గ్రామాల్లో రాజకీయ వేడి.. | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో రాజకీయ వేడి..

Published Thu, Dec 21 2023 1:04 AM

-

వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటి నుంచే గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. పంచాయతీ, పార్లమెంటు, మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు వరుసగా జరగనున్న విషయం తెలిసిందే. దాదాపు వచ్చే ఏడాదంతా పండుగ వాతావరణం నెలకొననుంది. ముందు జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అశావహులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. పార్టీల నాయకులు సైతం ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగకున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రధాన పార్టీల అండదండలతోనే అభ్యర్థులు బరిలో నిలువనున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము పడిన కష్టానికి ప్రతిఫలంగా తగిన సహకారాన్ని అందించాలని అశావహులు నాయకులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

Advertisement
Advertisement