెన్నికాయిట్ స్టేట్మీట్లో ఆడతారని తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు 17వ తేదీ మధ్యాహ్నం 12గంటల్లోగా వారి పేర్లు, వివరాలను పీడీ ఎం.రామారావు ఫోన్ (9494014059) నంబర్కు తెలియపరచాలన్నారు.