Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో కొత్త మిషన్ లాంచ్ చేయనున్న పూరీ జగన్నాథ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు విజయ్. పూరీ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో 29-03-2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని రాసి ఉంది. దీన్ని బట్టి రేపు మధ్యాహ్నం 2.20 నిమిషాలకు సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మూవీయేనా? లేదంటే మరేదైనా కొత్త ప్రాజెక్టా? అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
— Vijay Deverakonda (@TheDeverakonda) March 28, 2022
చదవండి: అప్పుడు ఈ ప్రపంచమే వద్దనిపించింది.. ప్రకాశ్రాజ్ కామెంట్స్ వైరల్